అన్వేషించండి

Nara Lokesh: చంద్రబాబును ముట్టుకుంటే మీకు షాక్! రిషాంత్ రెడ్డికి ఆపరేషన్ చేయిస్తా- లోకేష్ వార్నింగ్

Nara Lokesh: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో ఆయన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.

Nara Lokesh: చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి కండువా వేసుకోని వైసీపీ కార్యకర్త అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో ఆయన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. సోమవారం కారంపూడిలో బహిరంగా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ వైఫల్యాలపై లోకేష్ నిప్పులు చెరిగారు.  

చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతల దాడులు ఎస్పీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిషాంత్ రెడ్డికి ఆపరేషన్ చేయించి అన్నీ కనిపించేలా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని విమర్శించారు. మహిళల కోసం దిశ చట్టం పేరుతో డమ్మీ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. గన్ కంటే ముందు జగన్ వస్తారని వైసీపీ మహిళా నేతలు అన్నారని, కానీ సీఎం పనితీరు చూస్తే ఊరు గొప్ప పేరు దిబ్బలా తయారైందన్నారు. మహిళల సంరక్షణకు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పనికిరాని చట్టాలతో ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. 

వెల్దుర్తి మండలం బోదలవీడు గ్రామంలో వైసీపీ సానుభూతిపరుడు, ఉప సర్పంచ్ ముగ్గురు మహిళలపై దాడి చేస్తే చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నడి రోడ్డుపై మహిళలను కొట్టి మళ్లీ వారిపైనే ఎదురు కేసు పెట్టారని ఆరోపించారు. పూటకో అత్యాచారం, రోజుకో హత్య రాష్ట్రంలో జరుగుతోందని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని మండిపడ్డారు. 

లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని, వెయ్యి రూపాయల విలువైన వాటర్ బాటిల్‌ నీరు తాగుతూ.. తాను పేదవాడినని జగన్‌ చెబుతున్నారని, నాలుగో చోట్ల రాజ భవనాలు ఉన్న జగన్.. పేదవారా? అంటూ లోకేస్ ప్రశ్నించారు. కరెంట్ ఛార్జీలు నాలుగు సార్లు, ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచి ప్రజలను బాదుతున్నారని అన్నారు. చెత్తపై పన్ను వేసే చెత్త ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. ప్రతి చోటా ఫొటో వేసుకునే జగన్ కరెంటు బిల్లు, గ్యాస్ బిల్లుపై ఎందుకు వేసుకోరని ప్రశ్నించారు. 

దేశ రాజకీయాలను శాసించిన చంద్రబాబు హై వోల్టేజ్ అని ఆయన్ను ముట్టుకుంటే షాక్ తప్పదని లోకేశ్‌ హెచ్చరించారు. అధికార పక్షం నేతలే బంద్‌కు పిలుపునిచ్చే వింత పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. ఒక్క ప్రాజెక్టు కట్టడం చేతగాని జగన్.. చంద్రబాబుపై రాళ్ల దాడి చేయిస్తున్నారనని మండిపడ్డారు. 

అంతకు ముందు ఆయనకు కారంపూడిలో ఘన స్వాగతం పలికారు. పలువురు విద్యార్థులు లోకేష్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కారంపూడి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటర్‌, డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారని లోకేష్‌ మండిపడ్డారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు గతంలో అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దుచేశారని ఆరోపించారు.

టీడీపీ అధికారంలోకి రాగానే కారంపూడిలో జూనియర్ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సంఖ్యను బట్టి డిగ్రీ కాలేజి అంశాన్ని పరిశీలిస్తామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు దూరప్రాంతాల్లో చదవాల్సి వచ్చినా... వారిపై ఎటువంటి భారంపడకుండా రీఎంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తామని చెప్పారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు

వీడియోలు

Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Virat Kohli No 1 ODI Rank | కష్టం అనుకున్న లక్ష్యాన్ని మళ్లీ సాధించిన కోహ్లీ | ABP Desam
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
ఇంద్రాదేవికి పూజలు చేసి గంగాజలంతో కేస్లాపూర్ చేరుకున్న మెస్రం వంశీయులు!
Iran vs America: అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
అమెరికా హెచ్చరికలు పట్టించుకోని ఇరాన్! పొరుగు దేశాల్లోని US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని వార్నింగ్!
I-PAC Raid Case: బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
బెంగాల్ డీజీపీని తొలగించండి! సుప్రీంకోర్టులో ఈడీ కొత్త పిటిషన్ దాఖలు!
Zubeen Garg Death: మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
మరణం వెనుక మద్యం మత్తు... ప్రముఖ సింగర్ డెత్ మిస్టరీ రివీల్ చేసిన సింగపూర్ పోలీసులు
TMMTMTTM Box Office: రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
రిలీజ్‌కు ముందు హడావిడి చేశారు... తిప్పి కొడితే 50 కోట్లు కూడా రాలేదుగా
Hyderabad Crime News: సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో ఉద్రిక్తత! లాఠీచార్జ్ చేసి అదుపు చేసిన పోలీసులు !
సంక్రాంతి వేళ హైదరాబాద్‌లో ఉద్రిక్తత! లాఠీచార్జ్ చేసి అదుపు చేసిన పోలీసులు !
Karimnagar Crime News: ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
MSVG Box Office Day 3: 'రాజా సాబ్', 'ధురంధర్' కంటే ఎక్కువ... మూడో రోజు మెగాస్టార్ చిరంజీవి 'వరప్రసాద్ గారు' కలెక్షన్ ఎంతంటే?
'రాజా సాబ్', 'ధురంధర్' కంటే ఎక్కువ... మూడో రోజు మెగాస్టార్ చిరంజీవి 'వరప్రసాద్ గారు' కలెక్షన్ ఎంతంటే?
Embed widget