అన్వేషించండి

Tirumala News : ఇక రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనం, వర్చువల్ క్యూ లైన్ పై టీటీడీ ఆలోచన!

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు గంటలకొద్ది క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ సమస్య పరిష్కారానికి టీటీడీ ఓ ఆలోచన చేస్తుంది.

Tirumala News : తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం లక్షల్లో భక్తులు వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా శ్రీ వెంకటేశ్వరస్వామని దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు. రెండేళ్ల కరోనా నిబంధనలు ఎత్తివేయడంతో ఏడుకొండలకు భక్తులు క్యూ కట్టారు. భక్తుల రద్దీ ఇటీవల బాగా పెరిగింది. దీంతో టీటీడీ(TTD)  సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్య భక్తుల కోసం శ్రీవారి నిత్య సేవలను లక్కీ డిప్ విధానంలో, ఆర్జిత సేవల టోకెన్ల విధానాన్ని అమలు చేస్తుంది. అలాగే వయో వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటుచేసింది. ఉచిత దర్శనం కోసం ప్రత్యేకంగా క్యూ కాంప్లెక్స్ లను టీటీడీ ఇప్పటికే ఏర్పాటు చేసింది.

వర్చువల్ క్యూ విధానం 

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. గంటల తరబడి క్యూలైన్ లో పిల్లలు, వయో వృద్ధులు, మహిళలు వేచి ఉండి ఇబ్బంది పడుతుంటారు. శ్రీవారి దర్శనానికి(Srivari Darshan) ఒక్కోసారి 48 గంటలకు పైనే సమయం పడుతుంటుంది. క్యూ కాంప్లెక్స్ లలో టీటీడీ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ వేచి ఉండే సమయాన్ని తగ్గించే పరిస్థితి కనిపించడంలేదు. దీనిపై ఆలోచన చేసిన టీటీడీ వర్చువల్ క్యూ విధానాన్ని(Virtual Queue line) ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. భక్తులు ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ క్యూ విధానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు చర్యలు చేపడుతోంది. 

టైం స్లాట్ ప్రకారం వస్తే 

టైం స్లాట్ కు ప్రకారం భక్తులు తిరుమలకు చేరుకుంటే కేవలం 2 గంటలలోపే శ్రీవారి దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపడుతోంది. దీంతో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. నిర్ణీత టైం ప్రకారం వచ్చిన భక్తులకు తక్కువ సమయంలో దర్శనం కల్పించవచ్చనేది టీటీడీ ఆలోచన

తిరుమల పవిత్రోత్సవాలు

కోవిడ్ ప్రభావంతో రెండేళ్ల పాటు శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించిన పవిత్రోత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 8 నుంచి 10 వరకూ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఆగస్టు 7వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నారు. పవిత్రోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో జరిగే పలు ఆర్జిత సేవలను టీటీడీ మూడు రోజుల పాటు రద్దు చేసింది. 

పవిత్రోత్సవాలు అంటే?  

వైష్ణవ సంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసో తెలియకో భక్తులు, సిబ్బంది వల్ల కలిగే దోషాల వల్ల ఆలయం పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకే మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవం పవిత్రోత్సవం. ఈ పవిత్రోత్సవాలను 15వ శతాబ్దంలో 5 రోజుల పాటు నిర్వహించేవారని పురాణ ప్రతీతి. ముఖ్యంగా క్రీ.శ 1464లో ఒక తమిళ శాసనంలో ఈ పవిత్రోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో శ్రావణ మాసంలో నిర్వహిస్తున్నట్లు సాళువ మల్లయ్యదేవ మహారాజు రాయించిన శాసనంతో ఈ విషయం స్పష్టమవుతుంది. అయితే శాసనాల ఆధారం ప్రకారం పవిత్రోత్సవాలను క్రీ.శ.1562 వరకు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఆ తరువాత కొంత కాలం పాటు పవిత్రోత్సవాలను నిర్వహించలేదు.  1962 నుంచి టీటీడీ పవిత్రోత్సవాల కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించింది. 

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget