అన్వేషించండి

Tirumala: తిరుమలలో పెరుగుతున్న రద్దీ, రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. నిన్న శ్రీవారిని 75 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, దర్శనం టోకెన్లు సంఖ్య పెంచడంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది.

Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా తీవ్రత తగ్గుతుండడంతో ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా శనివారం రికార్డు స్థాయిలో భక్తులు(Devotees) శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 75,704 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 33,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం రూ.3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. రెండు సంవత్సరాల తర్వాత శ్రీవారి(Srivari) సన్నిధిలో భక్తులు సందడి కనిపిస్తోంది. కరోనా(Corona) మొదలైన 2020 మార్చి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. దర్శనం టికెట్లు (Darshan Tickets) కూడా పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తున్నారు. టికెట్ల సంఖ్య పెంచడంతో గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ రోజుకు 75 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు, 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లతో పాటు వర్చువల్‌ సేవా టికెట్లు(Vartual Seva Tickets), వీఐపీ దర్శన టికెట్ల ద్వారా సుమార్ 75 వేల మందికి పైగా శనివారం స్వామి వారిని దర్శించుకున్నారు. 

అద్దె గదుల కొరత 

తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరుగుతుండడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది. గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న నాద నీరాజనం షెడ్డు వద్ద భక్తులు అధిక సంఖ్యలో సేదతీరుతున్నారు. తిరుమలలో 1500 లకు పైగా గదులలో మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ కారణంగా గదుల కొరత ఏర్పడింది. కరోనాకు ముందు నాటి పరిస్థితులు ఇప్పుడు తిరుమలలో కనిపిస్తున్నాయి. తిరుపతి(Tirupati)లో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు భక్తులు అందిస్తున్నారు. మార్చి 1వ తేదీకి సంబంధించిన టోకెన్లను ఆదివారం టీటీడీ(TTD) జారీ చేసింది. సాధారణ సర్వదర్శనం ద్వారా శ్రీవారి(Srivari)ని దర్శించుకోవడానికి తిరుపతికి వచ్చే భక్తులు 3 రోజుల పాటు వేచి ఉండాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. భక్తుల దర్శనానికి సుమారు 12 గంటల ముందు మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. అలిపిరి(Alipiri)లో టికెట్లను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొండపైకి పంపిస్తున్నారు. టికెట్లు(Tickets) లేని భక్తులను తిరుపతిలోనే నిలిపివేస్తున్నారు. దీంతో సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా 3 రోజుల పాటు తిరుపతిలోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇకపై భక్తులు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే (TTD New Rules)

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు అందరూ తప్పనిసరిగా దర్శన టిక్కెట్లు ఉంటేనే అలిపిరి తనిఖీ కేంద్రం, నడకదారి వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కొండకు అనుమతించనుంది. అంతే కాకుండా కోవిడ్ నిబంధనలు మేరకు ప్రతి భక్తుడు మాస్క్ ధరించి ఉంటేనే కొండకు అనుమతించనున్నారు. ఎటువంటి ప్లాస్టిక్ కవర్ లు తీసుకెళ్ళరాదని సూచించారు.‌ అంతేకాకుండా తిరుమలలో నిషేధిత వస్తువులైన మాంసం, మద్యం, బీడీలు, సిగెరెట్లు తదితర పొగాకు సంబందిత వస్తువులు పూర్తిగా నిషేధించిన కారణంగా కనుక భక్తులు ఎవరూ తమ వెంట సదరు వస్తువులను తీసుకొని రాకూడని హెచ్చరించారు.

ఘాట్ రోడ్డు అనుమతి సమయాలు ఇవీ (Tirumala Ghat Road Timings)

శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కువ శాతం సొంత వాహానాల్లో, బాడుగ వాహనాల్లో వస్తుంటారు. దీంతో ఎల్లప్పుడూ తిరుమల ఘాట్ రోడ్డులో (Tirumala Ghat Road) వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. కోవిడ్ ప్రభావంతో ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిలో పూర్తి స్థాయిలో మార్పు చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నుండి ఉదయం 3 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు, ద్విచక్ర వాహనాలను ఉదయం 4 గంటలు నుండి రాత్రి 10 గంటలు వరకు అనుమతించడమే కాకుండా హెల్మెట్ తప్పని సరిగా ధరించి రావాలని టీటీడీ తెలిపింది. ఘాట్ రోడ్డులో ప్రయాణ సమయంలో అతివేగం ప్రమాదకరం కావడంతో భక్తులు అందరూ నిదానంగానే ప్రయాణించాలని సూచించింది టీటీడీ. 

టాప్ హెడ్ లైన్స్

Jana Sena Joinings: జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
జనసేన తీర్థానికి వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ల దూరమా? బాలినేని ఉదంతం, పవన్ ఫిల్టరింగ్.. టీడీపీ వైపే ఎందుకు చూపు?
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. లిక్కర్ కేసులో ఇరికించే ప్రయత్నమన్న వైసీపీ నేత

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Ghee Adulteration Case: తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
తిరుమల నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం.. సుకృతి ఫుడ్స్‌ ప్రమోటర్ అరెస్ట్
Saikrishna Custodial Death Case: పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
పీఎస్‌లో కాదు, రాణిగారితోట బంగ్లాలో సాయికృష్ణ మృతి.. సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
Embed widget