అన్వేషించండి

Tirumala Rush: తిరుమలలో ఘనంగా పూలంగి సేవ, సాధారణంగా కొనసాగుతున్న రద్దీ!

Tirumala Rush: తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. ప్రతీ గురువారం నిర్వహించే పూలంగి సేవను ఘనంగా జరిపిస్తున్నారు. బుధవారం స్వామి వారికి 5.15 కోట్ల హుండీ ఆదాయం నెలకొంది.

Tirumala Rush: తిరుమల శ్రీవారిని సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. బుధవారం ఒక్క రోజే 74,497 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 36,24 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. నిన్న ఒక్కరోజే స్వామి వారి హుండీ ఆదాయం 5.15 కోట్లు రూపాయలు వచ్చింది. ఇక సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా, సర్వదర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. అలాగే ప్రతీ గురువారం నిర్వహించే పూలంగి సేవను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు సిద్ధం అయ్యారు. స్వామి వారిపై ఉన్న ఆభరణాలు అన్ని తొలగించి, అరుదైన సుంగంధ పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తారు. 

మొదటి నివేదనగా పచ్చిపాలు..

శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరుస్తారు. బంగారు వాకిలి వద్ద సుప్రభాత శ్లోకాల పఠనంతో వేద పండితులు స్వామి వారిను మేలు కొల్పుతారు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాధనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు. శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. ఆ తరువాత శ్రీవారికి గొల్ల హారతి సమర్పించి, ముందుగా వైఖానస అర్చకులు బ్రహ్మ తీర్థాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాతే జియ్యంగార్లకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థంను అందిస్తారు.

తోమాల సేవ ప్రారంభం..

అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాల పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. అటు తర్వాత మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్ళపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేస్తారు. ఈ తంతుతో తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధా క్రమం తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు.

బెల్లంతో కలిపిన నువ్వుల పిండి సమర్పణ..

శ్రీవారి మూలవిరాట్టుకు ఆసనం, పాద్యం, అర్ఘ్యం, అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటు తరువాత ఆలయంలో ఉన్న అన్ని దేవుళ్లకు, విమాన వెంకటేశ్వరుడితో సహా ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. దీంతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నాపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేస్తారు. అటుతరువాత తర్వాత సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. 

ఆభరణాలన్నీ తొలగించి పూలంగి సేవ..

శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహిస్తారు. అనంతరం గురువారం తిరుప్పావడ సేవను నిర్వహించి, సర్కారు వారి హారతి జరిపి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవ మూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీత్ లగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు కన్నులపండువగా నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామి వారి ఒంటిపై ఉన్న ఆభరణాలన్నీ తొలగించి శాస్త్రోక్తంగా అర్చకులు పూలంగి సేవను నిర్వహిస్తారు. ఆ తర్వాత డోలోత్సవం నిర్వహించి శ్రీవారి ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల వల్ల వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి అర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు జరిపిస్తారు.

చివరగా ఏకాంత సేవ..

సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి  కైంకర్యాలను ప్రారంభిస్తారు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలు అలంకరించిన పుష్ప మాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహిస్తారు. అటు తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ande Sri : ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
Maganti Gopinath Family Problem: మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
Telangana cotton farmers Problems:  తేమ పేరుతో  పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
తేమ పేరుతో పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
Ustaad Bhagat Singh : 'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా?  డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్‌లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
Dhruv Jurel Century for India A | సెంచరీలతో చెలరేగిన ధ్రువ్ జురెల్
Abhishek Sharma World Record in T20 | అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు !
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ande Sri : ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
ప్రముఖ రచయిత అందెశ్రీ కన్నుమూత
Maganti Gopinath Family Problem: మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
మాగంటి గోపీనాథ్ కుటుంబ సమస్య తీరేదెన్నడు? న్యాయం అడుగుతున్న తల్లి, కుమారుడు
Telangana cotton farmers Problems:  తేమ పేరుతో  పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
తేమ పేరుతో పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
Ustaad Bhagat Singh : 'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
'మీసాల పిల్ల' To 'చికిరి చికిరి' సూపర్ ట్రెండ్ - పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
Nimmala RamaNaidu: భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
Honda Activa Vs TVS Jupiter: హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్‌ స్కూటీలలో ఏది బెటర్.. ధర, ఫీచర్లు ఇవే
హోండా యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్‌ స్కూటీలలో ఏది బెటర్.. ధర, ఫీచర్లు ఇవే
Jubilee Hills Politics: కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
Pawan Kalyan Visits Kumki Elephants: పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
Embed widget