అన్వేషించండి

Fake Vote Politics: ఏపీలో ఇంటి నెంబర్ లేకుండా 2 లక్షల ఓట్లు, మరి దొంగ ఓట్లు ఎన్ని?- ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్

MLC Kancharla Srikanth: పుంగనూరులో ఇంటి నెంబర్లు లేకుండా రెండు వేల ఓట్లు నమోదయ్యాయయన్నారు.  ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చెప్పారు.

MLC Kancharla Srikanth: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడుతూ.. పలు సంచలన ఆరోపణలు చేశారు. పుంగనూరులో ఇంటి నెంబర్లు లేకుండా రెండు వేల ఓట్లు నమోదయ్యాయయన్నారు.  ఈ విషయంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.  ఓటర్ల వెరిఫికేషన్ లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా బయట పడ్డాయని ఆరోపించారు. అందులో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో ఎన్నికల సంఘం నిజా నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. 

‘ఏం సమాధానం చెబుతావు.. పెద్దిరెడ్డి’
కుప్పంలో 25 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారని అందులో వాస్తవం లేదని కంచర్ల అన్నారు. ఏవైనా దొంగ ఓట్లను గుర్తిస్తే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు. పుంగనూరు టౌ‌న్‌లో రెండు వేలకు పైగా ఓట్లు ఇంటి నెంబర్ లేకుండా ఉన్నాయని, వీటికి పెద్దిరెడ్డి ఏం చెబుతారని ప్రశ్నించారు. కుప్పంలో ఉన్న దొంగ ఓట్లను తొలగించాలని, అందుకు తాము సహకరిస్తామన్నారు. టీడీపీ తరుఫున తామే 12 వేలకు పైగా చనిపోయినవారు, బయట స్థిరపడ్డ వారి వివరాలు ఇచ్చామని తెలిపారు. ఈ సారి పుంగనూరులోనే మంత్రి పెద్దిరెడ్డిని ఓడించి టీడీపీ సత్తా ఏంటో చాటి చెబుతామన్నారు.

దొంగ ఓట్లతో అధికారులు సస్పెండ్ అయ్యారు
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతిలో జరిగిన దొంగ ఓట్ల బాగోతంలో అధికారులు సస్పెండ్ అయ్యారని కంచర్ల శ్రీకాంటత్ అన్నారు. కొందరు అధికారులు అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లు అన్యాయంగా, అక్రమంగా తీసేస్తే చట్ట పరంగా, న్యాయ పరంగా కేసులు వేస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియలో వలంటీర్లను ఉపయోగించకూడదని చెప్పినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొన్ని సార్లు వలంటీర్ పేరుతో వైసీపీ కార్యకర్తలు ఓటర్ వెరిఫికేషన్‌కు వెళ్తున్నారని ఆరోపించారు. బీఎల్‌ఓలతో కలిసి వాలంటీర్లు ఓటర్ల వెరిఫికేషన్‌కు వెళ్తే కేసులు వేస్తామని హెచ్చరించారు. అలాగే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

కుప్పంలో ఎగిరేది టీడీపీ జెండానే..
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు కుప్పంలోనూ గెలిచేదే టీడీపీనే కంచర్ల అన్నారు. కుప్పంలో గెలిచేందుకు వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని, పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు యత్నిస్తోందని ఆరోపించారు. పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 10 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, కుప్పంలో తిరుగుతున్న పెద్దిరెడ్డి దీనికి ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. లోకేష్ చేపడుతున్న పాదయాత్రకు విశేష స్పందన వస్తోందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారం చేపడుతుందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. అభివృద్ధిని అటకెక్కించారని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీకి గుర్తింపు తెచ్చారని ఎద్దేవా చేశారు.

కుప్పంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ సీటుపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పట్టుకోసం పోరాడుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో ఉనికి చాటుకున్న వైసీపీ ఈ సారి ఎలాగైనా కుప్పంలో చంద్రబాబును ఓడించాలనే కసితో ఉంది. అలాగే కుప్పంలో మరో సారి జెండా ఎగరేసి తమ పట్టు నిలుపుకోవాలని గట్టిగా పోరాడుతోంది.

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Embed widget