అన్వేషించండి

తిరుమలలో తరచూ రెచ్చిపోతున్న చిరుత- నడకమార్గంలో వెళ్లాలంటే భయం భయం

తిరుమల కాలిమార్గంలో మూడు నెలల్లో రెండోసారి చిరుత దాడి చేయడం ఆందోళన కలిస్తోంది. నడక మార్గంలో వెళ్లే భక్తులు భయం భయంగా తిరుమల కొండకు చేరుకునే పరిస్థితి ఏర్పడింది.

తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి కాలి మార్గంలో వెళ్లాలంటే భక్తులు భయపడిపోతున్నారు. దేవుడి దర్శనం సంగతి తర్వాత ముందు ఆ దారిలో వెళ్తే ఎటు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని కంగారు పడుతున్నారు. తరచూ చిరుతలు, ఎలుగుబంట్లు, పాముల సంచారం సాధారణమైపోతోంది. 

ఇప్పటి వరకు నడక మార్గంలో క్రూర మృగాలు తిరుగుతూ ఉండేవి కానీ ఎవరిపై దాడి చేసిన ఘటన చాలా అరుదుగా ఉండేవి. ఎవరి దారిలో వారు వెళ్లిపోయే వారు కానీ ఈ మధ్య కాలంలో చిరుత దాడులు ఎక్కువైపోయాయి. ఈ ఏడాదిలోనే ఇది రెండో దాడి. దీంతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. 

తిరుమల శ్రీనివాసుడు అంటేనే కోట్ల మంది ప్రజలకు ఆరాధ్య దైవం. అలాంటి దేవుని వద్దకు వెళ్లే మార్గంలో కూడా భక్తులు సెంటిమెంట్ పాటిస్తుంటారు. కాలినడకన వెళ్లి మొక్కు తీర్చుకోవాలని అనుకుంటారు. అలా వెళ్లాలనుకున్న వారిలో భయాందోళన మొదలయ్యాయి. వరుసగా చిరుత దాడి చేసిన ఘటనలు వెలుగు చూస్తుండటంతో కంగారు పెట్టిస్తోంది. 

దాడి జరిగినప్పుడల్లా భద్రతా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ప్రకటనలు ఇస్తోంది. మొన్న జూన్‌లో జరిగినప్పుడు కూడా అదే చెప్పారు. బాలుడు ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ దాడితో అలర్ట్ అయిన టీటీడీ కొన్ని భద్రతా చర్యలు తీసుకుంది. 

నడక మార్గంలో వచ్చే వారి కోసం ప్రత్యేక జాగ్రత్తలు పాటించింది. ఎవరినీ ఒంటరిగా వెళ్లనీయకుండా గుంపులుగుంపులుగా పంపించింది. రాత్రి పూట ప్రయాణాలను పూర్తిగా నిషేధించింది. దాడి చేసిన చిరుతలను కూడా బంధించింది. దట్టమైనఅటవీ ప్రాంతంలో విడిచి పెట్టింది. 

కొన్ని రోజులు ఈ చర్యలు కఠినంగా అమలు చేసిన టీటీడీ తర్వాత లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీనిపై భక్తులు కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోవడంలో టీటీడీ విఫలమైందని అంటున్నారు. 

పాపను చిరుత లాక్కెళ్లి చంపేయడంతో మరోసారి కాలిమార్గంలో భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో అప్రమత్తమైన టీటీడీ పాత రూల్స్‌ను కఠినం చేస్తోంది. ఎవరినీ ఈ మార్గంలో ఒంటరిగా పంపించడం లేదు. గుంపులు గుంపులుగా విడిచిపెడుతోంది.

ఏడాదిలో రెండో ఘటన 

తిరుమల నడక మార్గంలో ఈ ఏడాదిలోనే రెండు విషాధాలు చోటు చేసుకోవడం కాస్త కలవర పెట్టే అంశమే అంటున్న భక్తులు. జూన్‌లో జరిగిన చిరుత దాడిలో బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ఆ బాలుడికి మెరగైన వైద్యం అందించింది టీటీడీ. పూర్తిగా కోలుకుతున్న తర్వాత తల్లిదండ్రులకు అప్పగించింది. 

ఇప్పుడు మాత్రం ప్రాణాలు పోయాాయి

లక్షిత విషయంలో మాత్రం ఘోరం జరిగిపోయింది. దాడి జరిగింది రాత్రి పూట కావడంతో భక్తులు, అధికారులు త్వరగా స్పందించలేకపోయారు. రాత్రంతా  గాలించినా చిన్నారిని కాపాడుకోలేకపోయారు. ఉదయం వరకు అసలు పాపను చిరుత ఎటు తీసుకెళ్లిందో కూడా తెలుసుకోలేకపోయారు. ఉదయం కొండకు వస్తున్న భక్తులు గుర్తించి చెప్పే వరకు ఆచూకి కనుగోలేకపోయారు. ఇదే తీవ్ర విషాదాన్ని నింపుతోంది. 

Also Read: తిరుమలలో దారుణం- చిన్నారిని చంపేసిన చిరుత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kancha Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం 
IPL 2025 PBKS VS RR Result Update:  రాయ‌ల్స్ ఆల్ రౌండ్ షో.. టోర్నీలో వ‌రుస‌గా రెండో విజ‌యం.. పంజాబ్ పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న జైస్వాల్, ఆర్చ‌ర్
రాయ‌ల్స్ ఆల్ రౌండ్ షో.. టోర్నీలో వ‌రుస‌గా రెండో విజ‌యం.. పంజాబ్ పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న జైస్వాల్, ఆర్చ‌ర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs DC Match Highlights IPL 2025 | చెన్నైపై 25 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamMS Dhoni May Lead CSK vs DC IPL 2025 | కెప్టెన్ రుతురాజ్ కు గాయం..ఢిల్లీతో మ్యాచ్ కు దూరం..?Rishabh Pant Failures in IPL 2025 |  LSG vs MI మ్యాచులోనూ చెత్తగా అవుటైన పంత్Hardik Pandya vs LSG IPL 2025 |  LSG తో మ్యాచ్ లో పాండ్యా ఏం చేసినా గెలవలేదు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kancha Gachibowli Land Dispute : కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
కంచ గచ్చిబౌలి భూవివాదంలో ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌- విచారణ కోసం కోర్టుని ఆశ్రయించే ఛాన్స్
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం 
IPL 2025 PBKS VS RR Result Update:  రాయ‌ల్స్ ఆల్ రౌండ్ షో.. టోర్నీలో వ‌రుస‌గా రెండో విజ‌యం.. పంజాబ్ పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న జైస్వాల్, ఆర్చ‌ర్
రాయ‌ల్స్ ఆల్ రౌండ్ షో.. టోర్నీలో వ‌రుస‌గా రెండో విజ‌యం.. పంజాబ్ పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న జైస్వాల్, ఆర్చ‌ర్
Pamban Rail Bridge:ఫెయిత్ అండ్ ప్రోగ్రెస్‌ బ్రిడ్జ్‌; రామనవమి నాడు పీఎం ప్రారంభించే పంబన్ రైలు వంతెన ప్రత్యేకతేంటీ?
ఫెయిత్ అండ్ ప్రోగ్రెస్‌ బ్రిడ్జ్‌; రామనవమి నాడు పీఎం ప్రారంభించే పంబన్ రైలు వంతెన ప్రత్యేకతేంటీ?
Telangana New CS:తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణరావు! శాంతి కుమారికి కీలక పదవి!
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణరావు! శాంతి కుమారికి కీలక పదవి!
Alekhya Chitti Pickles: మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
మంట పెట్టిన పచ్చళ్లు... అలేఖ్యపై ఎందుకంత ద్వేషం? చిట్టి పికిల్స్ కాంట్రవర్సీకి పునాది ఎక్కడ? ఆగేది ఎప్పుడు?
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Embed widget