అన్వేషించండి

Tirumala: తిరుమలలో పెరుగుతున్న రద్దీ, రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. నిన్న శ్రీవారిని 75 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, దర్శనం టోకెన్లు సంఖ్య పెంచడంతో భక్తుల సంఖ్య పెరుగుతోంది.

Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి పెరుగుతోంది. కరోనా తీవ్రత తగ్గుతుండడంతో ఆంక్షలు ఎత్తివేశారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా శనివారం రికార్డు స్థాయిలో భక్తులు(Devotees) శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న 75,704 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 33,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం రూ.3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ ప్రకటించింది. రెండు సంవత్సరాల తర్వాత శ్రీవారి(Srivari) సన్నిధిలో భక్తులు సందడి కనిపిస్తోంది. కరోనా(Corona) మొదలైన 2020 మార్చి నుంచి పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు. దర్శనం టికెట్లు (Darshan Tickets) కూడా పరిమిత సంఖ్యలోనే జారీ చేస్తున్నారు. టికెట్ల సంఖ్య పెంచడంతో గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ రోజుకు 75 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసింది. రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు, 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లతో పాటు వర్చువల్‌ సేవా టికెట్లు(Vartual Seva Tickets), వీఐపీ దర్శన టికెట్ల ద్వారా సుమార్ 75 వేల మందికి పైగా శనివారం స్వామి వారిని దర్శించుకున్నారు. 

అద్దె గదుల కొరత 

తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరుగుతుండడంతో అద్దె గదుల కొరత ఏర్పడింది. గదులు దొరక్క భక్తులు ఇబ్బంది పడుతున్నారు. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న నాద నీరాజనం షెడ్డు వద్ద భక్తులు అధిక సంఖ్యలో సేదతీరుతున్నారు. తిరుమలలో 1500 లకు పైగా గదులలో మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ కారణంగా గదుల కొరత ఏర్పడింది. కరోనాకు ముందు నాటి పరిస్థితులు ఇప్పుడు తిరుమలలో కనిపిస్తున్నాయి. తిరుపతి(Tirupati)లో రోజుకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు భక్తులు అందిస్తున్నారు. మార్చి 1వ తేదీకి సంబంధించిన టోకెన్లను ఆదివారం టీటీడీ(TTD) జారీ చేసింది. సాధారణ సర్వదర్శనం ద్వారా శ్రీవారి(Srivari)ని దర్శించుకోవడానికి తిరుపతికి వచ్చే భక్తులు 3 రోజుల పాటు వేచి ఉండాల్సి పరిస్థితులు ఏర్పడ్డాయి. భక్తుల దర్శనానికి సుమారు 12 గంటల ముందు మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. అలిపిరి(Alipiri)లో టికెట్లను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే కొండపైకి పంపిస్తున్నారు. టికెట్లు(Tickets) లేని భక్తులను తిరుపతిలోనే నిలిపివేస్తున్నారు. దీంతో సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు కూడా 3 రోజుల పాటు తిరుపతిలోనే వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇకపై భక్తులు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే (TTD New Rules)

శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే భక్తులు అందరూ తప్పనిసరిగా దర్శన టిక్కెట్లు ఉంటేనే అలిపిరి తనిఖీ కేంద్రం, నడకదారి వద్ద టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కొండకు అనుమతించనుంది. అంతే కాకుండా కోవిడ్ నిబంధనలు మేరకు ప్రతి భక్తుడు మాస్క్ ధరించి ఉంటేనే కొండకు అనుమతించనున్నారు. ఎటువంటి ప్లాస్టిక్ కవర్ లు తీసుకెళ్ళరాదని సూచించారు.‌ అంతేకాకుండా తిరుమలలో నిషేధిత వస్తువులైన మాంసం, మద్యం, బీడీలు, సిగెరెట్లు తదితర పొగాకు సంబందిత వస్తువులు పూర్తిగా నిషేధించిన కారణంగా కనుక భక్తులు ఎవరూ తమ వెంట సదరు వస్తువులను తీసుకొని రాకూడని హెచ్చరించారు.

ఘాట్ రోడ్డు అనుమతి సమయాలు ఇవీ (Tirumala Ghat Road Timings)

శ్రీవారి దర్శనార్థం నిత్యం వేలాది మంది భక్తులు ఎక్కువ శాతం సొంత వాహానాల్లో, బాడుగ వాహనాల్లో వస్తుంటారు. దీంతో ఎల్లప్పుడూ తిరుమల ఘాట్ రోడ్డులో (Tirumala Ghat Road) వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. కోవిడ్ ప్రభావంతో ఘాట్ రోడ్డులో వాహనాల అనుమతిలో పూర్తి స్థాయిలో మార్పు చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద నుండి ఉదయం 3 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు, ద్విచక్ర వాహనాలను ఉదయం 4 గంటలు నుండి రాత్రి 10 గంటలు వరకు అనుమతించడమే కాకుండా హెల్మెట్ తప్పని సరిగా ధరించి రావాలని టీటీడీ తెలిపింది. ఘాట్ రోడ్డులో ప్రయాణ సమయంలో అతివేగం ప్రమాదకరం కావడంతో భక్తులు అందరూ నిదానంగానే ప్రయాణించాలని సూచించింది టీటీడీ. 

టాప్ హెడ్ లైన్స్

Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget