అన్వేషించండి

DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !

Tirumala: తిరమలలో కర్ణాటక ప్రజాప్రతినిధులకు తొలి హారతి సౌకర్యం కల్పించాలంటూ సీఎం డీకే శివకుమార్ చేసిన ప్రకటనపై వివాదం ప్రారంభమయింది. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి శివకుమార్ మాటల్ని ఖండించారు.

Karnataka MLAs Rajya Harathi Proposal: భగవంతుడి సన్నిధిలో అందరూ సమానులే అనే వేదాంత సూత్రం.. నేటి ఆధునిక రాజకీయ, వీఐపీ సంస్కృతి ముందు వెలవెలబోతోంది. తాజాగా కర్ణాటక  ముఖ్యమంత్రి  డీకే శివకుమార్ చేసిన ఒక ప్రకటన దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణ, వీఐపీ ప్రొటోకాల్‌పై సరికొత్త జాతీయ చర్చకు తెరలేపింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత విశిష్టమైన అతిథులకు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారికి మాత్రమే ఇచ్చే  తొలిహారతిని.. ఇకపై కర్ణాటకకు వచ్చే ప్రముఖులకు, వీఐపీలకు కూడా విస్తరిస్తామంటూ ఆయన ప్రకటించారు. కర్ణాటక ఎమ్మెల్యేలు తిరుపతికి వెళ్తే దర్శనం కాకుండానే తిరిగి వస్తున్నారని, ఈ కొత్త ప్రతిపాదనతో వారు దేవుడి ముందు నిలబడి హారతి తీసుకునే అవకాశం దక్కుతుందని డీకే శివకుమార్ సమర్థించుకోవడంపై ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  

తొలి హారతిపై డీకే శివకుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు  

వాస్తవానికి తిరుమల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. దాని నియమ నిబంధనలు, ప్రొటోకాల్స్, పూజా విధానాలను నిర్ణయించే పూర్తి అధికారం టీటీడీ బోర్డుకు,  ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. పక్క రాష్ట్రానికి చెందిన డీకే శివకుమార్ తిరుమల అంతర్గత ఆచారాలపై గానీ, ప్రొటోకాల్ హారతులపై గానీ ఇలాంటి  ఏకపక్ష ప్రకటనలు చేయడానికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదు. అయినప్పటికీ, కర్ణాటకలో  భక్తులను, సొంత పార్టీ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడం కోసమే ఆయన ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కర్ణాటక ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు తిరుమలలో  మొదటి హారతి  దర్శన సౌకర్యాన్ని టీటీడీ కల్పించింది. దాన్ని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు ఏకంగా  నిత్య హారతి ని తమ రాష్ట్ర అధికారిక అతిథి మర్యాదల్లో భాగం చేస్తామనడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని బీజేపీ నేతలు సైతం మండిపడుతున్నారు.

భానుప్రకాష్ రెడ్డి విమర్శలు
    
డీకే శివకుమార్ చేసిన ఈ తాజా ప్రకటన అమలు కావాలంటే టీటీడీ బోర్డు ఆమోదం తప్పనిసరి.  కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన ప్రతిపాదనపై తిరుమల తిరుపతి దేవస్థానం  బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుమలలో మంత్రులు, ఎమ్మెల్యేల కోసం  నిత్యహారతి  దర్శనాన్ని వర్తింపజేయాలన్న డిమాండ్‌ను ఆయన పూర్తిగా ఖండించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఈ ప్రత్యేక గౌరవం కేవలం మైసూర్ మహారాజు వంశస్థులకు మాత్రమే దక్కే సాంప్రదాయ హక్కు అని, దీన్ని రాజకీయ అవసరాల కోసం లేదా ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్ కోసం వాడుకోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. పరమ పవిత్రమైన తిరుమల క్షేత్ర నియమాలను, ఆచారాలను రాజకీయ లబ్ధి కోసం మార్చాలని చూడటం సరికాదని ఆయన హితవు పలికారు.

కొత్త వివాదం

తిరుమల ఆంధ్రప్రదేశ్‌లో ఉందని, ఇక్కడి ఆలయ వ్యవహారాలు, పూజా విధానాలపై నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం టీటీడీ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని భానుప్రకాశ్ రెడ్డి గుర్తుచేశారు. పక్క రాష్ట్రానికి చెందిన నాయకులు తమ రాజకీయ మైలేజ్ కోసం తిరుపతి సంప్రదాయాలను వాడుకుంటూ ఇలాంటి ఏకపక్ష ప్రకటనలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వీఐపీల కోసం తగిన దర్శన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, కేవలం ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం అత్యంత విశిష్టమైన హారతి ఆచారాన్ని కేటాయించాలనడం సామాన్య భక్తుల హక్కులను కాలరాయడమే అవుతుందని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు తన నిబంధనలకు కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

DK Shivakumar: కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
కర్ణాటక ప్రజా ప్రతినిధులకు తిరుమల తొలిహారతి - డీకే శివకుమార్ వివాదాస్పద ప్రకటన !
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
YS Jagan vs Chandrababu Naidu:ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
ఆరు హత్యల నిందితుడిలాంటిదే జగన్‌ మైండ్ సెట్! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Embed widget