Breaking News Live Updates: డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని జప్తు చేయవద్దు : తెలంగాణ హైకోర్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా నవంబరు 5న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
హైదరాబాద్లో పెద్ద ఎత్తున బాణాసంచా పేలుడు సంభవించింది. చత్రినాక సమీపంలోని కందికల్ గేటు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరొక ఇద్దరికి గాయాలయ్యాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారు చేసే పరిశ్రమలో ఈ పేలుడు సంభవించింది. అందులో బాణా సంచాకు నిప్పు అంటుకోవడం వల్ల పెలుడు సంభవించి అగ్ని ప్రమాదానికి దారి తీసినట్లుగా భావిస్తున్నారు. చనిపోయిన వారిని పశ్చిమ బంగాల్కు చెందిన విష్ణు అనే 25 ఏళ్ల వ్యక్తి, జగన్నాథ్ అనే 30 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు గురించి ఆరా తీశారు. క్షతగాత్రుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాణా సంచాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీలో వాడే రసాయనాలు కలవడం వల్ల పేలుడు తీవ్రత మరింత పెరిగిందని పోలీసులు చెప్పారు.
మరోవైపు, దీపావళి సంబరాల సందర్భంగా టపాకాయలు కాల్చుతూ నగరంలో దాదాపు 20 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. గాయపడ్డ బాధితులు మెహదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రితో పాటు పలు ఆస్పత్రుల్లో చేరారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఎన్హెచ్-44పై ప్రమాదం
హైదరాబాద్ శివారులో బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉన్నట్టుండి బ్రేక్ వేయడంతో శాంత్రో కారు బస్సును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డాక్టర్కు తీవ్రగాయాలయ్యాయి. కాగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారంతా షాద్ నగర్కు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
గోల్నాకలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్లో గోల్నాకలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పేపర్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఫలితంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ సహయంతో మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Nellore: నెల్లూరులో టపాసుల విక్రయాలు అంతంతమాత్రమే.. వ్యాపారులు లబోదిబో, కారణం ఏంటంటే..
Also Read: AP Corona Update: ఆంధ్రప్రదేశ్ లో 301 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాన్ని జప్తు చేయవద్దు : తెలంగాణ హైకోర్టు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలు జప్తుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాహనాలు జప్తు చేసే అధికారం పోలీసులకు లేదని తెలిపింది. మద్యం తాగిన వ్యక్తి బండి నడిపితే బంధువులను పిలిచి వాహనం అప్పగించాలని తెలిపింది. ఎవరు రాకపోతే పీఎస్ కు తరలించి తర్వాత అప్పగించాలని ఆదేశించింది. ఆదేశాలు అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చిరించింది.
వైద్యుల నిర్లక్ష్యం... నిండు ప్రాణం బలి...!
హనుమకొండలో వైద్యుల నిర్లక్ష్యానికి బాలుడు మరణించాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు మృతి చెందాడు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ కిందపడిపోయిన జునైద్ పాషా(8) శుక్రవారం చనిపోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం వలనే బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ట్రీట్మెంట్ చేస్తున్నామని డబ్బులు కట్టించుకొని, చివరికి మరణించాడని డాక్టర్లు చెప్తున్నారని కుటుంబసభ్యుల ఆవేదన చెందుతున్నారు. హాస్పిటల్ ముందు బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు.





















