అన్వేషించండి

పిచ్చాసుపత్రిలో చేరే రోజు దగ్గర్లోనే! అమిత్ షా-జూ. ఎన్టీఆర్ భేటీపై మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు

Minister Roja Comments: రాజమహేంద్రవరంలో మంత్రి రోజా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.

Minister Roja: ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా - నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కావడం విపరీతంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. రాజమండ్రిలో శుక్రవారం రోజు మంత్రి రోజా పర్యటించారు. వీఎల్ పురంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శుక్రవారం (ఆగస్టు 26) ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రోజా అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని చంద్రబాబు ఫోటో ఆ రథంపై ముద్రించలేదని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి నందమూరి ఫ్యామిలీలో చంద్రబాబు విలువ పడిపోయినట్లుగా అర్థం అవుతోందని రోజా వ్యాఖ్యలు చేశారు.

కుప్పంలో కూలడం ఖాయం - రోజా
చంద్రబాబు కుప్పం పర్యటన గురించి మాట్లాడుతూ.. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోనుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం అని అన్నారు. చంద్రబాబు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని, అందుకే పిచ్చి ఎక్కినట్లు ప్రవర్తిస్తున్నాడని రోజా మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో సీఎం జగన్ ఎప్పుడు బటన్ నొక్కినా ఏదో ఒక రాద్దాంతం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమాన్ని సంక్షోభంగా మార్చేందుకు కుటిల ప్రయత్నాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. మొన్నటి వరకు ఎంపీ గోరంట్ల మాధవ్ ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేశారని అన్నారు. ఇప్పుడు కుప్పంలో అల్లర్లు సృష్టించి ఆ బురదను వైఎస్ఆర్ సీపీపై చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రోజా తప్పుబట్టారు.

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
ప్రధాన కేంద్రమైన రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్ కే రోజా వచ్చారు. రోజాకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత శుక్రవారం ఉదయం స్థానికంగా ఆమె బస చేసిన విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చేం అందచేశారు. ఈ సందర్భంగా జిల్లాలో పర్యాటక, క్రీడా శాఖల పరిధిలో చేపట్టనున్న పలు అంశాలపై కలెక్టర్ మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో మున్సిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, తదితరులు ఉన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా..
రాజమండ్రిలో జరుగుతున్న ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఆర్కే రోజా ముఖ్యఅతిథిగా హాజరవుతుండగా మోరంపూడి సెంటర్ లో నిర్మించనున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి రోజా తో పాటు స్థానిక ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని భూమి పూజ చేశారు. అదేవిధంగా రాజమండ్రిలో చేపట్టనున్న పలు పర్యటకశాఖ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి రోజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Embed widget