అన్వేషించండి

Anantha babu: ఏలేరు కాలువలో దొరికిన ఓ యువతి మృతదేహంతో అనంతబాబుకు లింక్‌- టీడీపీ ఎమ్మెల్యే శిరీష్ సంచలన ఆరోపణలు

Konaseema News: అనంత‌బాబు అకృత్యాలు అంతే లేద‌ని రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే శిరీష దేవి తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మ‌రో ప‌క్క మీడియాలో చూపిస్తున్న దాంట్లో వాస్త‌వంలేద‌న్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.

Rampachodavaram MLA Sirisha Devi: రంపచోడవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు ఎంతో మంది అమాయక మహిళలు బలైపోయారని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుని ఆడవాళ్ల జీవితాలను నాశనం చేశారని, అతనికి భయపడి మహిళలు భయపడిపోతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికడం, కాలేజీ సీటు కావాలన్నా, బదిలీలు చేయాలన్నా మహిళల్ని రకరకాలుగా లైంగికంగా వేధించేవాడన్నారు. 

మార్ఫింగ్‌ అంటూ మభ్యపెట్టే ప్రయత్నం .
రంపచోడవరంలోని ఆమె క్యాంపు కార్యాలయంలోమీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శిరీష దేవి అనంతబాబుపై మండిపడ్డారు. రంపచోడవరం కేంద్రంగా ఎమ్మెల్సీ అనంతరబాబు అకృత్యాలకు కొన్ని రోజుల క్రితం బయటకు వచ్చిన వీడియో సాక్ష్యమని ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు. పైగా ఆ వీడియోలో ఉన్నది తాను కాదని మార్ఫింగ్‌ చేశారని... తప్పుడుప్రచారం చేస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఆ వీడియోలో మెడపైన ఉన్న చైను, చేతికి ఉన్న ఉంగరాలు ఆయనవి కావా అని ప్రశ్నించారు.

న్యూడ్‌ వీడియో ముమ్మాటికీ వాస్తవమే అని, గత పదేళ్లుగా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు శిరీష. బాధిత మహిళ ధైర్యం చేసి ఆ వీడియో బయటపెట్టిందన్నారు. ఈ వీడియో వ్యవహారంలో విచారణ చేపట్టి అనంతబాబును వెంటనే అరెస్ట్‌ చేయాలని ఎమ్మెల్యే డిమాండ్‌ చేశారు. 

మహిళలకు ఇచ్చేవిలువ ఇదేనా జగన్మోహన్‌ రెడ్డి.. 
ఒక్కొక్క వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుడు వ్యవహారాలు బయటకు వస్తుంటే జగన్మోహన్‌ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు శిరీష. ఎమ్మెల్సీలకు శిక్ష వేయించలేవా అని నిలదీశారు. మహిళల పక్షపాతిని అని చెప్పుకునే జగన్మోహన్‌ రెడ్డి వీళ్లకు ఏ శిక్షవేస్తావు అని అడిగారు. మొన్ననే ఒక ఎమ్మెల్సీ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య పిల్లల్ని వదిలేశారని, ఇప్పుడు అనంతబాబు బాగోతం బట్టబయలైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

దళిత యువకుడి హత్య వెనుక అక్రమ సంబంధం 
కాకినాడకు చెందిన తన కారు డ్రైవరు వీధి సుబ్రహ్మణ్యం హత్య వెనుక అనంతబాబు ఓ మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధం వ్యవహారమేనని ఎమ్మెల్యే శిరీష దేవి ఆరోపించారు. దళితుడ్ని చంపి డోర్‌ డెలివరీ చేసింది కూడా మహిళ కోసమే అన్నారు. దీని వెనుక 12 మంది అనుచరులు ఉన్నారని అ్నారు. కేసు నుంచి వారిని తప్పించారన్నారన్నారు. అనంతబాబు, మహిళ అక్రమ సంబంధం విషయం డ్రైవర్‌కు తెలియడంతో ఎక్కడ బయటపెడతాడో అని కాకినాడ తీసుకువెళ్లి చంపేశారన్నారు. సుబ్రహ్మణ్యం కేసులో సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు. 

ఇటీవలే తిమ్మాపురం వద్ద ఏలేరు కాలువలో ఓ యువతిని తల, మొండెం వేరు చేసి చంపేసిన ఉదంతం బయటపడిందని, హత్యకు గురైన ఆ అమ్మాయి కూడా అనంతబాబు బాధితురాలేమోనని అనుమానం వస్తుందన్నారు. ఇతను ప్రత్యక్షంగా ప్రమేయం లేకున్నా ఇతను వెనుకున్న 12 మంది అనుచరులే చంపివేశారేమోనని అనుమానంగా ఉందన్నారు అటవీసంపద దోచుకున్న వ్యక్తి అనంతబాబు అని, మహిళలను టార్గెట్‌ చేసి వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న అనంతబాబు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

ఆ వీడియోలు మార్ఫింగ్‌ చేసినవే: ఎమ్మెల్సీ అనంతబాబు
రెండు రోజులుగా టీవీ ఛానెళ్లు, సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వీడియోలు తనవి కావని, అవి మార్ఫింగ్‌ చేసిన ఫేక్‌ వీడియోలు అని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అన్నారు. తనను అప్రతిష్టపాలు చేయాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బయటకు వచ్చిన న్యూడ్‌ వీడియో నేపథ్యంలో ఎమ్మెల్సీ అనంతాబు ఓ వీడియోను బయకు వదిలారు. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్న వీడియోను అసభ్య ఫేక్‌ వీడియోలు జోడిరచి అసత్య ప్రచారం చేస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గతంలో తనకు ఈవీడియోలు పంపించి డబ్బులు డిమాండ్‌ చేశారని, దీనిపై స్థానిక పోలీసుకుల ఫిర్యాదు చేశానన్నారు. 

Also Read: విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన - పోక్సో కేసు నమోదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
YSRCP Politics: ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
ఆగని రప్పా.. రప్పా.. అరెస్ట్ చేసే కొద్దీ రెచ్చిపోతున్న వైకాపా శ్రేణులు
Year Ender 2025: ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
ఈ ఏడాది NPS లో 5 భారీ మార్పులు.. ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే రూల్స్ ఇవే
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Kerala Gen Z political Leader: జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
జెన్‌జీ తరం మున్సిపల్ చైర్మన్ దియా బిను - వారసురాలు కాదు.. నాయకత్వంతో ఎదిగిన లీడర్ -మనకూ స్ఫూర్తే !
Embed widget