అన్వేషించండి

Chandrababu: చంద్రబాబు ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ ప్రోగ్రాం సక్సెస్ చేద్దాం: ఎమ్మెల్యే గోరంట్ల పిలుపు

Chandrababu Kovvur Tour: ‘‘ఇదేం ఖర్మ... మన రాష్ట్రానికి’’ అనే కొత్త నిరసన కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల ఒకటో తేదీన కొవ్వూరుకు చంద్రబాబు రానున్నారు.

Gorantla Butchaiah Chowdary: తూర్పు గోదావరి జిల్లా... రాజమండ్రి: జిల్లాలో డిసెంబర్ 1వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పిలుపునిచ్చారు. సీఎం జగన్‌ విధానాల వల్ల రాష్ర్టానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ ప్రజలకు చెప్పేందుకు ‘‘ఇదేం ఖర్మ... మన రాష్ట్రానికి’’ అనే కొత్త నిరసన కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల ఒకటో తేదీన కొవ్వూరుకు చంద్రబాబు రానున్నారు. రాజమండ్రి స్థానిక గాంధీపురం ప్రియాంక గార్డెన్స్‌లో ఎమ్మెల్యే గోరంట్ల అధ్యక్షతన రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ముందుగా దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలు మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గోరంట్ల మాట్లాడుతూ.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని, ఈ అవినీతి ప్రభుత్వాన్ని గొంతు ఎత్తి ప్రశ్నిస్తే, వారిపై తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా జైల్లోకి తోస్తున్నారని మండిపడ్డారు. 

రాష్ట్రంలో, ప్రజలలోను మార్పు మొదలైందని ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని గోరంట్ల అన్నారు. నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వానికి, ఈ సీఎంకి చరమగీతం పాడాలని, కొవ్వూరులో జరిగే చంద్రబాబు పర్యాటనకు  అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ చంద్రన్నను అధికారంలోకి తీసుకువచ్చేంత వరకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కష్టపడి పని చేయాలని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు అధ్యక్షులు జవహార్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ హోం శాఖ మంత్రి, పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అధ్యక్షులు కెఎస్‌ జవహార్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నవంబర్ 30వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం విజయరాయిలో ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల సరిహద్దులో ఉన్న రామచంద్రరం గ్రామంలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. అనంతరం చింతలపూడిలో రోడ్‌ షో నిర్వహించి రాత్రి అక్కడే బస చేస్తారు. అక్కడ నుంచి డిసెంబరు 1న తాడువాయి మీదుగా రోడ్‌ షోలో పాల్గొని.. పోలవరం చేరుకుంటారు చంద్రబాబు. పోలవరం నుంచి రాత్రికి కొవ్వూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. చంద్రబాబు రాత్రికి అక్కడే బస చేస్తారు. డిసెంబర్ 2వ తేదీన కొవ్వూరు నుంచి రోడ్‌ షో ద్వారా నిడదవోలు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి రోడ్‌ షో ద్వారా తాడేపల్లిగూడెం చేరుకుంటారని టీడీపీ నేతలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Hyderabad News: పెళ్లి కోసం ప్రియురాలి ఒత్తిడి - దుర్గంచెరువులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పెళ్లి కోసం ప్రియురాలి ఒత్తిడి - దుర్గంచెరువులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Andhra Pradesh: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్
Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా  సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan On Congress: ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
ఢిల్లీలో వైసీపీ ధర్నాకు కాంగ్రెస్‌ దూరంగా ఉందా? జగన్ దూరం పెట్టారా?
Hyderabad News: పెళ్లి కోసం ప్రియురాలి ఒత్తిడి - దుర్గంచెరువులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
పెళ్లి కోసం ప్రియురాలి ఒత్తిడి - దుర్గంచెరువులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Andhra Pradesh: విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త చెప్పిన నారా లోకేష్‌- ఇంకా రెడ్‌బుక్ తెరవలేదని కామెంట్
Old City Bonalu 2024 : లాల్‌ దర్వాజా  సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
లాల్‌ దర్వాజా సింహ వాహిని బోనాల వేడుకలు..28,29 తేదీల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలివే!
Telangana Panchayat Elections :  ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
ఏడాది చివరిలోపు స్థానిక ఎన్నికలూ పూర్తి - రేవంత్ పక్కా ప్లాన్‌తో వెళ్తున్నారా ?
Karate Kalyani: రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుపై కరాటే కళ్యాణి ఊహించని కామెంట్స్‌ - లావణ్య చాలా తప్పులు చేసింది, ఆమెకు సపోర్ట్‌ చేయను..
రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుపై కరాటే కళ్యాణి ఊహించని కామెంట్స్‌ - లావణ్య చాలా తప్పులు చేసింది, ఆమెకు సపోర్ట్‌ చేయను..
Erraballi Dayakar Rao: బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
బీఆర్ఎస్‌తో అంటీముట్టనట్లుగా ఎర్రబెల్లి! సొంత పార్టీలోనే ఇబ్బందులా?
Hero Vishal: ఫిల్మ్ ఛాంబర్‌తో గొడవ - నిర్మాతల మండలికి విశాల్‌ వార్నింగ్‌, ఏమన్నాడంటే..
ఫిల్మ్ ఛాంబర్‌తో గొడవ - నిర్మాతల మండలికి విశాల్‌ వార్నింగ్‌, ఏమన్నాడంటే..
Embed widget