అన్వేషించండి

CM Jagan Speech: వీళ్లు రాజకీయాలకు పనికివస్తారా? నా సవాల్‌కి ఒక్కరూ స్పందించలేదు - సీఎం జగన్ ధ్వజం

CM Jagan News: శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.

CM Jagan Speech in Satyasai District: చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు గతంలో అనంతపురం జిల్లాలో పర్యటించారని, ఆత్మహత్య చేసుకున్న రైతుకు నష్టపరిహారం అందని వారిని ఒక్కరిని కూడా చూపించలేకపోయారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాను సవాలు చేసినా వారిద్దరూ స్పందించలేదని చెప్పారు. అంత పారదర్శకంగా తాము రైతుల పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో చంద్రబాబు హాయాంలో రైతు బీమా డబ్బులు చాలా మందికి ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను పరామర్శించాలన్న ఆలోచన దత్తపుత్రుడికి ఎందుకు రాలేదని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధి దారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘గతంలో చంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చి రైతులను మోసం చేశారని సీఎం జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకు ఏం చేస్తే మంచి జరుగుతుందో లెక్కలు వేసుకొని పరిగెత్తే వ్యక్తి దత్తపుత్రుడు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అని నేను అడుగుతున్నాను. ప్రభుత్వ మంచితనాన్ని పక్కదారి పట్టించేందుకు కొన్ని మీడియా ఛానెళ్లు, పత్రికలు సహా చంద్రబాబు, దత్తపుత్రుడు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పారేసి మోసం చేసే వ్యక్తి చంద్రబాబు.

పదో తరగతి పరీక్షల్లో మన విద్యార్థులకు 67 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రెండేళ్ల తర్వాత మూడో ఏడాది పరీక్షలు వచ్చాయి. గుజరాత్ రాష్ట్రంలో 65 శాతమే పది పరీక్షలు పాసయ్యారు. మనకంటే 2 శాతం తక్కువ. ఫెయిలైన విద్యార్థులకు ఆత్మస్థైర్యం పెంచాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం సప్లిమెంటరీ కేటగిరీని తీసేసి, రెగ్యులర్ గానే పరిగణించాలని మనం నిర్ణయించాం. అలాంటిది వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా వారు మాట్లాడుతున్నారు.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే, దళిత మంత్రి ఇళ్లను కాల్చేశారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్ పేరు పెడితే జీర్ణించుకోలేక హింస చేశారు. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా?’’ అని సీఎం జగన్ ప్రశ్నించారు.

రూ.2,977 కోట్లు విడుదల
రైతుల కోసం ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 15.61 లక్షల మంది రైతులకు రూ.2,977.92 కోట్లను అందిస్తున్నాం. 2021 ఖరీఫ్‌లో సహజ వైపరీత్యాలు, చీడల వల్ల పంట నష్టపోయిన రైతులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని అందిస్తున్నాం. ఒకప్పుడు అనంతపురం కరువు జిల్లా అని అన్నారు. ఇవాళ దేవుడి దయ వల్ల నీళ్లు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చాయి.’’ అని జగన్ అన్నారు. గతంలో రైతులకు ఇస్తామన్న బీమా సొమ్మును చంద్రబాబు ఇవ్వకుండా పోయారని గుర్తు చేశారు. అప్పటికి ఇప్పటికీ మార్పును గమనించాలని కోరారు.

పక్క రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఏపీ పథకాలు
‘‘మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి పక్క రాష్ట్రాలు ఫాలో అవుతున్నాయి. కేంద్రం కూడా ఇక్కడి పథకాలను అధ్యయనం చేస్తోంది. ఇప్పటి వరకూ పంట బీమా కింద రూ.6,684 కోట్ల ను రైతులకు అందించాం. టీడీపీ ఐదేళ్లలో బీమా సొమ్ము కింద ఇచ్చింది రూ.3,411 మాత్రమే. 2021 ఖరీఫ్ లో నష్టపోయిన 15 లక్షల మంది రైతులకు రూ.2,977 కోట్ల ను అందించాం. మన పాలనలో రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నిండుగా ఉన్నాయి.’’ అని వైఎస్ జగన్ మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.