అన్వేషించండి

Ram Mandir Inauguration: ఎస్వీబీసీలో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం

SVBC airs Ayodhya Ram Mandir Event: అయోధ్య శ్రీరామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎస్వీబీసీ భక్తి ఛానళ్లలో ప్రత్యక్షప్రసారం చేయనుంది.

Ayodhya Ram Mandir Pran Pratishtha: తిరుపతి: ఎన్నో శతాబ్ధాల కల మరో రెండు రోజుల్లో నెరవేరనుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య శ్రీరామమందిరం (Ram Mandir)లో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమం జ‌న‌వ‌రి 22వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుంది. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛాన‌ల్ (SVBC) తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో ప్రత్యక్షప్రసారం చేయనుంది. అదే విధంగా ఎస్వీబీసీ తెలుగు యూట్యూబ్ ఛాన‌ల్‌ ద్వారా అయోధ్యలో జరిగే వైదిక, ఆధ్యాత్మిక క్రతువులను నిరంతరాయంగా ప్రత్యక్షప్రసారం చేయనుంది.

భక్తులు ఈ విషయాలను గమనించి ఎంతో వైభవంగా, ఆగమోక్తంగా జరిగే అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ఎస్వీబీసీ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఛాన‌ళ్లలో వీక్షించి తరించాలని భక్తలోకానికి టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఎస్వీబీసీ తెలుగు ఛాన‌ల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు అయోధ్య కార్యక్రమాలు ప్రత్యక్షప్రసారం కానున్నాయి. అనంతరం 12 గంటల నుండి తిరుమల శ్రీవారి కల్యాణం యధావిధిగా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఆ తరువాత అయోధ్యలో మధాహ్నం 12 గంటల నుండి జ‌రిగే కార్యక్రమాలను శ్రీ‌వారి క‌ల్యాణం అనంత‌రం తిరిగి ప్ర‌సారం చేస్తారు. టీటీడీ అధికారి ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

పెద్ద స్క్రీన్లపై లైవ్‌లో చూసే అవకాశం
అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్టను ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకుంటున్నారు. కోట్లాది ప్రజలు టీవీల్లో చూసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న టీవీ ఛానెళ్లు లైవ్ ఈ మహత్తర కార్యక్రమాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌(PVR), ఐనాక్స్‌(INOX)లు అయోధ్య రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకలను పెద్ద స్క్రీన్లపై చూసే అవకాశం కల్పిస్తున్నాయి. రూ.100 టికెట్‌తోనే థియేటర్లలో కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. 

121 మందితో ప్రాణ ప్రతిష్ట
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 8 వేల మంది అతిథులు హాజరవుతారని అంచనా. వీరిలో కొద్ది మందిని మాత్రమే గర్భాలయంలోకి అనుమతిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది. గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ ఆధ్వర్యంలో 121 మంది ఆచార్యులు ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారని కమిటీ వెళ్లడించింది. ఈ కార్యక్రమాలకు కాశీకి చెందిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరించబోతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
AP Employees retirement age increase | ఏపీలో ఉద్యోగులకు పదవీ విరమణ వయసు మరో రెండేళ్లు..  చంద్రబాబు వ్యూహం ఏమిటి?
Ram Charan : మంగళగిరికి మన పెద్ది - APL సీజన్ 5కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్... ఫుల్ షెడ్యూల్ ఇదే
మంగళగిరికి మన పెద్ది - APL సీజన్ 5కు చీఫ్ గెస్ట్‌గా రామ్ చరణ్... ఫుల్ షెడ్యూల్ ఇదే
Sai Krishna Missing Case: సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. సీబీఐకి అప్పగింతపై విచారణ వాయిదా
Sai Krishna Missing Case: సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. సీబీఐకి అప్పగింతపై విచారణ వాయిదా
Breaking News: సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు సిట్ విచారణ పూర్తి
సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు సిట్ విచారణ పూర్తి

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana New CS: తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
తెలంగాణ నూతన సీఎస్‌గా సంజయ్ జాజు! గతంలో ఇక్కడ పనిచేసిన ఐఏఎస్
Telangana ACB: అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
Union Cabinet Expansion: మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
మోదీ కేబినెట్‌లోకి కొత్త ముఖాలు ! రేసులో రాఘవ్ చద్దా.. 5 రాష్ట్రాల ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ మెగా ప్లాన్!
Monsoon Diet Tips : వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
వర్షాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. లేదంటే అనారోగ్య సమస్యలు తప్పవట
OPS For AP Employees: ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పాత పెన్షన్ పునరుద్ధరణ, ఒక్క ఉద్యోగికి రూ. 3.39 కోట్ల మేర ప్రయోజనం
SIR Process Telangana: తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
తెలంగాణలో 89 లక్షల ఓట్ల తొలగింపు ఖాయమేనా? హైదరాబాద్‌లో సగం ఓట్లు తగ్గిపోతాయా? ఏంటి SIR ఇది?
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Telangana ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.60 లక్షల నుంచి 2 కోట్ల వరకు ప్రమాద బీమా ప్రయోజనం
Ram Charan : మా బుడ్డది పెద్ది అంటోది - అసలు పేరు మర్చిపోతారేమో... రామ్ చరణ్ ఎమోషనల్
మా బుడ్డది పెద్ది అంటోది - అసలు పేరు మర్చిపోతారేమో... రామ్ చరణ్ ఎమోషనల్
Embed widget