By: ABP Desam | Updated at : 24 Feb 2023 12:58 PM (IST)
జోహో ఐటీ కంపెనీ వద్ద నారా లోకేశ్
యువగళం పాదయాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివిధ వర్గాలకు చెందిన ప్రజల్ని కలుస్తూ వెళ్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి వచ్చిన ఐటీ కంపెనీల వద్ద సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ తిరుపతి సమీపంలో రేణిగుంటలో పర్యటిస్తుండగా అక్కడ జోహో ఐటీ కంపెనీని సందర్శించారు. ఉద్యోగులతో మాట్లాడారు. తాను ఐటీ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన కంపెనీ వల్ల అక్కడ మహిళా ఉద్యోగినులు సంతోషంగా ఉన్నారని, వారితో ఓ సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ సీఎం జగన్కు ఓ సవాలు విసిరారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాల్లో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? అని ప్రశ్నించారు. ఉన్న కంపెనీలను పక్క రాష్ట్రానికి తరిమేశారని ఆరోపించారు. జగన్ రెడ్డి తెచ్చిన కంపెనీల ముందు సెల్ఫీ దిగి పోస్ట్ చేయాలని సవాలు చేశారు.
‘‘జగన్ రెడ్డి ఇదిగో నేను రేణిగుంటకు తెచ్చిన జోహో ఐటీ కంపెనీ.. జోహో కంపెనీలో పనిచేస్తున్న నా చెల్లెమ్మల కళ్ళలో ఆనందం చూడు జగన్ రెడ్డి. ఇక్కడ వంద మంది యువతీ, యువకులు పని చేస్తున్నారు. నీ హయాంలో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేసి, ఉద్యోగాలు లేకుండా చేసే జగన్ రెడ్డికి ఉద్యోగం వస్తే యువతీ, యువకులు పడే ఆనందం గురించి తెలియాలి అనుకోవడం అత్యాశే అవుతుంది’’
Hey @ysjagan, look at the spark in the eyes and smile on the faces of my sisters and brothers working at @Zoho in Renigunta. Can you show one such smile that you brought in the last 4 years?#YuvaGalamPadayatra pic.twitter.com/9zmCrXQC1A
— Lokesh Nara (@naralokesh) February 23, 2023
‘‘టిడిపి హయాంలో వచ్చిన కంపెనీల ముందు నేను సెల్ఫీ దిగుతాను. జగన్ రెడ్డి తెచ్చిన లిక్కర్ కంపెనీలు తప్ప ఏమైనా ఉంటే సెల్ఫీ దిగి పోస్ట్ చెయ్యాలని కోరుతున్నాను. నేను మంత్రిగా ఉన్నప్పుడు రేణిగుంటలో ఏర్పాటు చేసిన జోహో సాఫ్ట్ వేర్ కంపెనీని సందర్శించి అక్కడ ఉద్యోగులతో సెల్ఫీ దిగాను. వై.కన్వెన్షన్ హాలులో యాదవ సామాజికవర్గీయులతో సమావేశమయ్యాను. తిరుపతి నియోజకవర్గంలో నా పాదయాత్ర ప్రవేశించింది’’ అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.
అల్లూరి జిల్లాలో ఘటనపైనా ట్వీట్
‘‘జగన్ రెడ్డి గారి అధ్వాన పాలనకి మరో పసిగుడ్డు కళ్లు తెరవకుండానే కన్నుమూసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పనసబంద గ్రామానికి చెందిన భానుకి గర్భశోకం మిగిల్చింది వైసీపీ సర్కారు నిర్లక్ష్యమే. పురిటినొప్పులు వచ్చిన గర్భిణిని తీసుకెళ్లేందుకు సరైన రోడ్డు లేదు, 108 వాహనం రాదు, మేము తెచ్చిన ఫీడర్ అంబులెన్సులు మూలన పెట్టేశావు. దిక్కుతోచని స్థితిలో డోలీపై భానుని ఆస్పత్రికి తరలిస్తే బిడ్డ అడ్డం తిరిగి చనిపోయింది. ఈ పాపం నీదే జగన్ రెడ్డి!’’ అని నారా లోకేశ్ విమర్శిస్తూ ట్వీట్ చేశారు.
జగన్ రెడ్డి గారి అధ్వాన పాలనకి మరో పసిగుడ్డు కళ్లు తెరవకుండానే కన్నుమూసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం తీగలవలస పంచాయతీ పనసబంద గ్రామానికి చెందిన భానుకి గర్భశోకం మిగిల్చింది వైసీపీ సర్కారు నిర్లక్ష్యమే.(1/2)#JaganFailedCM pic.twitter.com/xCVFjt1SSG
— Lokesh Nara (@naralokesh) February 23, 2023
TTD Budget: 2023-24 ఏడాదికి బడ్జెట్ విడుదల చేసిన టీటీడీ, కీలక నిర్మాణాలకు బోర్డు ఆమోదం
Tirupati News: శ్రీసిటీని సందర్శించిన సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
APOSS SSC Hall Tickets: ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షల హాల్టికెట్లు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Chandrababu Donation: మనవడి బర్త్డే నాడు చంద్రబాబు 33 లక్షల విరాళం, ఒకరోజు అన్నప్రాద వితరణ కోసం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!