అన్వేషించండి

Pawan Kalyan : టీడీపీ, బీజేపీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan : వారంలో ఒక్కరోజు వస్తేనే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో వైసీపీని అధికారంలోకి రానివ్వమని స్పష్టం చేశారు.

Pawan Kalyan : వైసీపీపై మరోసారి విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కల్యాణ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో జనసేన కౌతు రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. అనంతరం మాట్లాడిన పవన్... వారాహితో ఏపీలో తిరుగుతా, దమ్ముంటే అడ్డుకునే ప్రయత్నం చేయాలని వైసీపీ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవట్లేదని, గెలవనివ్వమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు కట్టుబడి ఉన్నానని పవన్ స్పష్టం చేశారు. ఏపీలో ఏ జిల్లాలోనూ రైతులు సంతోషంగా లేరని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన చెందారు. రైతు కంటతడి పెట్టిన నేల సుభిక్షంగా ఉండదన్నారు.  అన్నదాతల కష్టాలను పట్టించుకునే నేతలు, అధికారులు లేరన్నారు. ప్రజలను బెదిరించటానికి, ప్రతిపక్షాల సభలను అడ్డుకోవటానికి మాత్రమే వైసీపీ నేతలు, అధికారులు వస్తారని మండిపడ్డారు. 

ఒక్కరోజు వస్తేనే తట్టుకోలేకపోతున్నారు 

ఎన్నికలు దగ్గరికి వస్తుండడంతో వైసీపీ నేతలు అవినీతి హాలీడే ప్రకటించారని పవన్ కల్యాణ్ విమర్శించారు. తనను వీకెండ్ పొలిటీషయన్‌ అంటున్నారని, కాపు నాయకులతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారన్నారు. ఏపీలో తానేలా పర్యటిస్తానో అంటూ వైసీపీ గాడిదలు ఓండ్ర పెడుతున్నాయని ఎద్దేవా చేశారు. వారానికి ఒక్కరోజు వస్తేనే వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. తనకు తాతలు సంపాదించిన రూ.వేల కోట్లు లేవన్నారు. అక్రమాలు, దోపిడీలు చేసిన డబ్బు తన దగ్గర లేదన్నారు. తన కష్టార్జితంతో రైతులకు సాయం చేస్తున్నానని పవన్‌ తెలిపారు. 

అంబటి కాపుల గుండెల్లో కుంపటి 
 
సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుపై పవన్‌ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అంటూ విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలవనివ్వమన్నారు. వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత ప్రజలదన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు నేటికీ కట్టుబడి ఉన్నానన్నాకుయ. బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ తనకులేదన్నారు. వైసీపీ నేతల్లా పింఛన్లు, బీమా సొమ్ములో కమీషన్లు కొట్టే రకం కాదన్నారు. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యతిరేక శక్తులను ఏకం చేస్తానని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు. 

Pawan Kalyan : టీడీపీ, బీజేపీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

జనసేనలో చేరికలు 

అంతకు ముందుకు మంగళగిరి జనసేన కార్యాలయంలో పలువురు వైసీపీ నేతలు జనసేనలో చేరారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేతలు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. రాజోలు నియోజకవర్గానికి చెందిన బొంతు రాజేశ్వరరావు తన అనుచరులతో కలసి జనసేన కండువా కప్పుకున్నారు.  గత ఎన్నికల్లో వైసీపీ తరఫున రాజోలు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. పి. గన్నవరం నియోజకవర్గం నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్మూరు కొండలరావు, విజయనగరం జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త గురాన అయ్యల పవన్ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో జనసేన బలోపేతానికి నూతనంగా చేరిన నాయకులు కృషి చేయాలని పవన్ కోరారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Womens World Cup 2025 Final: ఆగిన వర్షం.. టాస్ ఓడిన హర్మన్ ప్రీత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
ఆగిన వర్షం.. టాస్ ఓడిన హర్మన్ ప్రీత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
Advertisement

వీడియోలు

India vs South Africa | Women World Cup Final | నేడే వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్
Womens World Cup Final | ఫైనల్‌కు వర్షం ముప్పు
SSMB29 Twitter | Mahesh Babu - Rajamouli | SSMB 29పై మహేష్, జక్కన్న ట్వీట్ వార్
Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu In London: సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
సతీమణి భువనేశ్వరి కోసం లండన్ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు
Attack on BRS Office: మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత
Jogi Ramesh Arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్‌, నెక్ట్స్ ఏంటి?
Womens World Cup 2025 Final: ఆగిన వర్షం.. టాస్ ఓడిన హర్మన్ ప్రీత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
ఆగిన వర్షం.. టాస్ ఓడిన హర్మన్ ప్రీత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే..
Jatadhara Movie : మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
మహేష్ బాబును ఏ ఒక్క రోజూ హెల్ప్ అడగలేదు - ఇప్పుడు నిజాలు మాట్లాడతా... టాలీవుడ్ హీరో సుధీర్ బాబు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
WhatsApp లోని ఈ 5 మార్గాల్లో నెలకు లక్ష వరకు సంపాదించవచ్చు.. పూర్తి వివరాలు
Operation Safed Sagar Web Series : సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
సిద్ధార్థ్ కొత్త వెబ్ సిరీస్ - ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రియల్ ఆపరేషన్ 'ఆపరేషన్ సఫేద్ సాగర్' గ్లింప్స్ వచ్చేసింది
Aus Huge Score VS Ind In 3rd T20: డేవిడ్, స్టొయినిస్ విధ్వంసం.. ఆసీస్ భారీ స్కోరు.. రాణించిన వ‌రుణ్, అర్ష‌దీప్ 
డేవిడ్, స్టొయినిస్ విధ్వంసం.. ఆసీస్ భారీ స్కోరు.. రాణించిన వ‌రుణ్, అర్ష‌దీప్ 
Embed widget