అన్వేషించండి

Roja : ప్యాలెస్ లీజుకిచ్చుకోవచ్చు - 40 శాతం ఓట్లొచ్చినా జగన్ ఎందుకు గెలవలేదు - రోజా అనుమానాలు

Andhra News : 40 శాతం ఓట్లతో మోడీ, రేవంత్ గెలిచినా జగన్ ఎందుకు ఓడిపోయారని రోజా అనుమానం వ్యక్తం చేశారు. రుషికొండ ప్యాలెస్‌ లీజుకు ఇచ్చుకోవచ్చని ఆమె సలహా ఇచ్చారు.

Roja On Politics : రుషికొండ ప్యాలెస్‌పై జరుగుతున్న ప్రచారం అంతా తప్పేనని మాజీ పర్యాటక మంత్రి రోజా అన్నారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆమె రుషికొండపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవన్నారు. తామేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదని.. సెవెన్‌ స్టార్‌ రేంజ్‌లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించామన్నారు. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలెస్ అంత లగ్జరీగా నిర్మించామన్నారు. వేరే దేశాల నుంచి పర్యాటకులు వచ్చినప్పుడు అక్కడ ఉండొచ్చు.. లేదంటే ఎవరికైనా లీజుకు ఇచ్చుకోవచ్చన్నారు.  కట్టింది ఖరీదైన భవనం  కాబట్టి ఖరీదైన ఫర్నీచర్ ఉంటుందని చెప్పుకొచ్చారు. 

40 శాతం ఓట్లు వచ్చినా పదకొండు సీట్లేనా ?         

ఎన్నికల ఫలితాలపైనా రోజా అనుమానం  వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి నలభై శాతం ఓట్ల లోపే వచ్చాయని ఆయన ప్రధాని అయ్యారన్నరు. తెలంగాణలో రేవంత్ రెడ్డికి కూడా నలభైలశాతం ఓట్లే వచ్చాయని అయినా సీఎం అయ్యారన్నారు. కానీ ఏపీలో జగన్ కు నలభై శాతం ఓట్లు వచ్చినా పదకొండు సీట్లే వచ్చాయన్నారు. 

ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ లేదు !

ఆడుదాం ఆంధ్రా పేరుతో వంద కోట్లు రూపాయలు దోచేశారని తనపై వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.  ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారని స్కామ్‌ ఇలా కూడా అవుతుందా అని ప్రశ్నించారు.  క్రీడాకారులకు  నగదు బహుమతులు  ఇచ్చామన్నారు.   అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు  తాను నిర్వహిస్తున్న క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదనన్నారు. తాను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం కరెక్ట్ కాదన్నారు. 

టీడీపీ నేతలు దాడులు ఆపాలి !                                         

రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుపై దాడులు చేస్తున్నారని రోజా ఆరోపించారు.  ఇప్పటికైనా దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలన్నారు.   వచ్చే ఐదేళ్ల పాటు కష్టపడి మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటామని రోజా తెలిపారు. 

రోజాపై తీవ్ర ఆరోపణలు                                    

టూరిజం మంత్రిగా ఉన్న రోజా కనుసన్నల్లోనే రుషికొండ భవన నిర్మాణం జరిగింది. ఆ భవనంలో ఐదు వందల కోట్ల ఖర్చు చూపి భారీగా అవినీతి  చేశారని.. రూపాయి వస్తువును వెయ్యి రూపాయలుగా చూపించి దోచేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ దగ్గర నుంచి రోజా బెంజ్ కారు పొందారని  కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వీటన్నింటిపై విచారణ చేయిస్తామని.. అసెంబ్లీలో అన్ని విషయాలను బయట పెడతామనిచెబుతున్నారు.                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget