అన్వేషించండి

Chandrababu: 'ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం' - మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని చంద్రబాబు భరోసా

Ap Politics: టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడతామని చంద్రబాబు తెలిపారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Chandrababu Comments in Kuppam: టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళల ఆదాయం రెట్టింపు చేసి చూపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. సోమవారం కుప్పం (Kuppam) పర్యటనలో భాగంగా ఆయన మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. దేశం గర్వించేలా కుప్పం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. వైసీపీ హయాంలో చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. 'డబ్బుకు కక్కుర్తి పడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. టీడీపీ హయాంలో అక్రమార్కులు రాష్ట్రంలోకి రావడానికే భయపడ్డారు. అలాంటిది ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందా.?' అంటూ నిలదీశారు.

అవసరమైతే ప్రత్యేక చట్టం

అవసరమైతే ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు. దేశంలో ఆడబిడ్డల గురించి మాట్లాడిన తొలి పార్టీ టీడీపీ అని.. వారికి ఆస్తిలో సమాన హక్కులు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. 'తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వకపోతే పోరాడి మరీ కోర్టుకు వెళ్లి తెచ్చుకునే హక్కు కల్పించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల్లో చైతన్యం తీసుకొచ్చాం. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆలోచన చేసిందే టీడీపీ. 2 కోట్ల మంది మహిళలకు హామీ ఇస్తున్నా. మహిళల ఆదాయం రెట్టింపు చేస్తాం. జగన్ లా రూ.10 ఇచ్చి రూ.100 లాగడం కాదు. సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచుతాం. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 అకౌంట్ లో వేస్తాం' అని హామీ ఇచ్చారు. 

'అప్పుడు అవహేళన చేశారు'

మహిళలు ఆర్థికంగా పైకి రావాలంటే ఇంటికి 2 ఆవులు ఇవ్వాలనుకున్నామని.. అప్పుడు దీనిపై అవహేళన చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో వెయ్యి లీటర్లతో ప్రారంభమైన పాల సేకరణ.. ఇప్పుడు 4 లక్షల లీటర్లకు చేరుకుంది. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఇంటింటికీ మరుగుదొడ్లు కట్టించామని అన్నారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలను వైసీపీ ప్రభుత్వం తెంచేస్తోందని విమర్శించారు. జగన్ పాలనలో రూ.60 మద్యం ధర రూ.200 అయ్యిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని అన్నారు. కుప్పంలో రాళ్లు, మట్టిని కూడా అమ్ముకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది కౌరవ సభ అని.. దానిని గౌరవ సభ చేశాకే మళ్లీ అక్కడ అడుగు పెడతామని అన్నారు. కుప్పంలో లక్ష మెజార్టీ సాధించేందుకు టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని.. అందరిదీ అదే లక్ష్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీకీ ఓటు వేయాలని అడిగిన వారికి కర్రు కాల్చి వాత పెట్టాలని ధ్వజమెత్తారు. 75 శాతం ఓట్ల పడేలా కృషి చేయాలని సూచించారు. 

కుప్పంలో పర్యటన
Chandrababu: 'ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం' - మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని చంద్రబాబు భరోసా
Chandrababu: 'ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం' - మహిళల ఆదాయం రెట్టింపు చేస్తామని చంద్రబాబు భరోసా

చంద్రబాబు రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం కుప్పం చేరుకున్న ఆయనకు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొత్తపేటలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం, పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం అందించారు. మరోవైపు, పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద ఆయన వాహనాన్ని పార్టీ శ్రేణులు చుట్టుముట్టాయి. పరిసరాల్లో అంతగా పోలీసులు లేకపోవడంతో మహిళలతో ముఖాముఖిలో పాల్గొనేందుకు చంద్రబాబు వాహనం దిగి వెళ్లగా ఇబ్బంది పడ్డారు. పరిసరాల్లో అంతగా పోలీసులు లేరని.. అతి సాధారణ భద్రత కల్పించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: YS Sharmila: వైసీపీకి మరో షాక్, షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గోకుల్ కృష్ణారెడ్డి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Srikakulam Crime News : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిలాడీ లేడీ - 8 పెళ్లిళ్లు చేసుకొని డబ్బులతో జంప్‌
Champion Box Office Collection Day 2: 'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'ఛాంపియన్' కలెక్షన్స్... రెండు రోజుల్లో రోషన్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
Embed widget