అన్వేషించండి

AP News: స్టాన్‌ఫోర్డ్ లో చదివిన లోకేష్‌కు ఎస్మా తెలుసా? చంద్రబాబు కుట్రలతో కాంగ్రెస్‌లోకి షర్మిల! సజ్జల సంచలన ఆరోపణలు

YS Sharmila: లోకేష్ స్టాన్‌ఫోర్డ్ లో చదివారు. ఆయనకు ఎస్మా అంటే ఏంటో తెలుసా అని అడగాలని, తాత ఎన్టీఆర్ ను తండ్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి చంపేశారని సజ్జల ఆరోపించారు.

Sajjala Ramakrishna Reddy: అమరావతి: తల్లిని, చెల్లిని గెంటేసిన ఏపీ సీఎం జగన్‌కు అంగన్వాడీల సమస్యలు ఎలా తెలుస్తాయని టీడీపీ నేత లోకేష్ (Nara Lokesh) చేసిన ట్వీట్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. లోకేష్ వాళ్ల తాత దివంగత ఎన్టీ రామారావుకు తండ్రి చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమయ్యాడు, అలాంటిది లోకేష్ సీఎం జగన్ మీద కామెంట్లు చేయడం ఏంటని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం కాదు.. తాతను తండ్రి వెన్నుపోటు చంపారని విషయం లోకేష్ కు తెలిసి ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదని హితవు పలికారు. 

ఎస్మా ప్రయోగం కరెక్ట్..
అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగం సరైందేనని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరి మీద కఠినంగా ఉండేందుకు ఎస్మాను ప్రయోగించలేదన్నారు. పిల్లలు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారని.. వారికి సేవలు అందించాలన్నారు. నెల మొదలైందని, ఈ నెలకు సంబంధించి అత్యవసర సేవలు అవసరం కనుక ప్రభుత్వం ఎస్మాకు మొగ్గు చూపిందన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు వారి సమస్యల్ని పట్టించుకోలేదని ప్రశ్నించారు. బాలింతలు, గర్బిణులు, పిల్లలు ఆకలతో అలమటిస్తే చూడాలని చంద్రబాబు, లోకేష్ కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. 

స్టాన్‌ఫోర్డ్ లో చదివిన లోకేష్ కు తెలుసా?
లోకేష్ స్టాన్‌ఫోర్డ్ లో చదివారు. ఆయనకు ఎస్మా అంటే ఏంటో తెలుసా అని అడగాలని మీడియాకు సూచించారు. అత్యవసర సేవలు అవసరమైతే ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. మీ సేవలు అత్యవసరం, విలువైనవి అని చేతులెత్తి మొక్కినా వారు వినలేదని చెప్పారు. 11 వరకు డిమాండ్లు వస్తే మేం చేయాల్సిన 8 వరకు వారి సమస్యల్ని తీర్చామని సజ్జల పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లే తెలంగాణలో ఉన్నట్లు ఇక్కడ అన్ని ఇంప్లిమెంట్ చేశాం, ప్రభుత్వం చాలా సంయమనంగా ఉందన్నారు. గుర్రాలతో తొక్కించింది ఎవరు, రైతులపై కాల్పులు జరిపింది ఎవరు.. లోకేష్ విషయాలు తెలియకుండా మాట్లాడకూడదన్నారు. 

కాంగ్రెస్ లో షర్మిల చేరికపై సజ్జల రియాక్షన్
కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. గత రెండు ఎన్నికల్లో వారికి ఒక్క సీటు కూడా రాలేదని, వారి గురించి ఎవరూ సీరియస్ గా లేరని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. ఆ తరువాత కాంగ్రెస్ లోకి రావాలనుకున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ ఇలా అందర్నీ మేనేజ్ చేస్తూ అధికారం కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల వల్ల వైసీపీకి ఏ నష్టం లేదన్నారు. ఏపీలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని, వారి గురించి తాము పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు సజ్జల. 

బ్రదర్ అనిల్ తో బీటెక్ రవి కలవడం అనుకోకుండా జరిగింది కాదన్నారు. బ్రదర్ అనిల్ వచ్చినప్పుడు క్రిస్టియన్ ఓట్ల కోసం వచ్చారంటూ గతంలో అదే నేతలు ఎన్ని విమర్శలు చేశారో ప్రజలకు తెలుసు. వాటిపై మేం స్పందిస్తే సమస్యలు పక్కదారి పట్టి ఫోకస్ పోతుందని వదిలేశామన్నారు. షర్మిల ఏపీకి వచ్చారని ఇప్పటివరకూ ఏ ప్రకటన రాలేదని, ఆమె ఏపీ నుంచి అండమాన్ వరకు ఎక్కడైనా పనిచేసే ఛాన్స్ ఉందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ హయాంలో జగన్ పెట్టిన వైఎస్సార్ సీపీని చీల్చాలని, బలహీన పరచాలని చూసినా ఏం చేయలేదని పేర్కొన్నారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే లేకుండా పోయిందన్నారు. ఆరోజు వైఎస్సార్ మరణంపై సైతం అనుమానాలు ఉన్నాయని, ఇప్పుడు మరికొన్ని విషయాల్లో జగన్ పై దుమ్మెత్తి పోసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ లో షర్మిల చేరిక సైతం చంద్రబాబు కట్రల్లో భాగమన్నారు. అభివృద్ధి అనేది లేకుండా, సైడ్ ట్రాక్ రాజకీయాలతో లబ్ది పొంది అధికారంలోకి రావాలని చూడటమే చంద్రబాబు ప్లాన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Embed widget