అన్వేషించండి

TDP Kanthitho Kranthi: అనంతపురంలో కాంతితో క్రాంతి - క్యాండిల్స్, కాగడాలు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం

TDP Kanthitho Kranthi: కాంతితో క్రాంతి పేరుతో మరోసారి తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు కుటుంసభ్యులు, మద్దతుదారులు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు నిరసన చేపట్టారు.

TDP Kanthitho Kranthi: 

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే పేరుతో శాంతియుతంగా నిరసన తెలిపారు. నేడు కాంతితో క్రాంతి పేరుతో మరోసారి తెలుగుదేశం పార్టీ నేతలు, చంద్రబాబు కుటుంసభ్యులు, మద్దతుదారులు రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు నిరసన చేపట్టారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని అనంతపురం జిల్లా టీడీపీ నేతలు పరిటాల శ్రీరామ్ కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు.

గత 25 రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ పోరాటం కేవలం చంద్రబాబు కోసం మాత్రమే కాదని రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అన్నారు. టిడిపి అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు అనంతపురం జిల్లా వ్యారప్తంగా కాంతితో క్రాంతి కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.  అనంతపురం నగరంలో జిల్లా అధ్యక్షుడు కాల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కాల్వ శ్రీనివాసులు ఇంటి వద్ద కాగడాలు వెలిగించి కాంతితో క్రాంతితో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ధర్మవరం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ తమ నివాసంలో పార్టీ కార్యకర్తల్లో కలిసి కాగడాలు వెలిగించారు.

మాజీ మంత్రి పరిటాల సునీత తన స్వగ్రామంలో గ్రామ ప్రజలతో కలిసి చంద్రబాబుకు సంఘీభావంగా కాంతితో క్రాంతి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం నేతలు వైకుంఠం ప్రభాకర్ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు, జితేంద్ర గౌడ్, కందికుంట వెంకటప్రసాద్,  జేసీ అస్మిత్ రెడ్డి,బండారు శ్రావణి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో టిడిపి శ్రేణులతో కొవ్వొత్తులు కగడలతో ప్రదర్శన నిర్వహించారు. రాత్రి ఏడు గంటల సమయంలో విద్యుత్ దీపాలు అన్ని ఆర్పి కొవ్వొత్తులు, సెల్ ఫోన్ల లైట్ల వెలుగులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబుకు అనుకూలంగా, సైకో పోవాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రశ్నించిన వారిని జైలుకు పంపుతున్నారన్నారు.

సామాన్యుని దగ్గర నుంచి చివరకు చంద్రబాబు లాంటి పెద్ద వ్యక్తుల వరకు కూడా ఎవరూ మినహాయింపు లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రజలంతా స్పందించకపోతే రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కలసి రావాలని.. చంద్రబాబును మరోసారి అధికారంలోకి తెస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని పరిటాల శ్రీరామ్ అన్నారు.

రాజమహేంద్రవరంలో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి దీపాలు వెలిగించగా.. హైదరాబాద్‌లో నారా భువనేశ్వరి కొవ్వొత్తులు వెలిగించి నిరసనలో పాల్గొన్నారు. ఇక ఎన్టీఆర్ భవన్ వద్ద ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయడు, టీడీపీ నేతలు దీపాలు వెలిగించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా హైదరాబాద్, బెంగళూరులో కూడా టీడీపీ అభిమానులు దీపాలు వెలిగించి బాబుకు మద్దతుగా నిలిచారు. శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ అక్కడినుంచే కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నేతలతో కలిసి కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైసీపీ స‌ర్కార్ తీరుపై నిర‌స‌న తెలిపారు. సేవ్ ఏపీ... సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్య‌క్ర‌మానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.  సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నేతలందరూ నినదించారు. అటు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
Embed widget