అన్వేషించండి

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలలో భక్తుల రద్దీ అనుహ్యంగా పెరిగిపోయింది. భక్తుల దర్శనానికి రెండు రోజుల పట్టే అవకాశం ఉంది. కాబట్టి తిరుమల వచ్చే వారు దర్శనాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది.

Tirumala News : వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్స్ పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. విశేష సంఖ్యలో వచ్చిన భక్తులతో సప్తగిరులు గోవింద నామస్మరణలతో మారుమ్రోగుతున్నాయి.  శ్రీవారి దర్శనార్ధం నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులు క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటలు, రోజులు తరబడి వేచి ఉండి మరి స్వామి వారి ఆశీస్సులు పొందుతుంటారు. కోవిడ్ పూర్తి స్థాయిలో అదుపులోకి రావడంతో టీటీడీ సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ టిక్కెట్లు లేకుండానే భక్తులను కొండకు అనుమతిస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా భక్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులతో తిరుమలగిరులు నిండి పోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1,2 లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి పోవడంతో సర్వదర్శనం క్యూలైన్ లేపాక్షి సర్కిల్ దాటుకుని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా కొత్త అన్నదాన సత్రం వరకూ చేరింది. 

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

మరికొద్ది రోజుల పాటు రద్దీ 

భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్స్ వద్ద అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే‌కాకుండా భక్తుల అనూహ్య రద్దీపై వివిధ విభాగాధిపతులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ ఏర్పాట్లపై ఆరా తీస్తున్నారు. అంతే కాకుండా క్యూలైన్స్ వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి సౌఖర్యాలు ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. మరికొద్ది రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు నిమగ్నం అయ్యారు. భక్తుల సంఖ్య పెరగడంతో భక్తుల రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిథి గృహాలు, వసతి భవనాలు, పీఏసీ-1,2,3,4,5 వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు.  

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు 

తిరుమలలో అధిక భక్తుల రద్దీ దృష్ట్యా ఆదివారం వి.ఐ.పి బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా ఉందని, వైకుంఠ ఏకాదశి నాడు కంటే అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారని, గంటకు 4500 మంది భక్తులకి మాత్రమే దర్శన భాగ్యం కల్పించే అవకాశం ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని, ఔట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండింతలు అధికంగా ఉందన్నారు. అధిక రద్దీ దృష్టిలో ఉంచుకొని భక్తులకు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన కోరారు. పోలీసు, విజిలెన్స్, టీటీడీ స్టాఫ్ భక్తుల సౌకర్యం కల్పించడం కోసం శ్రమిస్తున్నట్లు వెల్లడించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan:
"ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతంగా మార్చేశారని ప్రజలు బాధపడుతున్నారు" కాలుష్యంపై పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Chairman: కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
C J Roy suicide: బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య - ఐటీ అధికారుల విచారణ తర్వాత ప్రాణం తీసుకున్న సీజే రాయ్
బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య - ఐటీ అధికారుల విచారణ తర్వాత ప్రాణం తీసుకున్న సీజే రాయ్
CM Revanth : హార్వార్డ్ లో 21వ శతాబ్దంలో నాయకత్వంపై శిక్షణ పూర్తి - మెరుగైన సేవలందించడంలో సాయపడుతుందని రేవంత్ సంతృప్తి
హార్వార్డ్ లో 21వ శతాబ్దంలో నాయకత్వంపై శిక్షణ పూర్తి - మెరుగైన సేవలందించడంలో సాయపడుతుందని రేవంత్ సంతృప్తి

వీడియోలు

YSRCP vs TDP Conflict in GVMC Council | జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ రగడ | ABP Desam
Chetla tandra Lakshmi Narasimha Temple | అరటిగెలల మహోత్సవం చూడాలనుకుంటున్నారా.? | ABP Desam
Building Gaddelu in Medaram Jatara 2026 | మేడారంలో వినూత్న రీతిలో భక్తుల పూజలు | ABP Desam
Rangoli for Samakka in Medaram Jatara | సమ్మక్క రాక కోసం ముగ్గులు వేసిన భక్తులు
Tribal Dance in Medaram Jatara 2026 | మేడారంలో ఆదివాసీల డోలు విన్యాసాలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan:
"ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతంగా మార్చేశారని ప్రజలు బాధపడుతున్నారు" కాలుష్యంపై పవన్ కీలక వ్యాఖ్యలు
TTD Chairman: కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
కల్తీ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ లేదని సిట్ నిర్దారించలేదు - చార్జిషీట్‌లో లోపాలు - టీటీడీ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
C J Roy suicide: బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య - ఐటీ అధికారుల విచారణ తర్వాత ప్రాణం తీసుకున్న సీజే రాయ్
బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్త ఆత్మహత్య - ఐటీ అధికారుల విచారణ తర్వాత ప్రాణం తీసుకున్న సీజే రాయ్
CM Revanth : హార్వార్డ్ లో 21వ శతాబ్దంలో నాయకత్వంపై శిక్షణ పూర్తి - మెరుగైన సేవలందించడంలో సాయపడుతుందని రేవంత్ సంతృప్తి
హార్వార్డ్ లో 21వ శతాబ్దంలో నాయకత్వంపై శిక్షణ పూర్తి - మెరుగైన సేవలందించడంలో సాయపడుతుందని రేవంత్ సంతృప్తి
Hyderabad Crime News: అదానీ గ్రూప్‌కు లక్కీ భాస్కర్ తరహా టోకరా; రెండు కోట్ల సిమెంట్‌ స్కామ్‌, హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘరానా మోసం 
అదానీ గ్రూప్‌కు లక్కీ భాస్కర్ తరహా టోకరా; రెండు కోట్ల సిమెంట్‌ స్కామ్‌, హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘరానా మోసం 
Deputy CM Sunetra Pawar: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి - శనివారమే ప్రమాణ స్వీకారం
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి - శనివారమే ప్రమాణ స్వీకారం
Medaram Jatara 2026: మేడారం జాతర ముగింపు! వనదేవతల వీడ్కోలు, భక్తుల భావోద్వేగం! 2028లో మళ్ళీ కలుద్దాం!
మేడారం జాతర ముగింపు! వనదేవతల వీడ్కోలు, భక్తుల భావోద్వేగం! 2028లో మళ్ళీ కలుద్దాం!
India EU trade Deal: ఇండియా, యూరప్ ట్రేడ్ డీల్‌తో పాకిస్తాన్‌కు చావు దెబ్బ - ఎగుమతల సంక్షోభంలోకి జారుకోనున్న దాయాది
ఇండియా, యూరప్ ట్రేడ్ డీల్‌తో పాకిస్తాన్‌కు చావు దెబ్బ - ఎగుమతల సంక్షోభంలోకి జారుకోనున్న దాయాది
Embed widget