By: ABP Desam | Updated at : 22 Apr 2023 01:51 PM (IST)
చంద్రబాబుపై రాళ్ల దాడి అంశం వివాదాస్పదం - వైరల్ అవుతున్న వీడియో !
Andhra News : ఎర్రగొండపాలెంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జరిపిన రాళ్ల దాడి అంశం వివాదాస్పదం అవుతోంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై రాళ్ళ దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. వీఐపీ భద్రతకు సంబంధించి స్థానిక పోలీసులు స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు ఎర్రగొండపాలెం వస్తున్న సమయంలో ముందస్తుగానే ఘర్షణలకు కుట్ర చేశారన్న కొన్ని వీడియోలను టీడీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మంత్రి సురేష్ పోలీసులను ఆదేశిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
బాబూ రెడీ అమ్మ..స్టార్ట్ కెమెరా..యాక్షన్..
— Telugu Desam Party (@JaiTDP) April 22, 2023
మంత్రి : నేను ఇలా చేస్తే, మీరు ఇలా చేయండి. సీన్ అదిరిపోవాలి.. సీఎం దగ్గర మంచి పేరు రావాలి!
పోలీసులు : అలాగే సార్ #IdhemKarmaManaRashtraniki pic.twitter.com/BEub71iETv
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై 151 సీఆర్పీసీని ఉపయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని టీడీపీ నేతలంటున్నారు. . ప్రతిపక్ష నేతను అణచివేసేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆందోళనకారులు దాడికి ముందుగా సిద్ధమైనప్పటికీ వారిని స్థానిక పోలీసులు నిరోధించకపోవడం పట్ల టీడీపీ నేతలు అభ్యంతరం తెలుపుతున్నారు. చంద్రబాబుకు తగిన భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని.. వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర హోంశాఖను కోరాలని నిర్ణియంచుకున్నారు.
వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో గాయపడిన NSG అధికారి (Team Head) సంతోష్ కుమార్ ను పరామర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...
— అనిల్ ☣️ (@Anil1k98) April 21, 2023
సంతోష్ కుమార్ కు అందిన ట్రీట్మెంట్ పై వివరాలు అడిగి తెలుసుకున్న టీడీపీ అధినేత... pic.twitter.com/agawXanzGE
మరోవైపు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై వైసీపీ రాళ్ల దాడి ఘటనపై ఎన్ఎస్జీ హెడ్క్వార్టర్స్ సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రాళ్ల దాడిపై ఎన్ఎస్జీ హెడ్ క్వార్టర్స్కు ఇక్కడి అధికారులు సమాచారం ఇచ్చారు. ఎన్ఎస్జీ కమాండెంట్కు రాళ్ల దాడిలో గాయాలు కావడంపై హెడ్ క్వార్టర్స్ ఆరా తీసింది. తలపై గాయం కావడంతో కమాండెంట్ను అధికారులు స్కానింగ్కు పంపించారు. చంద్రబాబు దగ్గర వరకు ఆందోళనలను రానివ్వడంపై ఎన్ఎస్జీ బృందం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు భద్రతపై కేంద్ర హోంశాఖకు కూడా ఎన్ఎస్జీ నివేదిక పంపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అయితే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం తాము శాంతియుతంగా నిరసన తెలుపుతూంటే.. తెలుగుదేశం పార్టీ నేతలే రాళ్ల దాడి చేశారని ఆరోపిస్తున్నారు. మంత్రి సురేష్ మీడియా సమావేశం పెట్టి కొన్ని వీడియోలు విడుదల చేశారు. అందులో టీడీపీ కండువాలు కప్పుకుని ఉన్న కొంత మంది ఓ మూల నుంచి రాళ్లు విసురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలే రాళ్లు విసిరారని.. వైసీపీ వాళ్లెవరూ రాళ్లయలేదని సురేష్ చెబుతున్నారు.
TTD News: శ్రీనివాసుడి సన్నిధిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?
Guntur News: రెండేళ్ల కన్నకూతుర్ని బండకేసి కొట్టిన తండ్రి! స్పాట్లోనే చిన్నారి మృతి
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
Chandrababu : చంద్రబాబు పేరు చెబితే పథకాలు గుర్తుకు రావా ? స్కీమ్స్ వైఎస్ఆర్సీపీ సొంతమేనా ?
Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
కాంగ్రెస్లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్
Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు