అన్వేషించండి

కందుకూరు, గుంటూరు ఘటనలు ప్రభుత్వం కుట్రే- తప్పు చేసిన పోలీసులపై కేసులు: చంద్రబాబు

తెలుగుదేశాన్ని, ఆ పార్టీ నేతలు వేధించాలని ప్రయత్నిస్తున్న కొందరి పోలీసు అధికారులు, పోలీస్‌ వ్యవస్థపై కేసులు పెట్టబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. కచ్చితంగా వారందర్నీ కోర్టు బోనులోకి లాగుతామన్నారు.

పోలీసులు, ప్రభుత్వం చేసిన కుట్రల్లో భాగంగానే కందుకూరు, గుంటూరు ఘటనలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. తనను తన మీటింగ్‌లకు వచ్చే జనాలను కట్టడి చేయడానికే ఇలాంటి చర్యలకు తెగబడ్డారని విమర్శించారు. ఇలాంటివి చాలా చూశామని... ఎప్పుడూ భయపడి వెనక్కి వెళ్లలేదని... ఇప్పుడు కూడా వెనక్కి తగ్గేది లేదన్నారు చంద్రబాబు. 

తాము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వైఎస్‌ఆర్‌సీపీ మీటింగ్‌లకు ఇబ్బంది పెట్టలేదన్నారు చంద్రబాబు. తామే అడ్డుకొని ఉంటే జగన్, షర్మిల, విజయలక్ష్మి పాదయాత్ర చేసేవారా అనిప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా తన ప్రచార వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌లో పెట్టారని ఆరోపించారు. అందుకే నిరసనగా పాదయాత్రతో సభా వేదిక వద్దకు వెళ్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. 

తమను వేధించాలని ప్రయత్నిస్తున్న కొందరి పోలీసు అధికారులు, పోలీస్‌ వ్యవస్థపై కేసులు పెట్టబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు. కచ్చితంగా వారందర్నీ కోర్టు బోనులోకి లాగుతామన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటమని అభివర్ణించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ లీడర్లు కూడా ఆలోచించుకోవాలన్నారు చంద్రబాబు. అన్ని రంగాల్లో విఫలమైన జగన్‌... తన మానసిక ఆనందం కోసం ప్రజలను బెదిరించాలని ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. అందుకు ఉదాహరణే కుప్పంలో జరిగిన ఘటనలు అన్నారు. 

గతంలో ఎప్పుడూ కుప్పంలో ఆందోళనలు లేకుండా ప్రశాంతంగా ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ ఒక్క చోటే కాదని రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. ప్రజల్లో అశాంతి ఉందని... మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. 

మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్‌పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎవరు ఎవరిపై దాడి చేశారో ప్రపంచమంతా చూస్తోందన్నారు. కుప్పంలో గతంలో లేని వివాదాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. కచ్చితంగా భవిష్యత్‌లో దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మొన్న పంచాయతీ ఎన్నికల్లో పోలీసులను, నాయకులను పెట్టి బెదిరిస్తే గెలిచినట్టు కాదని... వచ్చే ఎన్నికల్లో ప్రజలు సత్తా చూపుతారన్నారు. మొన్న దొంగచాటున వచ్చిపోయినట్టు కాదని... దమ్ముంటే ఇప్పుడు రావాలని సవాల్ చేశారు. ప్రజలు వెంబడించి కొడతారని వార్నింగ్ ఇచ్చారు.   

కుప్పంలో ‌నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఉదయం 10:30 నుంచి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరించారు. 11:30 నుంచి కుప్పం టీడీపీ కార్యాలయంలో గుడుపల్లి మండల 5 ,6 క్లస్టర్ లతో సమావేశమయ్యారు. 12 నుంచి రామకుప్పం మండల 3,4 క్లస్టర్‌లతో సమావేశమయ్యారు. మధ్యాహ్నన భోజన విరామం తర్వాత 2.30 నుంచి శాంతిపురం మండల 1 ,2 క్లస్టర్లతో మీటింగ్ నిర్వహించనున్నారు. 4 నుంచి కుప్పం మండల 7, 8, 9 క్లస్టర్లతో సమావేశం కానున్నారు. 6 నుంచి కుప్పం మున్సిపాలిటీ 10, 11 క్లస్టర్లతో సమావేశం అయ్యి పార్టి కేడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు.

మొదటి రోజు అవాంతరాలు, అడ్డగింత నడుమ చంద్రబాబు నాయుడు పర్యటన ఉత్కంఠగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్-1 నిబంధనల‌ మేరకు సభలు, రోడ్డు షోకు పోలీసులు అనుమతి ఇవ్వక పోవడంతో టిడిపి అధినేత చంద్రబాబు పోలీసులపై ఫైర్ అయ్యారు. పోలీసుల తీరుపై టిడిపి‌ కేడర్ ఆగ్రహించింది. చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో చంద్రబాబు శాంతిపురం ‌మండలంలో‌ఇంటింటి‌ ప్రచారం నిర్వహించారు. బుధవారం రాత్రి పదకొండు గంటల వరకూ చంద్రబాబు పర్యటించి ప్రజల సమస్య అడిగి తెలుసుకుని, నేను ఉన్నాంటూ భరోసా కల్పించారు. తరువాత కుప్పంలోనే బస చేసిన చంద్రబాబు రెండోవ రోజు కార్యక్రమాలు చేపట్టారు. 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై రెండు కేసులు పోలీసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేస్తామని డిఎస్పి సుధాకర్ రెడ్డి చెప్పడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిన్న ఘటనలపై చంద్రబాబుతోపాటుగా పలువురు టిడిపి నాయకులు మీద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telugu Woman Murder: అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telugu Woman Murder: అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాతో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Beyond Fixed Deposits : ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు.. FDల కంటే బెస్ట్
ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే డబ్బుల వర్షం కురుస్తుంది ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు
Embed widget