అన్వేషించండి

Somireddy: ఏపీలో ఆ శాఖ మూసుకుపోయింది, తెలంగాణ ఎంతో మేలు.. సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వ్యవసాయ శాఖ అధికారుల జీతాలు, రైతు భరోసాకి ఇచ్చే నిధులు తప్ప ఏపీలో వ్యవసాయ శాఖ ఇంకేమీ చేయడంలేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు.

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ అధికారుల జీతాలు, రైతు భరోసాకి ఇచ్చే నిధులు తప్ప ఏపీలో వ్యవసాయ శాఖ ఇంకేమీ చేయడంలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని ఎద్దేవా చేశారు. కానీ, ప్రస్తుతం నేరుగా రైతులకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఆక్వా రైతులకు టీడీపీ హయాంలో యూనిట్ రూ.2 కరెంటు అందిస్తే, వైసీపీ హయాంలో రూ.3 చేశారని చెప్పారు. రైతులకు మేలు చేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరు బాగుందని సోమిరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి రూ.10 వేల రైతు బంధు ఇస్తోందని, అక్కడ ధాన్యం సేకరణ బాగుందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పథకాలన్నీ మూలనపడేసిందని ఆరోపించారు. వాటన్నిటినీ తిరిగి అమలు చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

వ్యవసాయ రంగం, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్ ప్రభుత్వం దేశంలో ముందంజలో ఉందా? అని నిలదీశారు. గత టీడీపీ ప్రభుత్వ హాయాంలో వ్యవసాయ అనుబంధరంగాల్లో 11 శాతం వృద్ధిరేటు నమోదైతే.. ఈ ప్రభుత్వ హయాంలో ఎంత నమోదైందో చెప్పగలదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. ‘‘ఈ రెండున్నర ఏళ్లలో జగన్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనే ప్రశ్నకు సమాధానం లేదు. ధాన్యం కొనుగోళ్లలో అంతా దళారుల రాజ్యమైపోయి చివరకు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు. వ్యవసాయమంటే  తెలియని కన్నబాబుకి వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ పదానికి అర్థం తెలియని అనిల్ కుమార్‌కు నీటిపారుదలశాఖ అప్పగించారు’’ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

‘‘టీడీపీ ప్రభుత్వం ప్రతి రైతుకి రూ.9 వేలు ఇస్తే, జగన్ రైతు భరోసా కింద దాన్ని రూ.7,500 లకే పరిమితం చేశాడు. భూసార పరీక్షలు, బిందు, తుంపర సేద్యం పరికరాల పంపిణీ, రైతులకు అందించే సూక్ష్మ పోషకాల పంపిణీని జగన్ ప్రభుత్వం మర్చిపోయింది. కేంద్ర ప్రభుత్వమే బిందు తుంపర సేద్యానికి 60 శాతం సబ్సిడీ ఇస్తుంటే కేవలం మిగతా 40 శాతం సబ్సిడీని భరించలేక సీఎం జగన్ ఆ పథకాన్ని నిలిపేశాడు’’ అని సోమిరెడ్డి ఆరోపించారు.

ఆ ధైర్యం ప్రభుత్వానికి ఉందా?
2014-15లో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.6,200లుగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను 2018-19లో రూ.18,500 కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచింది. 2019-20లో బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించిన వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.7 వేల కోట్లే ఖర్చు చేసింది. అందులోనూ సగం వ్యవసాయశాఖ ఉద్యోగుల జీతాలకే కేటాయించింది. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు టీడీపీ ప్రభుత్వం రూ.1700 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చుచేయలేదు. ఈ రెండున్నరేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో సమాధానం చెప్పాలి. ఆ ధైర్యం ప్రభుత్వానికి, వ్యవసాయ మంత్రికి ఉందా?’’ అని సోమిరెడ్డి సవాలు విసిరారు.

టాప్ హెడ్ లైన్స్

Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget