అన్వేషించండి

Andhra Pradesh News: పవన్ తరఫున సాయి ధరమ్‌ తేజ్‌ ప్రచారం- రాళ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు- తాటిపర్తిలో ఉద్రిక్తత

Sai Dharam Tej: సినీ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఇది వైసీపీ పనేనంటూ జనసేన ఆందోళన చేపట్టింది. ఈ దాడిలో జనసైనికుడు గాయపడ్డాడు.

Pithapuram News: పవన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సాయిధరమ్‌తేజ్ ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ గెలిపించాలనిసాయి ధరమ్ తేజ్ ప్రచారం చేశారు. ఈ సమయంలో ఓ వ్యక్తి ఆయనపై రాయి విసిరారు. అది ఆయన పక్క నుంచి వెళ్లిపోయి అక్కడ జనసేన కార్యకర్తకు తగిలింది. ఇదంతా వైసీపీ పనేనంటూ జనసేన, టీడీపీ నేతలు విమర్శలు చేస్తారు. 

ఎన్నికల ప్రచారం కోసం సాయి ధరమ్‌ తేజ్‌ తాటిపర్తి వస్తున్నారని జనసైనికులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయి ధరమ్‌ తేజ్ మాట్లాడే ప్రాంతంలో భారీగా ఫ్లెక్సీలు పెట్టారు. బాణసంచా పేల్చారు. అదే టైంలో అటుగా వచ్చిన వైసీపీ శ్రేణులు కూడా పోటీగా బాణసంచా పేల్చారు. జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ కవ్వింపు చర్యలకు జనసైనికుల నుంచి కూడా అదే స్థాయిలో రియాక్షన్ వచ్చింది. వారు కూడా అటు నుంచి నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్లు చెప్పారు. Image

ఇలా సాయంత్రం వేళ తాటిపర్తి వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని అక్కడి నుంచి వారందర్నీ పంపేశారు. అనంతరం అక్కడకు వచ్చిన సాయి ధరమ్‌ తేజ్‌ ప్రసంగించారు. పవన్ కల్యాణ్‌ను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మంచి జరుగుతుందని వారినికి చెప్పారు. అక్కడ కాసేపు మాట్లాడిన సాయిధరమ్‌ తేజ్‌ చిన్నజగ్గంపేట వెళ్లిపోయారు. 

చిన్నజగ్గంపేట ప్రచారం చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ ఉద్రిక్తత మొదలైంది. ఆయన తాటిపర్తి జంక్షన్‌కు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై రాళ్లు, వాటర్ బాటిళ్లు విసిరారు. ఇది అక్కడే ఉన్న జనసేన కార్యకర్తకు తగిలింది. సాయిధరమ్‌ తేజ్‌ పై నుంచి వెళ్లిపోయింది. 

తీవ్ర రక్తస్రావంతో ఉన్న జనసేన కార్యకర్తను స్థానికులు ప్రాథమిక చికిత్స చేసి బైక్‌పై ఆసుపత్రికి తరలించారు. ఇది వైసీపీ శ్రేణుల పనేనంటూ జనసైనికులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేప్పట్టారు. పోలీసులు జోక్యం చేసుకొని అందర్నీ అక్కడి నుంచి తరిమేశారు. సాయిధరమ్‌తేజ్‌ ప్రచారానికి మంచి స్పందన రావడంతోనే వైసీపీ నేతలు ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని జనసైనికులు నినాదాలు చేశారు. 

గాయపడిన జనసైనికుడిని ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆయన్ని కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్‌, పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్‌ వర్మ పరామర్శించారు. ఓటమి ఖరారు అయిన వైసీపీ నేతలు ఇలాంటి దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు నేతలు. ఇవి చూస్తూ ఊరుకోమని.. పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే ఎస్పీ ఆఫీస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కచ్చితంగా దాడులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు.  

Image

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP DesamHema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP DesamSIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP DesamTeam Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Vivo X Fold 3 Pro: ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Embed widget