అన్వేషించండి

Tirumala Accommodation: తిరుమలలో మళ్లీ మొదలైన కాషన్ డిపాజిట్ విధానం…

ఐదేళ్ల క్రితం రద్దుచేసిన కాషన్ డిపాజిట్ విధానాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించింది. అయితే డిపాజిట్ విధానంలోని తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా..భక్తులు సొమ్మును తిరిగి పొందేలా కొన్ని మార్పులు చేశారు.

తిరుమలలో అద్దె గదులకు కరెంట్‌ బుకింగ్‌ చేసుకునే భక్తుల నుంచి కాషన్‌ డిపాజిట్‌ తీసుకునే విధానాన్ని టీటీడీ ప్రారంభించింది. తిరుమలలో 17 ఉప విచారణ కేంద్రాల్లో భక్తులకు గది తాళం ఇచ్చే సమయంలో కాషన్‌ డిపాజిట్‌ తీసుకుని ఖాళీ చేసే సమయంలో రిఫండ్‌ కేంద్రాల ద్వారా తిరిగి చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కరెంట్‌ బుకింగ్‌ రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె గదులు పొందిన భక్తుల నుంచి రూ.500 కాషన్‌ డిపాజిట్‌ వసూలు చేస్తుండగా, రూ.501 నుంచి రూ.1000 వరకు, రూ.1001 నుంచి రూ.6,000 వరకు అద్దె ఉన్న గదులకు అంతే మొత్తంలో కాషన్‌ డిపాజిట్‌ తోపాటు, జీఎస్టీని భక్తుల నుంచి తీసుకుంటున్నారు. గదులను ఖాళీ చేసిన సమయంలో కాషన్‌ డిపాజిట్‌ తిరిగి ఇచ్చేందుకు గతంలోనే ఏర్పాటు చేసిన రిఫండ్‌ కౌంటర్లను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడ కాషన్‌ డిపాజిట్‌ వివరాలను ప్రదర్శిస్తున్నారు. 


Tirumala Accommodation: తిరుమలలో మళ్లీ మొదలైన కాషన్ డిపాజిట్ విధానం…

అయితే ఇదంతా భక్తులకు సమస్యగా ఉందని భావించి 2017లో కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని రద్దు చేశారు. ఇక్కడ గతంలో ఉన్న అద్దె గదులకు నగదు డిపాజిట్‌ చెల్లించడాన్ని ఐదేళ్ల కిందట తీసేశారు. దీన్ని తొలగించాక అద్దె గదులను భక్తులు ఖాళీ చేసినప్పుడు సరైన సమాచారం సంబంధిత ఏరియా అటెండరుకు అందించకపోతే అద్దె భారం ఆయనపై పడేది. దీంతోపాటు సంబంధిత గదుల్లో విలువైన వస్తువులు చోరీ అయిన సంఘటనలున్నాయి. ఈ నేపథ్యంలో కరెంట్‌ బుకింగ్‌ అద్దె గదులకు డిపాజిట్‌ తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారుల దృష్టికి సిబ్బంది తీసుకెళ్లారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారు. ఈ కాషన్‌ డిపాజిట్‌ విధానాన్ని తిరిగి గురువారం నుంచి ఆచరణలోకి  తీసుకొచ్చారు.

అయితే డిపాజిట్‌ విధానంలోని సమస్యలను దృష్టిలో పెట్టుకుని భక్తులు డిపాజిట్‌ సొమ్మును తిరిగి పొందేందుకు ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని మార్పులు చేశారు. ప్రస్తుతం తిరుమలలో ఆరు ప్రాంతాల్లో రూం రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఉన్నాయి. వీటిలో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న భక్తుల సెల్‌ఫోన్‌కు కేటాయించిన గది ఏరియా ఉప విచారణ కార్యాలయ వివరాలు అందుతాయి. ఈ ప్రాంతానికి చేరుకుని అద్దెను క్రెడిట్‌/డెబిట్‌ కార్డు ద్వారా నగదు చెల్లించి గది పొందాల్సి ఉంటుంది. ఈ విధానాన్నే కొనసాగిస్తూ ఆయా ఉప విచారణ కార్యాలయంలో భక్తులు అద్దెతోపాటు డిపాజిట్‌ చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. అయితే కాషన్‌ డిపాజిట్‌ విధానం అమల్లోకి తీసుకొచ్చిన క్రమంలో డిజిటల్‌ పేమెంట్‌తోపాటు నగదుతో కూడా గదిని పొందేలా మార్పులు చేశారు. నగదు చెల్లించి గదిని పొందేవారికి డిపాజిట్‌ను నగదు రూపంలో ఇవ్వడంతో పాటు కార్డుల ద్వారా గదిని పొందే భక్తులకు డిపాజిట్‌ను తిరిగి వారి బ్యాంకు ఖాతాలోకి పంపేలా చర్యలు తీసుకున్నారు. 


Tirumala Accommodation: తిరుమలలో మళ్లీ మొదలైన కాషన్ డిపాజిట్ విధానం…

శనివారం డయల్‌ యువర్‌ ఈవో

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం ఆగ‌స్టు 7 శ‌నివారం తిరుప‌తి టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget