అన్వేషించండి

TTD Kalyanamasthu: టీటీడీ కళ్యాణమస్తు అంటే ఏమిటి, ఇది ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా - మధ్యలో 11 ఏళ్ల గ్యాప్

TTD Kalyanamasthu: కళ్యాణమస్తు కార్యక్రమం ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయం కాదు. సామూహిక ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ సిద్దంగా ఉందని వైవీ సుబ్బారెడ్డి ఇటీవల స్పష్టం చేశారు.

TTD Kalyanamasthu: నిరుపేద కుటుంబాలకు చెందిన వారు టీటీడీ నిర్వహించే కళ్యాణమస్తు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ప్రకటన రావడంతో తమ వివాహం త్వరలోనే జరుగుతుందని, ఎన్నో కలలు కన్న పేదవారికి నిరాశే మిగిలింది. టీటీడీ కళ్యాణమస్తుకు తాత్కాలికంగా బ్రేకులు పడింది. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో నిర్వహించాల్సిన కళ్యాణమస్తు కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది టీటీడీ. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వివాహం చేసుకునే అదృష్టాన్ని టీటీడీ కళ్యాణమస్తు ద్వారా పేదవారికి అందిస్తోంది. కళ్యాణమస్తు ద్వారా ఎన్నో జంటలకు వివాహాలు జరిపించింది తిరుమల తిరుపతి దేవస్థానం.

నేటి సామూహిక వివాహాలకు బ్రేక్.. 
నేడు (ఆగస్టు 7వ తేదీ) ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీటీడీ ఇటీవల ప్రకటించింది. కానీ ఆదివారం ఉదయం చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్ల దశమి ఉదయం 8.07 గంటల నుంచి 8.17 గంటల మధ్య అనూరాధ నక్షత్రం సింహ లగ్నంలో జరిపించాల్సిన వివాహాలకు ఆటంకం తలెత్తింది. శుభ ముహూర్తాన్ని పండితులు నిర్ణయించినా.. ప్రభుత్వం అనుంచి టీటీడీకి అవసరమైన అనుమతులు లభించని కారణంగా సామూహిక వివాహాలు (కళ్యాణమస్తు) తాత్కాలికంగా రద్దయింది. అయితే కళ్యాణమస్తు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు టీటీడీ.

కళ్యాణమస్తు ఎప్పుడు మొదలైందంటే..
కళ్యాణమస్తు కార్యక్రమం ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయం కాదు. దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి ఛైర్మన్ గా ఉన్న సమయంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2006లో ఈ పథకానికి రూపకల్పన చేసిన  టీటీడీ.. 2007 ఫిబ్రవరి 21న ఈ కార్యక్రమం  ప్రారంభించింది. అప్పట్లో ఒక్కో జంటకు రూ. 7 వేల రూపాయలు వరకు ఖర్చు చేశారు. అప్పట్లో ప్రారంభించిన కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 34,017 జంటలను ఒక్కటి చేసిన టీటీడీ సుమారు 24 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు అంచనా వేసింది. 

బంగారపు తాళిబొట్టు, వెండి మెట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళి సామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధుమిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా టీటీడీ కల్పించేది. వివాహాలు జరిపించలేని పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి, తల్లిదండ్రులు లేని అనాథలకు కూడా ఈ కార్యక్రమం ఎంతో మేలు చేసింది. అప్పట్లో ఏడాదికి ఓమారు మాత్రమే టీటీడీ ఈ కార్యక్రమంను నిర్వహించేది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మారిన ప్రభుత్వాలు, పాలక మండళ్ల కారణంగా కల్యాణ మస్తు కార్యక్రమం నానాటికి మరుగున పడింది. టీటీడీ చివరగా 2011 మే 20న చివరి విడత కళ్యాణమస్తు నిర్వహించింది.

టాప్ హెడ్ లైన్స్

Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget