అన్వేషించండి

Guntur: ఎస్సై ఈవెంట్స్‌లో విషాదం- రన్నింగ్ చేస్తూ కుప్పకూలి యువకుడు మృతి

Guntur: గుంటూరులో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై దేహదారుఢ్య పరీక్షలో భాగంగా రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి చెందాడు.

Guntur: గుంటూరులో జరిగిన ఎస్సై దేహదారుఢ్య పరీక్షల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా 1600 మీటర్ల పరుగుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఒక ఎస్సై అభ్యర్థి పరిగెడుతూ మరణించాడు.  మోహన్ అనే యువకుడు పరిగెడుతుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే అంబులెన్స్‌లో పోలీస్ సిబ్బంది అతడిని గుంటూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే యువకుడిని పరీక్షించిన వైద్యులు.. ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికి మరణించినట్లు  ధృవీకరించారు.

మోహన్ మృతిపై కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకోగా.. మోహన్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడు ఎస్సై అవుతాడని ఆశిస్తే.. చివరికి ఇలా శవంగా మారడం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మోహన్ మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అందించారు.  మోహన్ మృతితో అతడి స్వగ్రామమైన అంకిరెడ్డి పాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అయితే ఎస్సై ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు గత కొద్దిరోజులుగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 10 నుంచి కొనసాగుతుండగా.. మధ్యలో వర్షం కారణంగా రెండు రోజులు రద్దు చేశారు. ఆ తర్వాత నిన్నటి నుంచి తిరిగి ప్రారంభించారు. 1600 మీటర్లు, 100 మీటర్ల రన్నింగ్ పోటీలు, లాంగ్ జంప్ నిర్వహిస్తున్నారు. అలాగే అభ్యర్థుల ఎత్తు, ఛాతి కొలతలు పరీక్షిస్తున్నారు. గుంటూరులో జరుగుతున్న ఫిజికల్ టెస్టుల్లో 800 మంది అభ్యర్థుల్లో 705 మంది ధ్రువపత్రాలు అందజేయగా.. దేహదారుఢ్య పరీక్షల తర్వాత వీరిలో 342 మంది అర్హత సాధించారు.  ఈ పరీక్షలను గుంటూరు ఏఎస్పీ సుప్రజల, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ సుబ్బారెడ్డి.,  రేంజ్ ఐటీ పాలరాజు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక డీఎస్పీ శ్రీనివాసరావు, చంద్రశేఖర్ రావు, రవిచంద్ర, రేంజ్ పరిధిలోని డీఎస్పీ, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

మొత్తం 411 ఎస్సై ఉద్యోగాలకు  గత ఏడాది నవంబర్‌ 28న నోటిఫికేషన్ జారీ చేయగా.. డిసెంబర్ 14 వరకు దరఖాస్తులు ఆహ్వానించారు.  ఇందులో 315 ఉద్యోగాలను మహిళలు, పురుషులకు కేటాయించగా.. 96 ఉద్యోగాలను రిజర్వ్ సబ్ ఇన్సెపెక్టర్ ఆఫ్ పోలీస్ పురుషులకు కేటాయించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రాతపరీక్ష నిర్వహించారు. 1,51,288 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా.. వారిలో 56,116 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షల కోసం ఎంపికయ్యారు. గుంటూరుతో పాటు ఏలూరు, విశాఖపట్నం, కర్నూలు జిల్లా కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు జరుపుతున్నారు. ఇక దేహదారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయినవారికి అక్టోబర్ 14,15వ తేదీలలో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొయిన్స్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు అబ్జెక్టివ్ క్వశ్లన్లు, మరో రెండు పేపర్లు డిస్క్రిప్టివ్ తరహాలో ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మూడు గంటల పాటు పరీక్ష టైమ్ ఉంటుంది. 4 పేపర్లలో 2 పేపర్లలో అర్హత సాధిస్తే సరిపోతుంది.

గుంటూరు, ఏలూరు, కర్నూలు, విశాఖపట్నంలో పరీక్షలు నిర్వహిస్తారు. త్వరలోనే హాల్ టికెట్లను అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.  అక్టోబర్ 14న  ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పేపర్ 1, 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉంటుంది. ఇక 15న పేపర్ 3, పేపర్ 4 పరీక్షలు ఉంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్‌కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Mudragada Padmanabham Funeral Chaos: ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
ముద్రగడ అంత్యక్రియల్లో గందరగోళం - గన్ సెల్యూట్ ను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు
Chandra Babu Comments:
"సముద్రంలోకి వెళ్లే జలాలు వాడుకుంటే సంపద సృష్టి జరిగినట్టే! నదుల అనుసంధానంతో కరవు పరార్‌" ముఖ్యమంత్రి చంద్రబాబు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Embed widget