అన్వేషించండి

Fake Vote Politics: ఏపీలో ఇంటి నెంబర్ లేకుండా 2 లక్షల ఓట్లు, మరి దొంగ ఓట్లు ఎన్ని?- ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

MLC Kancharla Srikanth: పుంగనూరులో ఇంటి నెంబర్లు లేకుండా రెండు వేల ఓట్లు నమోదయ్యాయయన్నారు.  ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు.

MLC Kancharla Srikanth: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. పలు సంచలన ఆరోపణలు చేశారు. పుంగనూరులో ఇంటి నెంబర్లు లేకుండా రెండు వేల ఓట్లు నమోదయ్యాయయన్నారు.  ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.  ఓటర్ల వెరిఫికేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా బయట పడ్డాయని ఆరోపించారు. అందులో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎన్నికల సంఘం నిజా నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. 

‘ఏం సమాధానం చెబుతావు.. పెద్దిరెడ్డి’
కుప్పంలో 25 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారని అందులో వాస్తవం లేదని కంచర్ల అన్నారు. ఏవైనా దొంగ ఓట్లను గుర్తిస్తే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పుంగనూరు టౌ‌న్‌లో రెండు వేలకు పైగా ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా ఉన్నాయని, వీటికి పెద్దిరెడ్డి ఏం చెబుతారని ప్రశ్నించారు. కుప్పంలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. టీడీపీ తరుఫున తామే 12 వేలకు పైగా చనిపోయినవారు, బయట స్థిరపడ్డ వారి వివరాలు ఇచ్చామని తెలిపారు. ఈ సారి పుంగనూరులోనే మంత్రి పెద్దిరెడ్డిని ఓడించి టీడీపీ సత్తా ఏంటో చాటి చెబుతామన్నారు.

దొంగ ఓట్లతో అధికారులు సస్పెండ్ అయ్యారు
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో జరిగిన దొంగ ఓట్ల బాగోతంలో అధికారులు సస్పెండ్ అయ్యారని కంచర్ల శ్రీకాంటత్ అన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు అన్యాయంగా, అక్రమంగా తీసేస్తే చట్ట పరంగా, న్యాయ పరంగా కేసులు వేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను ఉపయోగించకూడదని చెప్పినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సార్లు వలంటీర్ పేరుతో వైసీపీ కార్యకర్తలు ఓటర్ వెరిఫికేషన్‌కు వెళ్తున్నారని ఆరోపించారు. బీఎల్‌ఓలతో కలిసి వాలంటీర్లు ఓటర్ల వెరిఫికేషన్‌కు వెళ్తే కేసులు వేస్తామని హెచ్చరించారు. అలాగే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

కుప్పంలో ఎగిరేది టీడీపీ జెండానే..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు కుప్పంలోనూ గెలిచేదే టీడీపీనే కంచర్ల అన్నారు. కుప్పంలో గెలిచేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని, పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు యత్నిస్తోందని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 10 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, కుప్పంలో తిరుగుతున్న పెద్దిరెడ్డి దీనికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లోకేష్ చేపడుతున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారం చేపడుతుందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అభివృద్ధిని అటకెక్కించారని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు తెచ్చారని ఎద్దేవా చేశారు.

కుప్పంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సీటుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పట్టుకోసం పోరాడుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఉనికి చాటుకున్న వైసీపీ ఈ సారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే కసితో ఉంది. అలాగే కుప్పంలో మరో సారి జెండా ఎగరేసి తమ పట్టు నిలుపుకోవాలని గట్టిగా పోరాడుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనేHardik Pandya Divorce |Anant Ambani-Radhika Merchant's sangeet ceremony| సింగిల్ గానే ఉంటున్న పాండ్యAnant Ambani Radhika Merchant Wedding | Sangeet Ceremony | ఘనంగా అనంత్ అంబానీ సంగీత్ వేడుక | ABPDoddi Komaraiah Death Anniversary | కడవెండి పౌరుషం తెలంగాణ మట్టిని ముద్దాడి 78 సంవత్సరాలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌
Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
రాజ్‌ తరుణ్‌ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు 
TGTET: 'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
'టెట్' నిర్వహ‌ణ‌ ఇకపై ఏడాదికి రెండుసార్లు, ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
Union Budget 2024: ఈ నెల 23న కేంద్ర బడ్జెట్, కీలక ప్రకటన చేసిన పార్లమెంట్ వ్యవహారాల మంత్రి
ఈ నెల 23న కేంద్ర బడ్జెట్, కీలక ప్రకటన చేసిన పార్లమెంట్ వ్యవహారాల మంత్రి
Malvi Malhotra: అతడితో కంఫర్టబుల్ గా ఫీలయ్యాను- రాజ్ తరుణ్ గురించి మాల్వీ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అతడితో కంఫర్టబుల్‌గా ఫీలయ్యా- రాజ్ తరుణ్ గురించి మాల్వీ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Xiaomi SU7: బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తున్న షావోమీ - సింగిల్ ఛార్జ్‌తో 800 కిలోమీటర్లు!
బెస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకొస్తున్న షావోమీ - సింగిల్ ఛార్జ్‌తో 800 కిలోమీటర్లు!
YS Jagan: దాడులు ఇక్కడితో ఆపండి, లేకపోతే రేపు మీ వాళ్లకు ఇదే గతి!: చంద్రబాబుకు వైఎస్ జగన్ వార్నింగ్
దాడులు ఇక్కడితో ఆపండి, లేకపోతే రేపు మీ వాళ్లకు ఇదే గతి!: చంద్రబాబుకు వైఎస్ జగన్ వార్నింగ్
Embed widget