అన్వేషించండి

Minister Jogi Ramesh : కుప్పం చంద్రబాబు గడ్డ కాదు వైసీపీ అడ్డా, తిరుగుబాటు మొదలైంది - మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh : టీడీపీపై కుప్పంలో మొదలైన తిరుగుబాటు 175 నియోజకవర్గాల్లో విస్తరిస్తుందని మంత్రి జోగి రమేష్ అన్నారు. చంద్రబాబు ఏపీలో తిరగడానికి వీళ్లేదని ప్రజలే ముక్త కంఠంతో చెప్తున్నారన్నారు.

Minister Jogi Ramesh : టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి కుప్పం సంఘటనలే నిదర్శనమని ఏపీ గృహ‌నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం పోయిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో గృహ‌నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ జెండాను, పార్టీని కూకటి వేళ్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసినా చంద్రబాబు ఒక వర్గానికి అయినా మేలు చేశారా? అని ప్రశ్నించారు. 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏంచేశారని అని కుప్పం ప్రజలు తిరుగుబాటు చేశారన్నారు. ఆ తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభం అయిందని మంత్రి తెలిపారు. చంద్రబాబు వాడుకుని వదిలేశారని బీసీలు, మైనారిటీ, ఎస్సీ ఎస్టీలు, మహిళలు అందరూ తిరుగుబాటు చేశారన్నారు. 

చంద్రబాబు రాష్ట్రంలో తిరగడానికి వీళ్లేదు! 

మూడేళ్లలో సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ప్రజలే చెప్తున్నారని మంత్రి జోగి అన్నారు. కుప్పం ప్రజల్ని బానిసలుగా చేసుకున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని కుప్పం వస్తారని వాళ్లు ప్రశ్నిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మూడుసార్లు కూడా కుప్పం వెళ్లని చంద్రబాబు ఇప్పుడు వరుస పర్యటనలతో హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కుప్పంలో మొదలైన ఈ తిరుగుబాటు 175 నియోజకవర్గాలకు విస్తరిస్తుందన్నారు. చంద్రబాబు ఈ రాష్ట్రంలో తిరగడానికి వీళ్లేదని ప్రజలే ముక్త కంఠంతో చెప్తున్నారన్నారు. ఓట్లు దండుకుని సున్నం పెట్టాడని అన్ని వర్గాలు తిరుగుబాటు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ప్రజల్ని ఓటు అడిగే హక్కు చంద్రబాబుకి, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. ప్రజలంతా మనసున్న ముఖ్యమంత్రి జగన్ అని జేజేలు కొడుతున్నారన్నారు. ప్రజలు కూడా పార్టీలు, కులాలు, మతాలు చూడం, జగన్ ని మాత్రమే చూస్తామని చెప్తున్నారన్నారు. కుప్పం నియోజకవర్గంలోనే అభివృద్ధికి దిక్కు లేదని, ఇక రాష్ట్రానికి ఏం  చేస్తావ్ చంద్రబాబు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.

కేఏ పాల్ , పవన్ కు తేడాలేదు  

జనసేనకు కథ స్క్రీన్ ప్లే చంద్రబాబు, డైరెక్టర్ నాదెండ్ల మనోహర్ అని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. కేఏ పాల్ కి, పవన్ కల్యాణ్ కి తేడా లేదన్నారు. ఇద్దరికీ ఏపీలో సీట్లు లేవన్నారు. పవన్ ను నమ్మిన వాళ్లని చంద్రబాబుకు అమ్మడానికి చూస్తున్నారన్నారు. జాకీలు పెట్టీ లేపిన లేవలేని చంద్రబాబుని మోయగలవా పవన్ అని మంత్రి ఎద్దేవా చేశారు.  వైసీపీ వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ 175 స్థానాల్లో పోటీ చేస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వెళ్తుంటే ఏమని  విమర్శించగలరని నిలదీశారు. పొత్తులతో పోర్లాడటమే తప్ప టీడీపీ, జనసేన ప్రజలకెం చేశారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా కుప్పంతో సహా 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందన్నారు. కుప్పం చంద్రబాబు గడ్డ కాదు వైఎస్సార్ అడ్డాగా మారిపోయిందన్నారు. చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా ఓడిపోవడం ఖాయమన్నారు.  చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలనను, జగన్ మూడేళ్ల పరిపాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు ఏం చేయలేకపోయారన్నారు.  

Also Read : Thopudurthi Prakash Reddy : వైసీపీ కార్యకర్తను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్లాన్, పరిటాల శ్రీరామ్ పై ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు

Also Read : Kurnool YSRCP: కర్నూలు వైసీపీలో మొదలైన టికెట్ల లొల్లి, హై కమాండ్ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget