అన్వేషించండి

Tirumala News : ఇక రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం, వర్చువల్ క్యూ లైన్ పై టీటీడీ ఆలోచన!

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు గంటలకొద్ది క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ సమస్య పరిష్కారానికి టీటీడీ ఓ ఆలోచన చేస్తుంది.

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షల్లో భక్తులు వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా శ్రీ వెంకటేశ్వరస్వామని దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. రెండేళ్ల కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో ఏడుకొండలకు భక్తులు క్యూ కట్టారు. భక్తుల రద్దీ ఇటీవల బాగా పెరిగింది. దీంతో టీటీడీ(TTD)  సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్య భక్తుల కోసం శ్రీవారి నిత్య సేవలను లక్కీ డిప్ విధానంలో, ఆర్జిత సేవల టోకెన్ల విధానాన్ని అమలు చేస్తుంది. అలాగే వయో వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేసింది. ఉచిత దర్శనం కోసం ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్స్ లను టీటీడీ ఇప్పటికే ఏర్పాటు చేసింది.

వర్చువల్ క్యూ విధానం 

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. గంటల తరబడి క్యూలైన్ లో పిల్లలు, వయో వృద్ధులు, మహిళలు వేచి ఉండి ఇబ్బంది పడుతుంటారు. శ్రీవారి దర్శనానికి(Srivari Darshan) ఒక్కోసారి 48 గంటలకు పైనే సమయం పడుతుంటుంది. క్యూ కాంప్లెక్స్ లలో టీటీడీ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ వేచి ఉండే సమయాన్ని తగ్గించే పరిస్థితి కనిపించడంలేదు. దీనిపై ఆలోచన చేసిన టీటీడీ వర్చువల్ క్యూ విధానాన్ని(Virtual Queue line) ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. భక్తులు ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ క్యూ విధానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు చర్యలు చేపడుతోంది. 

టైం స్లాట్ ప్రకారం వస్తే 

టైం స్లాట్ కు ప్రకారం భక్తులు తిరుమలకు చేరుకుంటే కేవలం 2 గంటలలోపే శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపడుతోంది. దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. నిర్ణీత టైం ప్రకారం వచ్చిన భక్తులకు తక్కువ సమయంలో దర్శనం కల్పించవచ్చనేది టీటీడీ ఆలోచన

తిరుమల పవిత్రోత్సవాలు

కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన పవిత్రోత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను టీటీడీ మూడు రోజుల పాటు రద్దు చేసింది. 

పవిత్రోత్సవాలు అంటే?  

వైష్ణవ సంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బంది వల్ల కలిగే దోషాల వల్ల ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవం పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాలను 15వ శతాబ్దంలో 5 రోజుల పాటు నిర్వహించేవారని పురాణ ప్రతీతి. ముఖ్యంగా క్రీ.శ 1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నట్లు సాళువ మల్లయ్యదేవ మహారాజు రాయించిన శాసనంతో ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీ.శ.1562 వరకు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆ తరువాత కొంత కాలం పాటు పవిత్రోత్సవాలను నిర్వహించలేదు.  1962 నుంచి టీటీడీ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. 

 

టాప్ హెడ్ లైన్స్

YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
AP Local Body Elections 2026: ఏపీ స్థానిక పోరు - జగన్ ఆశలపై కూటమి నీళ్లు - అంతర్గత పోరును తలకిందులు చేస్తున్న బాబు-పవన్ వ్యూహం?
ఏపీ స్థానిక పోరు - జగన్ ఆశలపై కూటమి నీళ్లు - అంతర్గత పోరును తలకిందులు చేస్తున్న బాబు-పవన్ వ్యూహం?
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
భాద్రపద మాసంలో చలిమిడి దీపం ఏ రోజుల్లో వెలిగించాలి? ప్రాముఖ్యత ఏంటి?
భాద్రపద మాసంలో చలిమిడి దీపం ఏ రోజుల్లో వెలిగించాలి? ప్రాముఖ్యత ఏంటి?
Embed widget