అన్వేషించండి

Purandeshwari Questions: కేంద్రం సహకారాన్ని ప్రజలకు చెప్పడం లేదు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి పురందేశ్వరి ప్రశ్న

Purandeshwari Questions: రాష్ట్రాభివృద్ధి కోసం నరేంద్రమోడీ పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు పురేందేశ్వరి. కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు చెప్పడం లేదని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో చేస్తోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. తిరుపతి రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్న విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. 

రాష్ట్రాభివృద్ధి కోసం నరేంద్రమోడీ పెద్దపీట వేస్తున్నారని గుర్తు చేశారు పురేందేశ్వరి. కేంద్ర సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజలకు చెప్పడం లేదని ప్రశ్నించారు. అందుకే తామే ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించే కార్యక్రమం చేపట్టామన్నారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కార్యక్రమాలను బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. వాటి వివరాలను ప్రజలకు తెలియజేయనున్నారు.

కేంద్రం తరఫున చేపట్టే ప్రాజెక్టులను సందర్శించి వాటి వివరాలు తెలియజేసే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ను పురందేశ్వరి సందర్శించారు. అక్కడ జరిగే వివరాలపై మాట్లాడారు. 1700 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోందని వివరించారు. అంతర్జాతీయ హంగులతో తిరుపతి రైల్వే స్టేషన్ నిర్మాణం 311కోట్ల రూపాయలతో జరుగుతోందని పేర్కొన్నారు. 

ఈ రెండు పనులతోపాటు ఐఐటి, ఐజర్ లాంటి విద్యాసంస్థలకు 600 నుంచి 800కోట్ల రూపాయలను అందించింది కేంద్రమని తెలిపారు పురందేశ్వరి. మెరుగైన ప్రమాణాలతో విద్యను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీగా తిరుపతిని మార్చేందుకు 1695కోట్లను కేటాయించి 87 అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు. తిరుపతిలో 21వేల తాగునీటి కనెక్షన్లు, 16వేల మురుగునీరు కాలువల నిర్మాణానికి సహకారం అందించిందని వివరించారు. 

అభివృద్ధిలో ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉన్న భారతదేశాన్ని మూడో స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం మోడీ చేస్తున్నారని అభినందించారు పురేందేశ్వరి. అన్ని రాష్ట్రాల సహకారం ఉంటేనే భారతదేశం అభివృద్ధిలో మూడవ స్థానంలోకి రాగలదని అభిప్రాయపడ్డారు. అదే టైంలో ఆ రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టే పనులు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. 

పురాతన మండపాలను టిటిడి కూల్చివేయడం సరైన పద్ధతి కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. తిరుపతి పర్యటనలో భాగంగా అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలను ఆమె సందర్శించారు. అంతక ముందు అలిపిరి పాదాల మండపం వద్ద గల పురాతన మండపాలను ఆమె పరిశీలించారు. అనంతరం గోశాలలో గోపూజ నిర్వహించి గోవులకు ఆహారంగా దానా తినిపించారు.. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా జిల్లాల పర్యటనను శ్రీవారి పాదాల చెంత నుంచి ప్రారంభించడం స్వామి వారి అనుగ్రహంగా, తన అదృష్టంగా భావిస్తున్నట్లు పురందేశ్వరి చెప్పారు.

తిరుపతిలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించామన్నారు పురందేశ్వరి. అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న పురాతన మండపాన్ని పునరుద్ధరణ పేరుతో వాటిని తొలగించే వియోచనలో ఉన్నట్టు టీటీడీ ఉందని, వంద సంవత్సరాలు పైబడిన కట్టడాలను తొలగించకూడదని నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ మధ్యకాలంలో ఏఎస్ఐ సవరణ చేస్తూ దాదాపు 75 సంవత్సరాల పైబడిన కట్టడాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతితో పర్యవేక్షణలో మాత్రమే కూల్చివేయాలని నిబంధనలు ఉన్నాయని తెలిపారు. అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న పురాతన మండపం దాదాపు 500 సంవత్సరాల పైబడిందని కనుక టీటీడీ పునరుద్ధరణ పనులు చేపట్టాలన్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో జరగాలని బిజెపి డిమాండ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు..

తిరుమలలోని పార్వేటి మండపంను పునరుద్ధరణ పేరుతో పూర్తిగా తొలగించి ఇష్టానుసారం పార్వేటి మండపంలో నిర్మించడం సరైనది కాదని ఇలాంటి ఘటనపై బిజెపి పోరాటంకు సిద్ధంగా ఉంటుందని అన్నారు పురందేశ్వరి. శ్రీవారి భక్తులు సమర్పించేటువంటి కానుకలతో హిందూ ధర్మ పరిరక్షణకు గాని, ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలని, భక్తుల సమర్పించిన నగదులో ఒక్క శాతం తిరుపతి నగరం మున్సిపాలిటీలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనపై పోరాటం చేస్తే వైసిపి ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. అనేక టాక్స్ ల ద్వారా ప్రభుత్వంకు నగదు అందుతుందని, ఆ నగదుతోని తిరుపతి అభివృద్ధిని ప్రభుత్వం చేయాలని ఆమె చెప్పారు.. దోపిడీ వైఖరిగా స్వామివారికి సమర్పించిన కానుకలను తిరుపతి అభివృద్ధికి ఒక శాతం తీసుకోవడం మంచిది బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ తప్పుబట్టారు..

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
Anna Konidela Visits Thirumala: పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
పవన్ త్వరగా కోలుకోవాలని తిరుమలకు భార్య... కాలినడకన కొండకు... వేంకటేశ్వరునికి అన్నా కొణిదెల ప్రత్యేక పూజలు
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Guntur Crime News: గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
గుంటూరులో మహిళపై అమానుష దాడి- కఠిన చర్యలకు ప్రభుత్వం ఆదేశం 
Embed widget