అన్వేషించండి

Somireddy: ఏపీలో ఆ శాఖ మూసుకుపోయింది, తెలంగాణ ఎంతో మేలు.. సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వ్యవసాయ శాఖ అధికారుల జీతాలు, రైతు భరోసాకి ఇచ్చే నిధులు తప్ప ఏపీలో వ్యవసాయ శాఖ ఇంకేమీ చేయడంలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ అధికారుల జీతాలు, రైతు భరోసాకి ఇచ్చే నిధులు తప్ప ఏపీలో వ్యవసాయ శాఖ ఇంకేమీ చేయడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని ఎద్దేవా చేశారు. కానీ, ప్రస్తుతం నేరుగా రైతులకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆక్వా రైతులకు టీడీపీ హయాంలో యూనిట్ రూ.2 కరెంటు అందిస్తే, వైసీపీ హయాంలో రూ.3 చేశారని చెప్పారు. రైతులకు మేలు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగుందని సోమిరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి రూ.10 వేల రైతు బంధు ఇస్తోందని, అక్కడ ధాన్యం సేకరణ బాగుందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పథకాలన్నీ మూలనపడేసిందని ఆరోపించారు. వాటన్నిటినీ తిరిగి అమలు చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

వ్యవసాయ రంగం, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్ ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా? అని నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో వ్యవసాయ అనుబంధరంగాల్లో 11 శాతం వృద్ధిరేటు నమోదైతే.. ఈ ప్రభుత్వ హయాంలో ఎంత నమోదైందో చెప్పగలదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈ రెండున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనే ప్రశ్నకు సమాధానం లేదు. ధాన్యం కొనుగోళ్లలో అంతా దళారుల రాజ్యమైపోయి చివరకు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు. వ్యవసాయమంటే  తెలియని కన్నబాబుకి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ పదానికి అర్థం తెలియని అనిల్ కుమార్‌కు నీటిపారుదలశాఖ అప్పగించారు’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

‘‘టీడీపీ ప్రభుత్వం ప్రతి రైతుకి రూ.9 వేలు ఇస్తే, జగన్ రైతు భరోసా కింద దాన్ని రూ.7,500 లకే పరిమితం చేశాడు. భూసార పరీక్షలు, బిందు, తుంపర సేద్యం పరికరాల పంపిణీ, రైతులకు అందించే సూక్ష్మ పోషకాల పంపిణీని జగన్ ప్రభుత్వం మర్చిపోయింది. కేంద్ర ప్రభుత్వమే బిందు తుంపర సేద్యానికి 60 శాతం సబ్సిడీ ఇస్తుంటే కేవలం మిగతా 40 శాతం సబ్సిడీని భరించలేక సీఎం జగన్ ఆ పథకాన్ని నిలిపేశాడు’’ అని సోమిరెడ్డి ఆరోపించారు.

ఆ ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
2014-15లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6,200లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను 2018-19లో రూ.18,500 కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. 2019-20లో బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.7 వేల కోట్లే ఖర్చు చేసింది. అందులోనూ సగం వ్యవసాయశాఖ ఉద్యోగుల జీతాలకే కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు టీడీపీ ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చుచేయలేదు. ఈ రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో సమాధానం చెప్పాలి. ఆ ధైర్యం ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి ఉందా?’’ అని సోమిరెడ్డి సవాలు విసిరారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Embed widget