అన్వేషించండి

AP Politics: సీఎం జగన్, వైసీపీ నేతల ఆదాయం పెరిగినట్లే, ఏపీ అప్పులు పెరుగుతున్నాయ్ - టీడీపీ నేతలు

VIPs in Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ క్రమంలోనే ఏపీ రాష్ట్ర అప్పులతో పాటు వైసీపీ నాయకుల ఆదాయం కూడా పెరుగుతుందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

VIPs in Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టీడీపీ పులివెందుల ఇంఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ కడప జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ రావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలి..

ఆలయం వెలుపల కడప టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ నాయకుల ఆదాయం పెరుగుతుంటే, రాష్ట్రం అప్పుల్లో కురుకుపోతుందని ఆరోపించారు. వైసీపీ గవర్నమెంట్ ను గద్దె దింపి టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలని స్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు. కడప పార్లమెంట్ స్థానంలో నన్ను, పులివెందుల స్థానంలో బీటెక్ రవిని గెలిపించాలని కోరుకున్నానని తెలిపారు. అధికార ప్రతినిధులు అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా సీఎం జగన్ కు మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామి వారిని కోరుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు.. 

బీటెక్ రవి మాట్లాడుతూ.. పులివెందుల అభ్యర్థిగా నన్ను, పార్లమెంట్ అభ్యర్ధిగా శ్రీనివాస్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారని చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకుని ప్రచారం ప్రారంభింస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఏపీ సీఎం జగన్ తన ఆదాయాన్ని మాత్రం భారీగా పెంచుకుంటున్నారని, ఇకనైనా సీఎం జగన్ కు మంచి మనస్సు ఇచ్చి, రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చేయాలని స్వామి వారిని ప్రార్ధించానన్నారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చడంపై వారికి ఉన్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుపై లేదని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు వరద బాధితులను క్షేత్ర స్థాయిలో తిరిగి పరామర్శించారని... కానీ సీఎం జగన్ మాత్రం గాల్లో తిరిగి అటు నుంచి అటే వెళ్లిపోయారని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలో రావాలి..

అలాగే వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు సాయం న్యాయబద్దంగా లేదని విమర్శించారు. అదే టీడీపీ హయాంలో హుద్‌హుద్ తుఫాను సమయంలో ఇచ్చిన జీవో ద్వారా వరికి హెక్టారుకు ఇన్ పుట్ సబ్సిడీ రూ.15 వేలు ఇచ్చారని, అలాగే తిత్లీ తుఫాను సమయంలో మళ్లీ పరిహారం పెంచి రూ.20 వేలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 2020లోనే పూర్తయి ఉంటే ఈ వరద ముంపు వచ్చేది కాదని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీనే గెలిపించాలని.. అప్పుడే రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని బీటెక్ రవి కామెంట్లు చేశారు. 
Also Read: BJP Vs YSRCP : కేంద్రంపై విమర్శల జోరు పెంచుతున్న వైఎస్ఆర్‌సీపీ ! బీజేపీతో దూరం పెరుగుతోందా ? జరుగుతోందా ?

Also Read: Undavalli : పోలవరం కట్టకుండానే భద్రాచలం ఎలా మునుగుతుంది ? పనులపై ఏపీ శ్వేతపత్రం విడుదల చేయాలన్న ఉండవల్లి !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RTC Charges Hike: ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్, హైదరాబాద్‌లో పెరిగిన సిటీ ఆర్టీసి బస్సు ఛార్జీలు
ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్, హైదరాబాద్‌లో పెరిగిన సిటీ ఆర్టీసి బస్సు ఛార్జీలు
Ambati Rambabu daughter wedding: అమెరికాలో అంబటి రాంబాబు కుమార్తె పెళ్లి -  వీసా సమస్యల కారణంగానే !
అమెరికాలో అంబటి రాంబాబు కుమార్తె పెళ్లి - వీసా సమస్యల కారణంగానే !
2027 ODI World Cup: వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడతారా ? చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన
2027 ODI వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడతారా ? చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన
AP Crime News: తంబళ్లపల్లెలో టీడీపీ నేతల అక్రమ మద్యం కుటీర పరిశ్రమ-పట్టుకున్న పోలీసులు - వీళ్ల ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !
తంబళ్లపల్లెలో టీడీపీ నేతల అక్రమ మద్యం కుటీర పరిశ్రమ-పట్టుకున్న పోలీసులు - వీళ్ల ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !
Advertisement

వీడియోలు

Perplexity AI CEO Aravind Srinivas Biography | 30ఏళ్ల వయస్సుకే AI ప్రపంచాన్ని శాసిస్తున్న ఇండియన్ | ABP Desam
India vs West Indies Test Match Record Breaking Centuries | ఆహ్మదాబాద్‌ టెస్ట్‌పై పట్టుబిగించిన భారత్
Sai Sudharsan India vs West Indies | వరుసగా విఫలమవుతున్న సాయి సుదర్శన్
KL Rahul Century India vs West Indies | కేఎల్ రాహుల్ సెంచరీల మోత
Ravindra Jadeja Record India vs West Indies | టెస్టుల్లో జ‌డేజా అరుదైన ఘ‌న‌త‌
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RTC Charges Hike: ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్, హైదరాబాద్‌లో పెరిగిన సిటీ ఆర్టీసి బస్సు ఛార్జీలు
ఆర్టీసీ ప్రయాణీకులకు షాక్, హైదరాబాద్‌లో పెరిగిన సిటీ ఆర్టీసి బస్సు ఛార్జీలు
Ambati Rambabu daughter wedding: అమెరికాలో అంబటి రాంబాబు కుమార్తె పెళ్లి -  వీసా సమస్యల కారణంగానే !
అమెరికాలో అంబటి రాంబాబు కుమార్తె పెళ్లి - వీసా సమస్యల కారణంగానే !
2027 ODI World Cup: వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడతారా ? చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన
2027 ODI వరల్డ్ కప్ లో రోహిత్, కోహ్లీ ఆడతారా ? చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కీలక ప్రకటన
AP Crime News: తంబళ్లపల్లెలో టీడీపీ నేతల అక్రమ మద్యం కుటీర పరిశ్రమ-పట్టుకున్న పోలీసులు - వీళ్ల ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !
తంబళ్లపల్లెలో టీడీపీ నేతల అక్రమ మద్యం కుటీర పరిశ్రమ-పట్టుకున్న పోలీసులు - వీళ్ల ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంకే !
Bigg Boss 9 Telugu Elimination This Week: బిగ్‌బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్... మాస్క్ మ్యాన్ ఔట్... ఆయన సంపాదన ఎంతో తెలుసా?
బిగ్‌బాస్‌లో ఈ వారం ఊహించని ఎలిమినేషన్... మాస్క్ మ్యాన్ ఔట్... ఆయన సంపాదన ఎంతో తెలుసా?
Cough Syrups: పిల్లలకు దగ్గు మందు ఇస్తున్నారా ?  ప్రభుత్వం జారీచేసిన ఈ సూచనలు పాటించండి !
పిల్లలకు దగ్గు మందు ఇస్తున్నారా ? ప్రభుత్వం జారీచేసిన ఈ సూచనలు పాటించండి !
Mana Shankara Vara Prasad Garu Villain: చిరంజీవి 'వరప్రసాద్' గారికి విలన్ ఎవరో తెలిసింది... రంగంలోకి దిగిన మలయాళీ
చిరంజీవి 'వరప్రసాద్' గారికి విలన్ ఎవరో తెలిసింది... రంగంలోకి దిగిన మలయాళీ
Telangana Tims Politics: కేసీఆర్ ప్రారంభించారనే ఆస్పత్రులు పూర్తి చేయట్లేదు - హరీష్ ఆరోపణ - గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
కేసీఆర్ ప్రారంభించారనే ఆస్పత్రులు పూర్తి చేయట్లేదు - హరీష్ ఆరోపణ - గట్టి కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్
Embed widget