అన్వేషించండి

AP Politics: సీఎం జగన్, వైసీపీ నేతల ఆదాయం పెరిగినట్లే, ఏపీ అప్పులు పెరుగుతున్నాయ్ - టీడీపీ నేతలు

VIPs in Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర అప్పులతో పాటు వైసీపీ నాయకుల ఆదాయం కూడా పెరుగుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

VIPs in Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టీడీపీ పులివెందుల ఇంఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ కడప జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలి..

ఆలయం వెలుపల కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల ఆదాయం పెరుగుతుంటే, రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతుందని ఆరోపించారు. వైసీపీ గవర్నమెంట్ ను గద్దె దింపి టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. కడప పార్లమెంట్ స్థానంలో నన్ను, పులివెందుల స్థానంలో బీటెక్ రవిని గెలిపించాలని కోరుకున్నానని తెలిపారు. అధికార ప్రతినిధులు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. 

బీటెక్ రవి మాట్లాడుతూ.. పులివెందుల అభ్యర్థిగా నన్ను, పార్లమెంట్ అభ్యర్ధిగా శ్రీనివాస్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకుని ప్రచారం ప్రారంభింస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఏపీ సీఎం జగన్ తన ఆదాయాన్ని మాత్రం భారీగా పెంచుకుంటున్నారని, ఇకనైనా సీఎం జగన్ కు మంచి మనస్సు ఇచ్చి, రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చేయాలని స్వామి వారిని ప్రార్ధించానన్నారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చడంపై వారికి ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుపై లేదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులను క్షేత్ర స్థాయిలో తిరిగి పరామర్శించారని... కానీ సీఎం జగన్ మాత్రం గాల్లో తిరిగి అటు నుంచి అటే వెళ్లిపోయారని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలో రావాలి..

అలాగే వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు సాయం న్యాయబద్దంగా లేదని విమర్శించారు. అదే టీడీపీ హయాంలో హుద్‌హుద్ తుఫాను సమయంలో ఇచ్చిన జీవో ద్వారా వరికి హెక్టారుకు ఇన్ పుట్ సబ్సిడీ రూ.15 వేలు ఇచ్చారని, అలాగే తిత్లీ తుఫాను సమయంలో మళ్లీ పరిహారం పెంచి రూ.20 వేలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 2020లోనే పూర్తయి ఉంటే ఈ వరద ముంపు వచ్చేది కాదని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే గెలిపించాలని.. అప్పుడే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని బీటెక్ రవి కామెంట్లు చేశారు. 
Also Read: BJP Vs YSRCP : కేంద్రంపై విమర్శల జోరు పెంచుతున్న వైఎస్ఆర్‌సీపీ ! బీజేపీతో దూరం పెరుగుతోందా ? జరుగుతోందా ?

Also Read: Undavalli : పోలవరం కట్టకుండానే భద్రాచలం ఎలా మునుగుతుంది ? పనులపై ఏపీ శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఉండవల్లి !

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget