అన్వేషించండి

Sajjala On Chandrababu : వాలంటీర్లు లేకపోవడం వల్లనే పించన్ల పంపిణీ ఆలస్యం - ప్రజలకు తెలుసన్న సజ్జల

Andhra News : వాలంటీర్లు లేకపోవడం వల్లనే పించన్ల పంపిణీ ఆలస్యం అయిందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబే ఈసీకి ఫిర్యాదు చేయించారన్నారు.

Sajjala blamed Chandrababu for the delay in pensions :  చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో రెండు రోజుల్లో ప్రజలుక తెలిసిందని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల విషయంలో ఎన్నికల కమిషన్ పై టీడీపీ నేతలు వత్తిడి తీసుకు వచ్చారని ఆరోపించారు.  మార్చి 31వ తేదీ ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి ఏప్రిల్ ఒకటోతేదీన బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునేందుకు కొంత ఆలస్యమయిందని, అయితే దీనిపై ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖజానాలో డబ్బులు లేవంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగారన్నారు.

వాలంటీర్లు లేకపోవడం వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు                           

వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టడం వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని చేసిన తప్పును సరిదిద్దుకేనే పనిలో టీడీపీ నేతలు పడ్డారన్నారు. జన్మభూమి కమిటీల మాదిరి కాదని, వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు సేవ చేసేందుకు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ప్రజల్లో మంచి పేరు వచ్చిందన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో ఏం జరిగిందన్నది ప్రజలకు తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇవ్వలేదన్న వారే సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయించవచ్చు కదా? అని ప్రశ్నిస్తున్నారన్నారు. అడ్డం గొట్టింది చంద్రబాబు అన్న సంగతి అందరికీ తెలుసునని, అది ప్రజలకు కూడా అర్థమయిందన్నారు.

వాలంటీర్లకు  మంచి పేరు రావడం వల్లే మద్దతుగా మాట్లాడుతున్న  టీడీపీ                          

. ‘‘వాలంటీర్లపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వాలంటీర్లపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. అందుకే  ఇవాళ వృద్ధులు ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.  వాలంటీర్ వ్యవస్థపై నిమ్మ గడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారు.ప్రజల్లో తిరుగుబాటు వచ్చేసరికి వాలంటీర్లకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు స్వార్థం తప్ప మరేమి పట్లదని విమర్శించారు.  పించన్ల పంపిణీ  మరో రెండు మూడు రోజుల్లో పంపిణీ పూర్తవుతుంది. వాలంటీర్లను అడ్డుకుని ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తారా అని సజ్జల ప్రశ్నించారు. 

ఈసీపై కూటమి పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి !                                                                                

చంద్రబాబు కుట్రలను ప్రజలు అర్థం చేసుకున్నారు. కూటమి పార్టీలన్నీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నాయి. టీడీపీ , జనసేన, బీజేపీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. ఈసీపై ఒత్తిడి తేవడంతో అధికారుల బదిలీ జరుగుతోంది. చంద్రబాబు, పురందేశ్వరి ఫెయిల్యూర్ నేతలు  అంటూ సజ్జల మండిపడ్డారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
Bikini Ban : బికినీ ధరించినా లేదా చెప్పులతో కారు నడిపినా ఫైన్‌! యూరప్‌లో పర్యాటకులకు వింతైన నియమాలు అమలు!
బికినీ ధరించినా లేదా చెప్పులతో కారు నడిపినా ఫైన్‌! యూరప్‌లో పర్యాటకులకు వింతైన నియమాలు అమలు!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
Anaganaga Oka Raju Songs : ఘనంగా 'రాజు గారి పెళ్లి' - టాలీవుడ్ To హాలీవుడ్... వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ సాంగ్ లిరిక్స్ అదుర్స్
ఘనంగా 'రాజు గారి పెళ్లి' - టాలీవుడ్ To హాలీవుడ్... వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ సాంగ్ లిరిక్స్ అదుర్స్
AI Impact In India:భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
Embed widget