అన్వేషించండి

Nara Lokesh: విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం, నాణ్యమైన విద్యుత్ అందిస్తాం: నారా లోకేశ్

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వస్తే ఏపీలో విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తామని ఆ పార్టీ నాయకుడు నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Nara Lokesh: టీడీపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తున్న నారా లోకేశ్ ను కోలమూరు గ్రామస్థులు కలిసి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. తాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కోలమూరు గ్రామ ప్రజలు నారా లోకేశ్ ముందు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని మొరపెట్టుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పరిధిలో చాలా మంది ఆక్వా రంగంపై ఆధారపడి బతుకుతున్నట్లు గ్రామస్థులు చెప్పుకొచ్చారు. ఆక్వా రైతులు అందరికీ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, కోలమూరులో 33 కేవీ సబ్ స్టేషన్ ఉన్నా.. అధిక విద్యుత్ కోతలతో సతమతం అవుతున్నట్లు వెల్లడించారు. విద్యుత్ కోతల సమస్యతో రొయ్యలు డీఓ సమస్యతో చనిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. లో ఓల్టేజీ ఉండటంతో ఇళ్లలోని విద్యుత్ పరికరాలు కాలిపోతున్నాయన్నారు. పంట కాల్వల్లో పూడిక పేరుకుపోతోందని, పూడిక తీయకపోవడంతో పంటలకు సరిగా నీరు రావడం లేదని నారా లోకేశ్ ముందు మొరపెట్టుకున్నారు. వరి పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని, పండిన పంటలకు పరదాలు ఇవ్వకపోవడంతో ధాన్యం తడిచి మొలకలు వస్తున్నాయని వాపోయారు. విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడంతో పెన్షన్లు తొలగిస్తున్నట్లు చెప్పారు. నాసిరకం మద్యం తాగడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నట్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎదుట తమ సమస్యలను ఏకరువుపెట్టారు.

గ్రామస్థుల సమస్యలన్నీ విన్న నారా లోకేశ్.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ద్వారా నిదులు కేటాయించినట్లు పేర్కొన్నారు. అయితే వాటిని వినియోగించుకోలేని చేతగాని సీఎం జగన్ మోహన్ రెడ్డి అని నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ 24 గంటల పాటూ మంచి నీటిని సరఫరా చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ కు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలన్న ఆలోచన లేదని విమర్శలు గుప్పించారు.

Also Read: AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలిడే, విద్యుత్ కోతల నేపథ్యంలో నిర్ణయం

టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత లో-ఓల్టేజ్ సమస్య లేకుండా చూస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రజలకు, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. నీరు-చెట్టు ద్వారా టీడీపీ హయాంలో కాల్వల్లో పూడిక తీయించే వాళ్లమని చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాన్ని మరుగున పడేశారని ఆరోపించారు. నీటి తీరువా పెంచి రైతుల్ని దోచుకుంటున్నారని విమర్శించారు. సాగు నీటి కాల్వలపై దృష్టి పెట్టడం లేదని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కాల్వల మరమ్మతులు, పూడికతీత చేపడతామని చెప్పుకొచ్చారు. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామన్నారు. రకరకాల సాకులు చూసి 6 లక్షల పింఛన్లను రద్దు చేశారని జగన్ సర్కారుపై మండిపడ్డారు. వారందరికీ తిరిగి పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో జె బ్రాండ్ల మద్యాన్ని నిషేధిస్తామని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget