అన్వేషించండి

Tirupati Laddu Row: తిరుమల వివాదంలో సిట్ దర్యాప్తు ఎలా సాగుతోంది? ఏ అంశాలపై దృష్టి పెట్టింది?

Tirupati News: తిరుమల లడ్డూ వివాదం లో సిట్ బృందం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంది. అసలు టెండర్లు, కొనుగోలు, ఎవరు బాధ్యులు, ఏమి జరిగింది అనే అంశాలపై దృష్టి పెట్టి విచారణ చేస్తున్నారు.

Tirumala News: తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇలాంటి లడ్డూ వివాదంలో జరిగిన కల్తీ నెయ్యికి సంబంధించి చేసింది... చేయించింది అనే రెండు విధాలుగా విచారణ జరుగుతోంది. ఇందులో ఎవరు బాధ్యులు అవుతారో వేచి చూడాల్సిందే.

పరమపవిత్రమైన శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల్లో నెయ్యి కల్తీ వాడినట్టు... అందులో జంతువుల కొవ్వు, చాప నూనె, కూరగాయల నూనె కలగలిసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ తరువాత పెను దుమారం రేగింది. రోజుకొక కొత్త అంశం బయటకు రావడంతో దేశ వ్యాప్తంగా ఇదే బర్నింగ్ ఈష్యుగా మారిపోయింది. దీంతో టీటీడీ చెప్పే విషయాలకు వైసీపీ నుంచి ఎదురుదాడి ప్రారంభం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

సిట్ పనితీరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఐజీ స్థాయి అధికారితో మొత్తం 9 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం ఏర్పాటు చేశారు. ఇందులో ఉన్న సభ్యులు తిరుమల, తిరుపతిలో గతంలో పని చేసిన వారే అధికంగా ఉన్నారు. సిట్ బృందం ని సభ్యులు సైతం గత వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారే కావడం ఆసక్తికర విషయం. అయితే సిట్ బృందం మూడు రోజులు పాటు పర్యటించింది.. ఇంకా ఎన్ని రోజులు పాటు కొనసాగుతుందో చెప్పలేము. 
సిట్ బృందం తొలుత సమావేశమై మూడు బృందాలుగా విడిపోయారు. ఇద్దరు ఎస్పీలు, ఐజీ మూడు బృందాలు చేయాల్సిన పని తీరు గురించి చర్చించుకున్నారు. ఎక్కడ నుంచి పని ప్రారంభించాలి.. ఎక్కడ విచారణ చేయాలి... ఏ రికార్డులు పరిశీలిస్తే నిజాలు బయట పడుతాయి అని ఒక నిర్ణయానికి వచ్చారు.

టీటీడీ పాలకమండలి, అధికారుల పరిస్థితి
టీటీడీలో గత ప్రభుత్వ హయాంలో నెయ్యి కొనుగోలుకు సంబంధించి అన్ని వివరాలు సిట్ బృందం తీసుకుంది. అసలు నెయ్యి టెండర్లు వేసిన వ్యక్తులు ఎవరు.. ఎంత మేర క్వాలిటీ ఉంది.. ఆ రిపోర్టులు ఉన్నాయా.. చివరి టెండర్లు ఎప్పుడూ జరిగాయి.. ఎంత ధరకు సరఫరా చేస్తామని అన్నారు. తక్కువ ధర అంటే క్వాలిటీ పరిస్థితి ఏంటి అనే విషయలను ఇప్పటికే టీటీడీ మార్కెటింగ్ ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళి కృష్ణ ను సిట్ బృందం అడిగి వివరాలు తెలుసుకుంది.
తక్కువ ధరకు వస్తున్న టీటీడీ గత పాలక మండలి సభ్యులు, పర్చేజింగ్‌ కమిటీ సభ్యులు ఎందుకు ప్రశ్నించలేదు.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు.. గతంలో వీరు పాత్ర ఏమైనా ఉందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక టీటీడీ అధికారుల విషయం కూడా చేర్చించినట్లు సమాచారం. క్వాలిటీ లేదని తెలిసి ఎందుకు ప్రశ్నించలేదు.. కనీసం రికార్డులో అయిన దానిని నమోదు చేసారా లేదా.. ఈ విషయాన్ని అప్పటి టీటీడీ ఈవో, ధర్మకర్తల మండలి దృష్టికి తీసుకెళ్ళారా లేదా అనేది కూడా కూపీ లాగుతున్నారు. తిరుమల తిరుపతిలోని లడ్డూ కు సంబంధించిన వివరాలు తీసుకునేందుకు పలు విభాగాలను పరిశీలన చేసే అవకాశం ఉంది.

ఒక్క సంస్థ పైన మాత్రమేనా
తిరుమలకు టెండర్ తీసుకున్న తమిళనాడు రాష్ట్రం దిండిగల్‌కు చెందిన ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రెండు రోజులు వ్యవధిలో రెండు ట్యాంకుల నెయ్యి వచ్చినట్లు గుర్తించారు. అయితే రెండు ట్యాంకులు వేరే వేరే పేర్లు ఉన్నాయి.. అంతేకాకుండా మరో రెండు ట్యాంకులు సైతం అలాగే రావడం.. రెండు సార్లు వచ్చిన ట్యాంకులకు ఒకే నెంబర్ ఉండడాన్నీ టీటీడీ మార్కెటింగ్ శాఖ గుర్తించింది. ఇదే అంశాన్ని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఆ ట్యాంకులు ఎవరివి.. ఎందుకు ఒకే నెంబర్ తో వచ్చాయి.. నెయ్యి సరఫరాదారులు అంతా సిండికేట్ అయ్యారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా త్వరలో సిట్ బృందం తమిళనాడు రాష్ట్రం దిండిగల్ లోని ఏఆర్ డైరీ పూడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సైతం పరిశీలన చేయనుంది. అయితే టీటీడీ తెలిపిన విధంగా అన్ని సంస్థలు క్వాలిటీ లేకుండా సరఫరా చేస్తుంటే వారికి హెచ్చరించామని ఈవో ప్రకటించగా మార్పు చేసుకున్నట్లు తెలిపారు. అయితే మిగిలిన వారిని విడిచిపెట్టనట్టేనా.. వారిది తప్పు ఉందా లేదా అనేది తేల్చాల్సిన పని లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget