అన్వేషించండి

Road accidents: అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదాలు-9మంది మృతి

ఏపీలో రహదారులు రక్తమోడాయి. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదాల్లో 9 మంది మృతిచెందారు. 10మందికిపైగా గాయాలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదాలు 9మందిని బలితీసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో తిరుమల నుంచి తిరిగి వెళ్తున్న భక్తుల వాహనాన్ని  లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా... ఆరుగురు గాయపడ్డారు. ఇక, చిత్తూరు జిల్లా పూతలపట్టు దగ్గర ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టొంది. ఈ  ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు
.
కర్ణాటకలోని బెల్గాం జిల్లా అత్తిని మండలం బండిచేరి గ్రామానికి చెందిన 14 మంది తుఫాన్‌ వాహనంలో దైవ దర్శనానికి బయల్దేరారు. ముందుగా శ్రీశైలంలో మల్లన్న దర్శరం  చేసుకున్నారు. అక్కడి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లారు. కానీ తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం దొరకలేదు. దీంతో తుఫ్రాన్‌ వాహనంలోనే తిరుమల నుంచి  వెనుదిరిగారు. వీరి వాహనం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీ పల్లి మండలం మఠంపల్లి క్రాస్ దగ్గరకు  చేరుకుంది. అక్కడే ఈ ఘోర ప్రమాదం జరిగింది. వీరి వాహనాన్ని... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.  ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ముందుగా పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చేర్చి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా  ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

కేవీ పల్లి పోలీసులు.. మృతదేహాలను పీలేరు ఆస్పత్రికి తరలించారు. మృతులంతా కర్నాటక బలగాం జిల్లా బండిచేరి గ్రామానికి చెందినవారు. మృతిచెందిన వారు తుఫాన్  డ్రైవర్ హనుమంతు(30), యాత్రికుల్లో మరో హనుమంతు(40), అంబికా(14), శోభా(34), మనంద(32)గా గుర్తించారు. కేవీపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నారు. కేవీ పల్లి  ఎస్‌ఐ లోకేష్‌ ప్రమాదస్థలి పరిశీలించారు. ప్రమాద ఘటనపై విచారణ జరుపుతున్నారు. ప్రమాదం ఎలా జరిగింది..? కారణాలు ఏంటి..? అనే కోణంలో  దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోనూ ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గం తెల్లగుండ్లపల్లి సమీపంలో తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఆయిల్‌ ట్యాంకర్‌ను... ఆంబులెన్స్‌ ఢీకొట్టింది. బెంగళూరు నుండి ఒంగోలు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్‌ రోడ్డు ప్రక్కన ఆగి ఉంది. అదే సమయంలో.. బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి ఒడిశా వెళ్తున్న అంబులెన్స్‌.. ఆయిల్‌ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంబులెన్స్‌లోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురుకి తీవ్రగాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. మృతులు అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న మంజులత, త్రిలోచనా, ఉమేష్ చంద్ర, విజయ్‌గా గుర్తించారు. మృతి జతిన్, దేబభ్రత, అంబులెన్స్ డ్రైవర్ సంజయ్‌తోపాటు అయిల్‌ ట్యాంకర్‌ డ్రైవర్ శంకర్‌కు తీవ్రగాయాలు అయినట్టు చెప్పారు. గాయపడిన నలుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జరిగిన ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదమరి ఎస్సై సుమన్, కాణిపాకం ఎస్సై శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని... ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. గాయపడిన వారిని చిత్తూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Embed widget