AP Green Energy: రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం - ౩ వేల కోట్లతో భారీ సోలార్ ప్రాజెక్ట్.. 11 నెలల్లోనే రికార్డు స్థాయి పూర్తి!
SAEL Solar: ఆంధ్రప్రదేశ్తీ సుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద మొదటి విజయం నమోదైంది. SAEL సంస్థ నిర్మించిన 600 మెగావాట్ల భారీ సోలార్ ప్రాజెక్టును మే 22న ప్రారంభించబోతున్నారు.

Rayalaseema Development: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన వివరాలు ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేలా SAEL సంస్థ చేపట్టిన భారీ సోలార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రాయలసీమ ప్రాంతంలో SAEL సంస్థ నిర్మించిన 600 మెగావాట్ల భారీ సోలార్ ప్రాజెక్టును మే 22న ప్రారంభించబోతున్నారు. సుమారు రూ. 3,000 కోట్ల భారీ పెట్టుబడితో చేపట్టిన ఈ ప్రాజెక్టును కేవలం 11 నెలల రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ తన ట్వీట్ ద్వారా వెల్లడించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ రీ-ట్వీట్ చేశారు.
రికార్డు వేగంతో నిర్మాణం - ఏపీ వేగానికి నిదర్శనం
సాధారణంగా ఇటువంటి భారీ స్థాయి ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఏళ్ల సమయం పడుతుంది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక అనుమతుల్లో వేగం పెంచడంతో ఈ ప్రాజెక్టు కేవలం 11 నెలల్లోనే గ్రౌండ్ లెవల్ నుంచి గ్రిడ్ కనెక్టివిటీ వరకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం మా రాష్ట్ర పనితీరు వేగానికి, పారిశ్రామికవేత్తల్లో ఉన్న విశ్వాసానికి, అమలు సామర్థ్యానికి నిదర్శనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం వల్లే ఇది సాధ్యమైందని ఆయన అభిప్రాయపడ్డారు.
₹3,000 crore invested.
— Lokesh Nara (@naralokesh) May 20, 2026
600 MW completed.
Built in a record 11 months.
SAEL’s mega solar project will be inaugurated on May 22 in Rayalaseema.
In Andhra Pradesh, we don’t just break ground. We break records.#ChooseSpeedChooseAP @SAEL_India pic.twitter.com/ZDlVc4r7A3
క్లీన్ ఎనర్జీ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్
భారతదేశ క్లీన్ ఎనర్జీ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాబోయే కొన్నేళ్లలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏకంగా రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. SAEL ప్రాజెక్టు ప్రారంభం అనేది ఈ భారీ లక్ష్యం దిశగా పడిన మొదటి బలమైన అడుగుగా రాజకీయ, పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి.
It is a matter of pride for Andhra Pradesh that the first project under our forward-looking Integrated Clean Energy Policy 2024 is now being commissioned.
— N Chandrababu Naidu (@ncbn) May 20, 2026
SAEL’s 600 MW solar project in Rayalaseema, built with an investment of ₹3,000 crore in a record 11 months, reflects the… https://t.co/jMhYwhSW4x
రాయలసీమ అభివృద్ధికి ఊతం
వెనుకబడిన ప్రాంతంగా భావించే రాయలసీమకు ఈ ప్రాజెక్టు ఒక వరంగా మారనుంది. 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్థానిక గ్రిడ్కు బలం చేకూరడమే కాకుండా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరగడంతో పాటు, తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్ లభ్యత పెరగనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















