అన్వేషించండి

TDP Election Campaign : టీడీపీ 100 రోజుల ప్రచార ప్రణాళిక - ముఖ్యనేతలంతా ప్రజల్లోనే ! ఇదే షెడ్యూల్

TDP : తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. వచ్చే వంద రోజు పాటు టీడీపీలోని అన్ని విభాగాలు ప్రచారంలో పాల్గొంటాయి.

Telugu Desam Party has started its election campaign :  తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టుంది.  "రా... కదలిరా’ పిలుపుతో 5 నుంచి జనంలోకి చంద్రబాబు వెళ్లనున్నారు. 5 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్ల పరిధిలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.   టీడీపీ-జనసేన సంయక్తంగా నిర్వహించే ఈ సభలకు చంద్రబాబుతో పాటు  జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు. టీడీపీ జనవరి నెల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ను ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.  బుధవారం 3వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్సన్ సెంటర్లో రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం సమావేశం నిర్వహించబోతున్నారు.   4వ తేదీన పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు చేతులమీదుగా ‘జయహో బీసీ’ ప్రారంభం అవుతుంది.  బీసీల్ని ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి ఎంత దారుణంగా వంచించారో, ఎంతగా వారిపై దమనకాండ సాగిస్తున్నారో ప్రతి బీసీ కుటుంబానికి తెలియచేసి బలహీనవర్గాల్లో చైతన్యమే లక్ష్యంగా టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తోంది.  టీ.ఎన్.టీ.యూ.సీ విభాగం ఆధ్వర్యంలోకార్మికుల్లో చైతన్యం తీసుకురావడమే ధ్యేయంగా త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేయనున్నారు.   

పంచాయతీ రాజ్ వర్క్ షాప్
 
56 నెలల నుంచీ విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ రెడ్డి అవినీతిపరు లు, అసమర్థులు, నేరస్తుల్ని పెంచి పోషిస్తున్నాడని, వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎటు చూసినా విధ్వంసాలు, విద్వేషాలు, వైఫల్యాలు తప్ప, భూతద్దంలో వెతికినా కూడా ఎక్కడా ఒక మంచిపని కానీ, విజయం కానీ కనిపించవని,  భస్మాసురుడి లా జగన్ రెడ్డి మొత్తం రాష్ట్రాన్నే విధ్వంసం చేశాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజ రాపు అచ్చెన్నాయుడు  ఆగ్రహం వ్యక్తం చేశారు.   ప్రజా చైతన్యమే లక్ష్యంగా రాబోయే 100 రోజుల్లో నిర్విరామంగా టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తారు.  100రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. చివరిదశకు చేరిన జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనకు ముగింపు పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ 100రోజుల్లో ఈ ప్రభుత్వం, జగన్ రెడ్డి వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం తీసుకురావడానికి  టీడీపీ నిర్విరామంగా కార్యక్రమాలు చేపట్టనుంది.  టీడీపీ చేపట్టబోయే కార్యక్రమాల్లో ముందుగా  మంగళగిరి లోని  పార్టీ జాతీయ కార్యాలయం సమీపంలోని కన్వెన్షన్ సెంటర్లో పంచాయతీ రాజ్ వర్క్ షాపు నిర్వహించబోతున్నా. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ఆహ్వానం పంపించాం. వారందరి సమక్షంలో ఈ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను ఏవిధంగా నిర్వీర్యం చేసిందో, జగన్ రెడ్డి ఏ విధంగా పల్లెల్ని నాశనంచేస్తాడో తెలియచేస్తాం. తాము చెప్పే అంశాలను స్థానిక ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజలకు తెలియచే స్తే, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లినట్టే. అలానే టీడీపీ ప్రభుత్వ రాగానే పంచాయతీల బలోపేతానికి, పునర్వైభవానికి ఎలాంటి చర్యలు తీసుకుంటామో, ఏ విధమైన కార్యాచరణ అమలుచేస్తామో  కూడా ఈ వర్క్ షాపులో తెలియచేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. 

 జయహో బీసీ వర్క్ షాప్

 జగన్ రెడ్డి  తన పాలనలో బీసీ లను దారుణంగా వంచించాడని అచ్చెన్నాయుడు ఆరోపించారు.  వారిపై తప్పుడు కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేయించాడు. తన దుర్మార్గాలు ప్రశ్నించిన బీసీలను దారుణంగా చంపించా డు. 4 సంవత్సరాల 7 నెలలుగా ఈ ముఖ్యమంత్రి బీసీలపై దమనకాండ సాగిస్తున్నాడు. బీసీలుగా పుట్టడమే తప్పు అన్నట్టు వారిపై తన పైశాచికత్వం ప్రదర్శిస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు 10శాతం కోత పెట్టాడు. 16వేలకు పైగా పదవుల్ని బీసీలకు దక్కకుండా చేశాడు. ఉత్తుత్తి కార్పొ రేషన్లు పెట్టి బీసీలను ఉద్ధరిస్తున్నట్టు కల్లబొల్లి మాటలు చెబుతున్నాడని మండిపడ్డారు.  బీసీ మంత్రుల్ని ఉత్సవవిగ్రహాల కంటే దారుణంగా తయారుచేశాడు.  ఇవన్నీ అందరికీ అర్థమయ్యేలా తెలియచేయడానికి టీడీపీ ఆధ్వర్యంలో ‘జయహో బీసీ’ కార్యక్రమాన్ని 4వ తేదీన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించబోతున్నారు. 4వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో కార్యక్రమం జరుగుతుంది. అలానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి బీసీ ఇంటి తలుపు తట్టేలా ‘జయహో బీసీ’ దిగ్విజయంగా కొనసాగు తుందని తెలిపారు. 

5వ తేదీ నుంచి ప్రజల్లోకి చంద్రబాబు  

5వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. దానిలో భాగంగా 5వ తేదీన ‘రా..కదలిరా’ పేరుతో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నా రు. 5వ తేదీన ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో తొలి సభ జరగనుంది.  5వ తేదీ నుంచి 29వ తేదీవరకు 22 పార్లమెంట్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. రోజుకి 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొంటారు. ప్రతిసభకు లక్షలాది ప్రజలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఏపీ ఒక నూతన నవోదయం చూసేందుకు టీడీపీ-జనసేన పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. రెండుపార్టీల కలయి కను, అవి నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిాపుర. 
 
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా భారీ బహిరంగ సభల వివరాలు... 

 5వ తేదీన : ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కనిగిరిలో..
 6వ తేదీన : విజయవాడ పార్లమెంట్ పరిధిలోని తిరువూరు, నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ఆచంట.
 9వ తేదీన : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి, నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఆళ్లగడ్డ.
  10వ తేదీన : విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని తుని. 
 18వ తేదీన : తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి వర్థంతిని మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని గుడివాడ లో భారీస్థాయిలో సభ నిర్వహించనున్నాం
   19వ తేదీన : చిత్తూరు పార్లెమంట్ పరిధిలోని జీడీ నెల్లూరు,  కడప పార్లమెంట్ పరిధిలోని కమలాపురం
  20వ తేదీన : అరకు పార్లమెంట్ పరిధిలోని అరకులో,  అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మండపేట.
 24న : రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని ఉవరకొండ.
25న : నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కొవ్వూరు, కర్నూలు పార్లమెంట్ పరిధిలోని పత్తికొండ అసెంబ్లీలో.
27న : రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని గోపాలపురం, గుంటూరు పార్లమెంట్ లోని పొన్నూరు అసెంబ్లీలో.
28న : అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల, శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని టెక్కలిలో..
29 వ తేదీన : ఏలూరు పార్లమెంట్ పరిధిలోని ఉంగుటూరు, బాపట్ల పార్లమెంట్ చీరాల నియోజకవర్గంలో  భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నాం. టీడీపీ – జనసేన కలిసే సభల్ని నిర్వహిస్తున్నాయి. చంద్రబాబుతో పాటు, పవన్ కల్యాణ్ కూడా కొన్ని సభలకు హాజరవుతారు.  

టీడీపీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు 

తెలుగుదేశంలో  చేరడానికి చాలామంది అధికారపార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ తామే ఆచితూచి వ్యవహరిస్తున్నాం. పార్టీలో చేరికలకు సంబంధించి రెండు కమిటీలు వేశాం. కమిటీల అభిప్రాయాలు, అధినాయకుడి నిర్ణయమే అంతిమం. పార్టీ నేతలతో సంప్రదించాకే కొత్తవారి చేరికపై స్పష్టమైన నిర్ణయానికి వస్తాం. ఒక వారంలో తెలుగుదేశంలో చేరేఇతర పార్టీలనేతలపై ఒక స్పష్టత వస్తుంది.   సొంత పార్టీ నాయకులకే ఈ ముఖ్య మంత్రిపై విశ్వాసం లేదు. ఈ రోజో, రేపో తనపార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నానన్నాడు.. మరలా పిల్లిలా వెనకడుగు వేశాడని ఎద్దేవా చేశారు. 

టీ.ఎన్.టీ.యూ.సీ  బస్సుయాత్ర 

టీ.ఎన్.టీ.యూ.సీ విభాగం తర్వలోనే బస్సుయాత్ర చేపట్టనుంది. దానికి సంబంధించిన పోస్టర్ ను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నాం. టీ.ఎన్.టీ.యూ.సీ నేతలు అన్నిరంగాల కార్మికులతో మాట్లాడి, టీడీపీ ప్రభుత్వంలో కార్మికులకు జరిగిన మేలు..ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి చేసిన మోసాల్ని వివరిస్తారు.” అని అచ్చెన్నాయుడు తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget