అన్వేషించండి

TDP MLAs Suspension: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ - ఎప్పటివరకంటే ?

తెలుగుదేశం పార్టీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. పాలనా వికేంద్రీకరణపై చర్చకు అడ్డు పడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు.

TDP MLAs Suspension:   అసెంబ్లీ నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. సభలో ఉన్న పదహారు మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పీకర్‌ను కోరారు.  టీడీపీ నేతలు సభను ఉద్దేశపూర్వకంగా జరగనీయకుండా చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి  విమర్శించారు. పరిపాలనా వికేంద్రీకరణపై చర్చ జరుగుతుందని దీన్ని అడ్డుకోవడం సరికాదని, సభ సజావుగా జరగడానికి టీడీపీ సభ్యులు సహకరించడంలేదని బుగ్గన పేర్కొంటూ టీడీపీ సభ్యులు అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, వెంకటరెడ్డి, సీవీ జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్ రావు, రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంచల రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయ స్వామి తదితరులను సభ నుంచి సప్పెండ్ చేయాల్సిందిగా బుగ్గను సభాపతికి సూచించారు. దీంతో తమ్మినేని సీతారాం ఒక రోజు సభ నుంచి టీడీపీ నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో తెలుగుదేశం పార్టీ తరపున నిమ్మల రామానాయుడు మాట్లాడారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో రాజధాని ప్రకటన రాక ముందే సభలో ఉన్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని ఆరోపించారు. దీనిపై స్పందించిన పయ్యావుల కేశవ్.. తాను భూములు కొన్నది రాజధాని ప్రకటన తర్వాతేనన్నారు. తన విషయంలో తప్పు ఉంటే బినామీ చట్టం ఉపయోగించి భూములు స్వాధీనం చేసుకోవచ్చని సవాల్ చేశారు. ఈ సందర్భంగా అమరావతి భూముల విషయంలో ప్రభుత్వం  ఇప్పటి వరకూ చేసిన ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేదని ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో వేసిన కేసుల్ని ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. 

రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు. పయ్యావుల విమర్శలపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అమరావతి ప్రకటన రాక ముందే  టీడీపీ నేతలు భూములు కొన్నారని... అక్కడ భూములన్నీ కొద్ది మంది వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. పాదయాత్ర చేస్తున్న వాళ్లెవరుూ రైతులు కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో పయ్యావులపై మరిన్ని ఆరోపణలు చేయడంతో.. వివరణ ఇచ్చే అవకాశాన్ని పయ్యావులకు ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. నినాదాలు చేశారు. 

పాలనా వికేంద్రీకరణపై చర్చ జరగకుండా ఇలా నినాదాలు చేస్తున్నందున టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలని సభా వ్యవహారాల మంత్రి కూడా  అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి  చేశారు. తమ వాయిస్ వినిపించకుండా ..గొంతు నొక్కేందుకేసస్పెండ్ చేశారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు.  ఈ ఒక్క రోజుకే సస్పెన్షన్ వేటు విధించడంతో మళ్లీ రేపట్నుంచి టీడీపీ సభ్యులు సభకు  హాజరు కానున్నారు.  అసెంబ్లీ మరో నాలుగు రోజుల పాటు సాగనుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget