News
News
వీడియోలు ఆటలు
X

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

లోకేశ్, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన ‘గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం’ పేరుతో పట్టణంలో పర్యటిస్తూ.. అందరూ నిజాయతీగా ఉండాలని నీతులు చెబుతారని ఎద్దేవా చేశారు.

FOLLOW US: 
Share:

నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 58వ రోజు సాగుతోంది. ప్రస్తుతం ఆయన శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న (ఏప్రిల్ 1) నారా లోకేశ్ ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా లోకేశ్, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన ‘గుడ్‌ మార్నింగ్‌ ధర్మవరం’ పేరుతో పట్టణంలో పర్యటిస్తూ.. అందరూ నిజాయతీగా ఉండాలని నీతులు చెబుతారని ఎద్దేవా చేశారు. కానీ, ఆయన మాత్రం గుట్టలను దోచేస్తున్నారని లోకేశ్‌ విమర్శించారు. ధర్మవరం సమీపంలో ఎర్రగుట్టను అక్రమించుకొని విలాసంతమైన ఫాంహౌస్‌ కట్టుకున్నారని ఆరోపించారు. 

ఎర్రగుట్ట సమీపంలో నిలబడి ‘ఇది మరో రుషికొండ’గా మారిందని అన్నారు. ‘‘గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు. అయితే తాను మాత్రం గుట్టలను దోచేస్తాడు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు. 902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడు. ఇది మరో రుషికొండ అని,ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్’’ అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

యువగళం పాదయాత్ర 57వ రోజు (శనివారం) 13 కిలో మీటర్లు సాగింది. ఇప్పటి వరకూ లోకేశ్‌ మొత్తం 732 కిలోమీటర్లు నడిచారు. టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జి పరిటాల శ్రీరామ్‌, మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత తదితరులు లోకేశ్ వెంట ఉన్నారు.

Published at : 02 Apr 2023 10:57 AM (IST) Tags: Nara Lokesh Yuvagalam Padayatra MLA Kethireddy kethireddy venkatarami reddy

సంబంధిత కథనాలు

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

AP EAPCET Result: ఏపీ ఈఏపీసెట్‌-2023 ఫలితాల వెల్లడి తేదీ ఖరారు, రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

Tirumala: తిరుమలలో మొబైల్ పోతే శ్రీవారి భక్తులు ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి

Tirumala: తిరుమలలో మొబైల్ పోతే శ్రీవారి భక్తులు ఈ నెంబర్ కు వాట్సాప్ చేయండి

BJP Purandeswari: మోదీ హయాంలో ఈ 9 ఏళ్లలో ఒక్క స్కాం కూడా జరగలేదు: పురంధేశ్వరీ

BJP Purandeswari: మోదీ హయాంలో ఈ 9 ఏళ్లలో ఒక్క స్కాం కూడా జరగలేదు: పురంధేశ్వరీ

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Top 10 Headlines Today: సైకిల్ ఎక్కబోతున్న ఆ ముగ్గురు, సరూర్‌నగర్‌ హత్య కేసులో సాయికృష్ణ హాంగామా

Top 10 Headlines Today: లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు నెల్లూరు లీడర్లు రెడీ, తెలంగాణలో నేడు సుపరిపాలన వేడుక

Top 10 Headlines Today: లోకేష్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు నెల్లూరు లీడర్లు రెడీ, తెలంగాణలో నేడు సుపరిపాలన వేడుక

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

TSPSC: నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!