అన్వేషించండి

YSRCP MLA: మాకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆపేస్తాం - వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

YSRCP MLA: ఫ్యాను గుర్తుకు ఓటు వేయకపోతే పింఛన్లు ఆగిపోతాయని కాకినాడ వైపీసీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

YSRCP MLA: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జీ, ఎమ్మెల్యే పింఛన్లపై షాకింగ్ కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలి.. లేకపోతే పింఛన్లు ఆగిపోతాయని స్థానిక ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే అన్నవరంలో గడప గడపకు మన ప్రభుత్వంలో ఆయన గురువారం పాల్గొని.. పలువురి ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మహిళలతో మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. మీకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు వంటివన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. 

గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే జనవరి నుంచి  ప్రస్తుతం ఇస్తున్న రూ. 2500 పెన్షన్‌ను రూ. 2750 చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఆ తర్వాత ఏడాది మూడు వేలు చేస్తామన్నారు. డైరక్ట్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా ఇప్పటికీ ప్రజలకు  లక్షా 71 వేల 244 కోట్లను పంపిణీ చేశామని జగన్ చెప్పారు. 

39 నెలల్లోనే రూ. 51 వేల కోట్లు పంపిణీ!

మహిళల కోసం నాలుగు పథకాలకు 39 నెలల్లోనే రూ. 51 వేల కోట్లు పంపిణీ చేశామన్నారు. అప్పుడూ ఇప్పుడూ ఒకే  బడ్జెట్ ఉన్నా ఈ పథకాలన్నీ ఎలా అమలు చేస్తున్నామో ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దోచుకో.. దాచుకో.. తినుకో అనే స్కీమ్‌ను అణలు చేసేవారని విమర్శించారు.ఇది మహిళల ప్రభుత్వమని.. జగన్ స్పష్టం చేశారు.  

ఒంటరి మహిళలకు షాక్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒంటరి మహిళలకు షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ పెన్షన్‌కు అర్హత ఉన్న వయసును ఒక్కసారిగా పెంచేసింది. ప్రస్తుతం ఒంటరి గ్రామాల్లో 30 ఏళ్ల నుంచి.. పట్టణాల్లో  35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు యాభై ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే యాభై ఏళ్లు నిండిన ఒంటరి మహిళలకు మాత్రమే ఇక నుంచి పెన్షన్ ఇస్తారు. ఈ ఆదేశాలను పంచాయతీరాజ్ శాఖ పదహారో తేదీన విడుదల చేసింది.

తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో ఒంటరి మహిళ పెన్షన్ పొందాలంటే యాభై ఏళ్లు నిండి ఉండటమే కాదు కచ్చితంగా దారిద్ర్య రేఖ దిగువన ఉండాలని...స్థానికంగా నివసించాలని అలాగే.. ఆధార్ కార్డ్ సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో ఏ ఇతర సామాజిక పించన్ పథకం లో భాగం అయినా పెన్షన్ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణంగా ఒంటరి మహిళలు అంటే పెళ్లి కాని వాళ్లు, డైవర్స్ తీసుకున్న వాళ్లు, భర్త చనిపోయిన వాళ్లు ఉంటారు. పెళ్లి కాని వాళ్లకు అయినా  35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు . విడాకులు తీసుకున్న వారికీ అంతే. భర్త చనిపోయి ఉంటే గ్రామాల్లో 30 పట్టణాల్లో 35 ఏళ్ల నుంచి పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మూడు కేటగిరీల్లోనూ యాభై ఏళ్లు నిండి ఉండాలని ప్రభుత్వం తేల్చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
Eluru MP Putta Mahesh Yadav: నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
నేను ఏ తప్పు చేయలేదు.. ఆ డ్రగ్స్ రిపోర్టులే సాక్ష్యం - TDP అధిష్టానానికి ఎంపీ పుట్టా మహేష్ నివేదిక
Konaseema Crime News: సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా..
సామూహిక అత్యాచారం కేసులో సంచ‌ల‌న తీర్పు.. ముగ్గురికి జీవిత‌ఖైదు.. రూ.5.80 ల‌క్ష‌ల జ‌రిమానా!
Rajahmundry King: ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?
ఇండోనేషియా, మలేషియాలను జయించిన రాజమండ్రి రాజు ! గొప్ప చక్రవర్తి పుట్టింది గోదావరి జిల్లాలోనా?

వీడియోలు

White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kerala Elections 2026: కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
AP PNG Subsidy: ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
ఎల్పీజీ నుంచి PNG కి మారే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ.2400 బెనిఫిట్
US Iran War: ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
ఇరాన్‌పై దాడులకు అమెరికా మరో 10 రోజులు బ్రేక్.. డొనాల్డ్ ట్రంప్ ప్లాన్ ఏంటీ?
Navratri Fasting : నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్
నవరాత్రి ఉపవాసం తర్వాత ఈ టిప్స్ పాటించకపోతే ప్రమాదం.. ఆహారం నుంచి హైడ్రేషన్ వరకు తీసుకోవాల్సిన టిప్స్
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
Kaattan Series OTT : కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
కొండపై తెగి పడిన తల ఎవరిది? - ఓటీటీలో విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ చూసెయ్యండి
Amaravati Politics: అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
అమరావతికి రాజ్యాంగ రక్షణ- ఏపీ రాజకీయాల్లో చారిత్రక మలుపు - వైసీపీ విధానమేంటి?
Maharashtra Minister Video: ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
ట్రాన్స్‌‌జెండర్‌తో మహరాష్ట్ర మంత్రి వీడియో వైరల్.. రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్! మార్ఫింగ్ అని వివరణ
Embed widget