అన్వేషించండి

ఏపీలో ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్ - జగనన్న గోరుముద్దలో చేరిన మరో పోషకాహారం

జగనన్న గోరుముద్దలో చేరిన మరో పోషకాహారాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేర్చింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ అందించాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.

జగనన్న గోరుముద్దలో చేరిన మరో పోషకాహారాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేర్చింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ అందించాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
పిల్లలలకు పోషకాహారం కోసం...
పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగి జావ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. జగనన్న గోరుముద్ద మెనూలో రాగిజావ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్న శ్రీ సత్యసాయి ఛారిటబుల్‌ ట్రస్టుతో సర్కార్ ఓప్పందాలు చేసుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్‌ సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ప్రతినిధులు ఒప్పందాల పై సంతకాలు చేశారు.
జగనన్న గోరుముద్ద కార్యక్రమం...
జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం. బడి పిల్లల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు వారిలో, డ్రాపౌట్స్‌ను తగ్గించే కార్యక్రమాల్లో భాగంగా వారికి స్కూళ్లోనే రుచికరమైన పౌష్టికాహారాన్ని మధ్యాహ్న భోజనంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44,392 స్కూళ్లలో.. 37,63,698 విద్యార్ధులకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది.  ఈ పథకాన్ని 1 నుంచి 10 వ తరగతి వరకూ అమలు చేస్తోంది.

జనవరి 2020 న నిర్వహించిన సమీక్షలో పిల్లలకు మెరుగైన  పౌష్టికాహారాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా మిడ్‌ డే మీల్స్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్షించి వారికి అందిస్తున్న మెనూలో పలు మార్పులు చేపట్టారు. అందులో భాగంగా రోజు వారీ అందిస్తున్న మెనూతో పాటు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి వారంలో 5 రోజులు గుడ్డు,  మూడు రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని నిర్దేశించారు.
బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వని రోజుల్లో పిల్లలకు తగినంత ఐరన్, కాల్షియం అందించేందుకు వీలుగా చిరుధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే జగనన్న గోరుముద్దలో రాగిజావ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మధ్యాహ్న భోజనంలో చిక్కీ ఇవ్వని రోజుల్లో అందుకు బదులుగా రాగిజావను మెనూలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వారానికి  మూడు రోజుల పాటు రాగిజావను మిడ్‌ డే మీల్స్‌లో భాగం చేశారు. ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్వచ్ఛంద సంస్ధల బాగస్వామ్యం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మిడ్‌ డే మీల్స్‌లో పిల్లలకు రాగిజావ అందించే కార్యక్రమంలో భాగస్వామి అయింది. 
అద్భుతమైన కార్యక్రమమన్న సీఎం జగన్...
ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అని సీఎం జగన్ తెలిపారు. అదే విధంగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన శ్రీ సత్యసాయి ట్రస్ట్‌ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. గోరుముద్ద కార్యక్రమంలో రాగిజావను అదనంగా చేర్చడం ద్వారా మరింత పౌష్టిహాకారం పిల్లలకు అందుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కేవలం గోరుముద్ద కార్యక్రమానికే రూ.1700 కోట్లు ఖర్చు పెడుతున్నామని, మూడున్నరేళ్ల కిందట గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించామని గుర్తు చేశారు. గతంలో కేవలం రూ.600 కోట్లు మాత్రమే మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే తామ ప్రభుత్వ హయాంలో ఆ ఖర్చు దాదాపు మూడు రెట్లు పెరిగిందని అన్నారు. అంతే కాదు విద్యారంగంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని, తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలుపెడితే.. నాడు – నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం చేస్తున్నామని జగన్ వివరించారు.

6వతరగతి ఆ పై తరగతుల్లో ప్రతి తరగతి గదిలో డిజిటిల్‌ స్క్రీన్‌ ఐఎఫ్‌పి ఏర్పాటు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.  30,230 తరగతి గదుల్లో ఈ ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌ (ఐఎఫ్‌పి)లను ఏర్పాటు చేస్తున్నాట్లు చెప్పారు. నాడు–నేడు తొలిదశ పూర్తి చేసుకున్న సుమారు 15వేల స్కూళ్లలో ఈ జూన్‌ నాటికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నామని వెల్లడించారు. నాడు –నేడులో ఆఖరు కాంపొనెంట్‌ 6వతరగతి ఆ పై తరగతులను డిజిటలైజ్‌ చేసే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జియో ఐపీఓకు బోర్డు ఆమోదం.. సెబీకి డాక్యుమెంట్స్ సమర్పించిన రిలయన్స్
జియో ఐపీఓకు బోర్డు ఆమోదం.. సెబీకి డాక్యుమెంట్స్ సమర్పించిన రిలయన్స్
Visakhapatnam Seafarer Killed US Attacks:కేంద్రం పట్టించుకోదు..అమెరికా చేతులెత్తేసింది.. అనాథగా అమెరికా దాడుల్లో చనిపోయిన విశాఖ నావికుడి కుటుంబం !
కేంద్రం పట్టించుకోదు..అమెరికా చేతులెత్తేసింది.. అనాథగా అమెరికా దాడుల్లో చనిపోయిన విశాఖ నావికుడి కుటుంబం !
Space Tech Investment War South India: స్పేస్-టెక్ పెట్టుబడుల సమరం - పిక్సెల్ ఫౌండర్ ట్వీట్‌తో రేగిన దుమారం.. ఏపీ, కర్ణాటక, తమిళనాడు మంత్రుల ఎక్స్‌ప్రెస్ ఆఫర్లు!
స్పేస్-టెక్ పెట్టుబడుల సమరం - పిక్సెల్ ఫౌండర్ ట్వీట్‌తో రేగిన దుమారం.. ఏపీ, కర్ణాటక, తమిళనాడు మంత్రుల ఎక్స్‌ప్రెస్ ఆఫర్లు!
Sri Sathya Sai District Politics: సెగలు రేపుతున్న సత్యసాయి జిల్లా పాలిటిక్స్ - అవినీతిపై ముఖాముఖి చర్చకు కదిరి టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు
సెగలు రేపుతున్న సత్యసాయి జిల్లా పాలిటిక్స్ - అవినీతిపై ముఖాముఖి చర్చకు కదిరి టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లు

వీడియోలు

Sanjay Manjrekar Demands Ban On Vaibhav | వైభవ్‌పై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
Sports Psychologist Warning to Vaibhav | వైభవ్‌పై మైండ్ గేమ్‌పై సైకాలజిస్ట్ కామెంట్స్
Cristiano Ronaldo FIFA World Cup 2026 | వరల్డ్ కప్‌లో రోనాల్డో అట్టర్ ప్లాప్
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్‌లో భారీ దాడులు
Agnisakshi Aishwarya Pisse Remuneration | అగ్నిసాక్షి హీరోయిన్ ఎమోషనల్ లైఫ్ స్టోరీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Home Ministry Kodali Nani Prosecution: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ -చట్టపరమైన ఉచ్చులో మాజీ మంత్రి.. గుడివాడ పాలిటిక్స్‌లో హీట్!
కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ -చట్టపరమైన ఉచ్చులో మాజీ మంత్రి.. గుడివాడ పాలిటిక్స్‌లో హీట్!
Srikakulam Crime News: రైలు కింద పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య.. శ్రీకాకుళంలో విషాదం
రైలు కింద పడి తల్లి, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య.. శ్రీకాకుళంలో విషాదం
Pune Fake Baba Mishra Arrested: పూణేలో నకిలీ బాబా రాసలీలల గుట్టురట్టు - ఆశ్రమంలో గుహ.. 200 మంది పోలీసుల ఆపరేషన్‌లో సంచలన నిజాలు!
పూణేలో నకిలీ బాబా రాసలీలల గుట్టురట్టు - ఆశ్రమంలో గుహ.. 200 మంది పోలీసుల ఆపరేషన్‌లో సంచలన నిజాలు!
AP SSC Supply Results: ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, మెమో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల, మెమో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Maa Inti Bangaram OTT : సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
సమంత మా ఇంటి బంగారం ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
US Iran Peace Deal: హర్మూజ్‌లో నేవీ దిగ్బంధనాన్ని ఎత్తేసిన అమెరికా, నౌకలకు లైన్ క్లియర్- అయినా ట్రంప్ ట్విస్ట్ !
హర్మూజ్‌లో నేవీ దిగ్బంధనాన్ని ఎత్తేసిన అమెరికా, నౌకలకు లైన్ క్లియర్- అయినా ట్రంప్ ట్విస్ట్ !
Ampere Reo VYB Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.. హైదరాబాద్‌లో ఈవీ స్కూటర్ ధర ఎంత
డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు.. హైదరాబాద్‌లో ఈవీ స్కూటర్ ధర ఎంత
Homemade Paneer : ఇంట్లో పనీర్ చేసుకునే పద్ధతి ఇదే.. కేవలం కొన్ని నిమిషాల్లోనే తాజా పనీర్ రెడీ
ఇంట్లో పనీర్ చేసుకునే పద్ధతి ఇదే.. కేవలం కొన్ని నిమిషాల్లోనే తాజా పనీర్ రెడీ
Embed widget