By: ABP Desam | Updated at : 05 Apr 2022 03:25 PM (IST)
మండపేటలో విచిత్ర పరిస్థితి
జిల్లాలో పునర్విభజనలో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. కరవుతో ఉండే రాయలసీమకు తొలిసారిగా సముద్రం వస్తే.. ఇప్పుడు ఓ గ్రామం రెండు జిల్లాలుగా విడిపోయింది. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు.
ఆ గ్రామం ఇప్పుడు జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రెండుగా విడిపోయి రెండు జిల్లాల్లోకి వెళ్లిపోయింది. రెండు జిల్లాల సరిహద్దు ఒక సీసీ రోడ్డు. దీంతో ఆ గ్రామానికి చెందిన వారు ఏదో ఒక జిల్లాలో కలపాలని .. దగ్గరగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో అయితే మరీ మంచిదని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు .
జిల్లాల విభజన అస్పష్టంగా చేశారని...శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మండపేట మండలం చినద్వారపూడి వాసులు. ఓ వైపు కొత్త జిల్లాల ఏర్పాటై ఆయా జిల్లా ప్రజలు సంబరాలు చేస్తుంటే... వీళ్లు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండపేట నియోజకవర్గంలోని మండపేట మండలం చిన ద్వారపూడిని తూర్పు గోదావరి జిల్లాలో మాత్రమే ఉంచాలని ఆ గ్రామస్తులు నిరసన తెలిపారు. ఒకే గ్రామం రెండు జిల్లాలో ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తాయని ఆవేదన చెందుతున్నారు. భూములు, ఇళ్లు, స్కూల్స్ ఇలా చాలా విషయాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు.
మండపేట మండలం చినద్వారపూడి ప్రజలు రెండు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లి తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని కనికరించాలని వేడుకున్నారు. ఈ గ్రామంలో సీసీ రోడ్డుకు ఒకవైపు ఉన్న వీధి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోకి వెళ్ళింది. మరోవైపు వీధి మండపేట మండలంలో ఉండి కోనసీమ జిల్లాలో కలిసింది.
చినద్వారపూడి వాసులు మాత్రం కోనసీమ జిల్లా ఉండలేమంటున్నారు. ప్రజలు ఆందోళనకు దిగారు. తూర్పుగోదావరిలో ఉన్న వీధి జనం కూడా వీరికి మద్దతుగా నిలిచారు. అధికార, ప్రతిపక్ష నేతలు అసమర్థత వల్లే తమకు ఈ పరిస్థితి ఏర్పడిందని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు.
జిల్లాల పునర్విభజన అస్పష్టంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనపర్తి, బిక్కవోలు మండలాలను రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఉంచారు. అనపర్తి దాటి ద్వారపూడి, కేశవరం కోనసీమలో ఉన్నాయి. వేరే జిల్లా హద్దులు దాటితే కానీ జిల్లా కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి అనపర్తి, బిక్కవోలు మండలాల వారిది.
సొంత బంధువులే వేర్వేరు జిల్లాలోకి..
జిల్లాల పునర్విభజన నేపథ్యంలో చినద్వారపుడి గ్రామంలోని బంధువులు, ఒకే కుటుంబానికి చెందిన కుటుంబీకులు వేర్వేరు జిల్లాల్లోకి వెళ్లడంతో అసహనానికి గురవుతున్నారు. రోడ్డుకి అవతల వైపున ఇల్లు ఉన్న సొంత బావ తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్తే.. రోడ్డుకి ఇవతల వైపున ఉన్న అతని బావమరిది ఇల్లు కోనసీమ జిల్లాలోకి వెళ్లడంతో గందరగోళ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. స్పందించి తమకు దగ్గరలో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో తమ ప్రాంతాన్ని కలపాలని కోనసీమ జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
MLC Anantha Udaya Bhaskar: డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అంగీకరించిన ఎమ్మెల్సీ అనంతబాబు ! సాయంత్రం పోలీసుల ప్రెస్మీట్
Konaseema: ‘కోనసీమ’ పేరు మార్పుపై ఉద్రిక్తతలు, జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ - కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
MLC Anantha Udaya Bhaskar Arrest: ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అరెస్ట్, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచిన పోలీసులు ! ఎందుకు ప్రకటించడం లేదో !
MLC Driver Murder Case: ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ గన్మెన్లు సస్పెండ్, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్సీ అరెస్ట్
Subrahmanyam Death Case: ఎమ్మెల్సీ డ్రైవర్ మృతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదు: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడి
KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్లో ప్రకటించిన కేటీఆర్
CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ పాఠాలు- టెక్ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్లో బిగ్ డీల్
Heart Failure: పెళ్లి కాని వ్యక్తులు గుండె వైఫల్యంతో మరణించే ప్రమాదం ఎక్కువ, కొత్త పరిశోధన ఫలితం
Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?