అన్వేషించండి

Tirupati Laddu Row: అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?

TTD News: రాష్ట్ర ప్రభుత్వ సమానమైన వ్యవస్థలో సమాచారం ఇవ్వడం లేదు. గతంలో జరిగిన తప్పిదాలను బహిర్గతం చేయడానికి ఇప్పుడు ఉన్న అధికారులు ఎందుకు సాహసించడం లేదు?

Tirumala News: తిరుమల శ్రీవారి పరమపవిత్రమైన పుణ్యక్షేత్రం. నిత్యం గోవిందా నామ స్మరణతో మారుమోగుతుంటుంది. రాష్ట్ర ప్రభుత్వంతో సమానమైన వ్యవస్థ కలిగిన టీటీడీలో చిత్రమైన పరిస్థితి ఉంది. ఆ విషయానికి సంబంధించైనా వివరాలు వెల్లడించడానికి ప్రభుత్వమేదైనా వెనకడుగు వేస్తుంది. 

తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉన్న ఇక్కడ ఏమి చేయాలన్న ప్రభుత్వం నియమించే ఐఏఎస్ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసే పాలకమండలి సైతం నిర్ణయం ఆయితే తీసుకుంటారు కాని అమలు చేయాల్సింది మాత్రం అధికారులు. రాష్ట్ర ప్రభుత్వంతో పోటీ పడి మరీ ఏడాది బడ్జెట్ టీటీడీ ప్రవేశ పెడుతుంది. ఇలాంటి ధార్మిక సంస్థలో నిధులు వివరాలు వెల్లడించడానికి టీటీడీ వెనుకడుగు వేస్తుంది. వచ్చే ఆదాయం గురించి చెబుతుంది కానీ ఖర్చులపై మాత్రం నీళ్లు నములుతుంది. ఈ ఖర్చుల వివరాలు తెలియకుండా లోపల ఏం జరుగుతుందో అనేది ఎలా తెలుస్తుందని చాలా మంది అడుగుతున్న ప్రశ్న.

5 సంవత్సరాల పాటు నిర్ణయాలు ఏవి? 
 రాష్ట్రంలో 151 సీట్లు సాధించిన వైఎస్సార్‌సీపీ టీటీడీని ఐదేళ్ల పాటు రూల్ చేసింది. నాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డి, సమీప బంధువైన భూమన కరుణాకర్ రెడ్డికి బోర్డు అధ్యక్షులుగా పని చేశారు. బోర్డులో ఎన్నడూ లేని విధంగా జంబో బోర్డు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులతో ఏర్పాటు చేశారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా ఆ ప్రక్రియ కొంత కాలానికి ఆగిపోయింది. ఐదేళ్ల పాటు టీటీడీలో తీసుకున్న అనేక నిర్ణయాలు టీటీడీ వెబ్ సైట్‌లో పెట్టలేదు. టీటీడీ పాలకమండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు టీటీడీ అధికారిక వెబ్ సైట్‌లో పెడతారు. ఏదైన ఎవరికైన కావాలంటే అందులో చూసుకోవచ్చు. అయితే వైసీపీ హయాంలో జరిగిన అనేక బోర్డు సమావేశాల నిర్ణయాలు వెల్లడించలేదు. నాటి టీటీడీ ఇన్ఛార్జి ఈవో, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి వీటిని వెబ్ సైట్‌లో పెట్టనివ్వకుండా చేశారని ఆరోపణలు ఉన్నాయి. 

కూటమి ప్రభుత్వం ఏర్పాడిన తరువాత 2024లో ఏర్పాటు చేసిన బోర్డు సమావేశంలోని కొన్ని నిర్ణయాలను మాత్రమే ఆన్‌లైన్‌లో పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో నాటి బోర్డు తీర్మానం, టెండర్ ఆమోదం, నెయ్యి ఇతర వస్తువుల ధరలు అందుబాటులో లేవు. దీనిపై ఇప్పుడు ఉన్న టీటీడీ అధికారులు అయిన వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. 

వైసీపీ తప్పు చేసింది అని చెబుతున్నారు తప్ప ఎక్కడా రికార్డుల్లో మాత్రం చూపడం లేదు. పాత విషయాలు మాట్లాడను అంటూ ఈవో తప్పించుకుంటున్నారు. 
సమాచార హక్కు చట్టం

సాధారణంగా ప్రభుత్వ, అనుబంధ సంస్థలు సమాచార హక్కు చట్టాన్ని తప్పక అనుసరించాలి. సమాచారం ఇవ్వని అధికారులకు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. టీటీడీ ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో సమాచార హక్కు చట్టం లేకుండా ప్రభుత్వం పూర్వం నిర్ణయం తీసుకుంది. అది ఉంటే ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో నీజాలు వెల్లడి అయ్యే అవకాశం ఉండేదని భక్తుల వాదన. టీటీడీలో ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొస్తే ప్రతి రోజు వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి.

Also Read: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
MLC Elections: 40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
Vijayawada: విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
Tirupati Laddu Row: అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
MLC Elections: 40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
40 అసెంబ్లీ స్థానాలకు ఒక ఎమ్మెల్సీ సీటు, పట్టభద్రుల ఎన్నికలకు ఊహించనంత పోటీ
Vijayawada: విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
విజయవాడ వరద బాధితులకు గుడ్ న్యూస్‌- నేడు ఖాతాల్లోకి రూ.597 కోట్లు
Tirupati Laddu Row: అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
అసలు వివరాలు చెప్పకుండా టీటీడీ తప్పించుకుంటుందా? ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడం లేదు?
Jammu Kashmir Elections 2024: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం - 26 స్థానాల్లో 239 మంది పోటీ 
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రారంభం - 26 స్థానాల్లో 239 మంది పోటీ 
Game Changer Second Single: 'గేమ్ ఛేంజర్'లో రెండో పాట 'రా మచ్చా మచ్చా'... ప్రేక్షకుల ముందుకు  వచ్చేది ఆ రోజేనంట!
'గేమ్ ఛేంజర్'లో రెండో పాట 'రా మచ్చా మచ్చా'... ప్రేక్షకుల ముందుకు  వచ్చేది ఆ రోజేనంట!
Rains: అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో రాబోయే 3 రోజులు వర్షాలు, ఏపీ తాజా వెదర్ రిపోర్ట్
అల్పపీడనం ఎఫెక్ట్ - తెలంగాణలో రాబోయే 3 రోజులు వర్షాలు, ఏపీ తాజా వెదర్ రిపోర్ట్
Share Market Opening 25 Sept 2024: రెండో రోజూ ప్రాఫిట్ బుకింగ్స్‌తో ప్రారంభం - పెరిగిన మెటల్స్‌, ఒత్తిడిలో ఐటీ స్టాక్స్
రెండో రోజూ ప్రాఫిట్ బుకింగ్స్‌తో ప్రారంభం - పెరిగిన మెటల్స్‌, ఒత్తిడిలో ఐటీ స్టాక్స్
Embed widget