అన్వేషించండి

Tadepalligudem Public Meeting : తాడేపల్లిగూడెం సభకు భారీ ఏర్పాట్లు - టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ ఏర్పాటు !

TDP Janasena : తాడేపల్లిగూడెం బహిరంగసభ కోసం టీడీపీ, జనసేన సమన్వయ కమిటీని ప్రకటించారు. 28వ తేదీన సభను విజయవంతం చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Tadepalligudem Public Meeting :  తాడేపల్లిగూడెం సభ నిర్వహణకు జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు.  ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ని జనసేన – తెలుగుదేశం తొలి ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించాయి.  10మంది సభ్యులతో ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో తెలుగుదేశం నుంచి  ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర,   నిమ్మల రామానాయుడు,  ఎం.వి.సత్యనారాయణ రాజు, జనసేన నుంచి  కొటికలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్,  బొలిశెట్టి శ్రీనివాస్, పత్సమట్ల ధర్మరాజు,   చాగంటి మురళీకృష్ణ,  రత్నం అయ్యప్ప ఉన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభను ఈనెల 28న నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.   ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ – జనసేన నేతలు పాల్గొంటారు.  ఆరు లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  రాజకీయ ప్రస్థానంలో ఈ సభ అద్భుతంగా ఉంటుందని  టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల సంగ్రామం మొదలవు తోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అధినేతలు రాష్ట్ర ప్రజలకు ఒక ఉమ్మడి సందేశం ఇవ్వాలని నిర్ణయించు కున్నారు. దానిలో భాగంగా రాష్ట్రచరిత్రలో గతంలో ఎన్నడూ జరగని విధంగా నభూతో అన్న రీతిలో ఈనెల 28వ తేదీన తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో టీడీపీ`జనసేన పార్టీల ఉమ్మడి సభను నిర్వహిం చాలని నిర్ణయించామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇరుపార్టీల వైపు నుంచి మొత్తం 12 మంది సభ్యులు సభా నిర్వహణ ఏర్పాట్లు చేస్తారు. ఈ సమావేశానికి తరలి రావాలని టీడీపీ-జనసేన కుటుంబ సభ్యులకు, జగన్‌రెడ్డి బాధితులైన రాష్ట్ర ప్రజ లకు ఆహ్వానం పలుకుతున్నాం. భారీసంఖ్యలో తరలి వచ్చి, సభను విజయవంతం చేయాలని, మన రెండు పార్టీల సభతో జగన్‌రెడ్డి వెన్నులో వణుకు పుట్టేలా చేయాలని అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు.

టీడీపీ – జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ఇరుపార్టీల అధ్యక్షులు సభా వేదికైప ప్రకటించే అవకాశం ఉంది.  మా కూటమి ఏర్పాటును జీర్ణించుకోలే కనే సీట్ల కేటాయింపులో అభిప్రాయభేదాలు ఉన్నట్టు చూసిస్తూ, టీడీపీ-జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్ట డానికి జగన్‌రెడ్డి  ప్రయత్నిస్తున్నారని రెండు పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.  చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు 5 కోట్లమంది ప్రజల భవిష్యత్‌ ను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలని అంటున్నారు.  మరలా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు, రామరాజ్యం వచ్చేవరకు ప్రజలందరూ టీడీపీ-జనసేన పక్షానే నిలవాలని  పిలుపునిచ్చేందుకు తాడేపల్లి గూడెం సభ నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు.                                                          

 

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Embed widget