అన్వేషించండి

CM Jagan Speech: వీళ్లు రాజకీయాలకు పనికివస్తారా? నా సవాల్‌కి ఒక్కరూ స్పందించలేదు - సీఎం జగన్ ధ్వజం

CM Jagan News: శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM Jagan Speech in Satyasai District: చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించారని, ఆత్మహత్య చేసుకున్న రైతుకు నష్టపరిహారం అందని వారిని ఒక్కరిని కూడా చూపించలేకపోయారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాను సవాలు చేసినా వారిద్దరూ స్పందించలేదని చెప్పారు. అంత పారదర్శకంగా తాము రైతుల పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో చంద్రబాబు హాయాంలో రైతు బీమా డబ్బులు చాలా మందికి ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను పరామర్శించాలన్న ఆలోచన దత్తపుత్రుడికి ఎందుకు రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘గతంలో చంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చి రైతులను మోసం చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందో లెక్కలు వేసుకొని పరిగెత్తే వ్యక్తి దత్తపుత్రుడు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వ మంచితనాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని మీడియా ఛానెళ్లు, పత్రికలు సహా చంద్రబాబు, దత్తపుత్రుడు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పారేసి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు.

పదో తరగతి పరీక్షల్లో మన విద్యార్థులకు 67 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రెండేళ్ల తర్వాత మూడో ఏడాది పరీక్షలు వచ్చాయి. గుజరాత్ రాష్ట్రంలో 65 శాతమే పది పరీక్షలు పాసయ్యారు. మనకంటే 2 శాతం తక్కువ. ఫెయిలైన విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెంచాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సప్లిమెంటరీ కేటగిరీని తీసేసి, రెగ్యులర్ గానే పరిగణించాలని మనం నిర్ణయించాం. అలాంటిది వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వారు మాట్లాడుతున్నారు.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే, దళిత మంత్రి ఇళ్లను కాల్చేశారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ పేరు పెడితే జీర్ణించుకోలేక హింస చేశారు. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు.

రూ.2,977 కోట్లు విడుదల
రైతుల కోసం ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.92 కోట్లను అందిస్తున్నాం. 2021 ఖరీఫ్‌లో సహజ వైపరీత్యాలు, చీడల వల్ల పంట నష్టపోయిన రైతులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని అందిస్తున్నాం. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా అని అన్నారు. ఇవాళ దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి.’’ అని జగన్ అన్నారు. గతంలో రైతులకు ఇస్తామన్న బీమా సొమ్మును చంద్రబాబు ఇవ్వకుండా పోయారని గుర్తు చేశారు. అప్పటికి ఇప్పటికీ మార్పును గమనించాలని కోరారు.

పక్క రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఏపీ పథకాలు
‘‘మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. కేంద్రం కూడా ఇక్కడి పథకాలను అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకూ పంట బీమా కింద రూ.6,684 కోట్ల ను రైతులకు అందించాం. టీడీపీ ఐదేళ్లలో బీమా సొమ్ము కింద ఇచ్చింది రూ.3,411 మాత్రమే. 2021 ఖరీఫ్ లో నష్టపోయిన 15 లక్షల మంది రైతులకు రూ.2,977 కోట్ల ను అందించాం. మన పాలనలో రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నిండుగా ఉన్నాయి.’’ అని వైఎస్ జగన్ మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
Anakapally Police: అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
Spirit Movie: ‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
Trains Diverted: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Korean Actor Ma Dong-seok with Prabhas in Spirit Movie |Sandeep Reddy vanga ఏం ప్లాన్ చేస్తున్నాడో.!Abhishek Sharma's Maiden T20I Century | మ్యాచ్ ఏదైనా కొట్టుడు ఆపని అభిషేక్ శర్మ | ABP DesamBobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
Anakapally Police: అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
అనకాపల్లి బాలిక హత్య నిందితుడిపై పోలీసుల రివార్డ్! ఆచూకీ చెప్తే నగదు బహుమతి
Spirit Movie: ‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
‘స్పిరిట్’లో విలన్‌ ఫిక్స్ - ప్రభాస్‌తో తలపడనున్న కొరియన్ స్టార్ హీరో
Trains Diverted: ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
ప్రయాణికులకు బిగ్ అలర్ట్ - ఆ తేదీల్లో ఈ రైళ్లు విజయవాడకు రాకుండా దారి మళ్లింపు
Free Sand G.O in AP :  ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే
ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే
Petrol Side Effects: పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!
పెట్రోల్‌ను కూల్‌డ్రింక్‌లా తాగేస్తున్న యువతి - దాని టేస్ట్ అలా ఉంటుందట!
Viral News: కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి కింద పడిన మహిళ, దూసుకెళ్లిన రైలు - కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావం
కదులుతున్న ట్రైన్ ఎక్కబోయి కింద పడిన మహిళ, దూసుకెళ్లిన రైలు - కాళ్లు తెగి తీవ్ర రక్తస్రావం
Bosses On Sale: మీ బాస్ ఊరికే తిడుతున్నాడా, అయితే ఈ సైట్‌లో ఆయనను అమ్మేయండి - ఇదే కొత్త ట్రెండ్
మీ బాస్ ఊరికే తిడుతున్నాడా, అయితే ఈ సైట్‌లో ఆయనను అమ్మేయండి - ఇదే కొత్త ట్రెండ్
Embed widget