అన్వేషించండి

RRR Vs YSRCP : రాజ్యాంగం చదువుకోవాలని మంత్రి గౌతంరెడ్డికి రఘురామ సలహా..!

సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అన్న మంత్రి మేకపాటి వ్యాఖ్యలపై ఎంపీ రఘురామ సెటైర్లు వేశారు. రాజ్యాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.


రాజధాని అంశంలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదని గౌతం రెడ్డి మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. రాజ్యాంగం తెలియకుండా వ్యాఖ్యలు చేయడం.. సీఎం ఎక్కడ ఉంటే అక్కజ రాజధాని అని మాట్లాజటం ఏమిటని ప్రశ్నించారు. ముందుగా రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని మంత్రికి ఎంపీకి సలహా ఇచ్చారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 164నుచదువు కోవాలన్నారు. ఆ ఆర్టికల్ ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నియామకం గురించి ఉంటుంది. అలాగే మంత్రి రాజ్యాంగంలోని 153, 154 నిబంధనలపై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. రాష్ట్రాల కార్యనిర్వాహక వ్యవస్థలో గవర్నరే సుప్రీమ్‌ అని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి విశేషమైన అధికారాలు ఉన్నవారు కాదని..  మంత్రుల కంటే కొంచెం మాత్రమే ఎక్కువని స్పష్టం చేశారు. ఆర్టికల్ 3పై రాష్ట్రానికి సంబంధించిన మార్పులపై కేంద్రానికి అధికారం ఉందన్నారు. రాజధాని నిర్ణయాన్ని అడ్డుకోవడానికి కేంద్రానికి క్షణం పని అన్నట్లుగా రఘురామ తెలిపారు.  పులివెందుల అయినా.. విజయవాడ అయినా సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని మేకపాటి పాటి స్టేట్‌మెంట్ ఇచ్చిన సమయంలోనే శ్రీభాగ్ ఒప్పందం గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని రఘురామ వ్యాఖ్యానించారు. అసలు శ్రీభాగ్ ఒప్పందం ఎప్పుడు  జరిగిందో.. ఆ చర్చలు దేని కోసం జరిగాయో రఘురామ వివరించారు. 

1937 నవంబర్‌లో శ్రీభాగ్ అనే పేరున్న భవనంలో ప్రముఖులు చర్చలు అందుకే ఆ చర్చలకు ... చేసుకున్న ఒప్పందానికి శ్రీభాగ్ పేరు పెట్టారన్నారు.  శ్రీభాగ్ సమావేశం జరిగిన పదహారేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని రఘురామకృష్ణరాజు మంత్రి గౌతంరెడ్డికి గుర్తు చేశారు. శ్రీభాగ్ భవనంలో జరిగినచర్చల్లో రాజధాని గురించి చర్చ వచ్చినప్పుడు సర్కారు ప్రాంతంలో ఒకటి, రాయలసీమలో ఒకటి ఉండాలని అనుకున్నారని రఘురామ తెలిపారు.  ఆ ఒప్పందం ప్రకారం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక.. కర్నూలులో రాజధాని,  గుంటూరులో కోర్టును ఏర్పాటు చేశారన్నారు. అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ రాజధానిగా ఏర్పడిందని చరిత్ర పాఠాలు చెప్పారు. 

రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి తీరును ప్రెస్‌మీట్‌లో రఘురామ మరోసారి గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోయాక 2014, 15 అసెంబ్లీలో చర్చ సందర్భంగా రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండడానికి జగన్ అంగీకరించారని రఘురామ గుర్తు చేశారు. కానీ ఆయన సీఎం అయిన తర్వాత మాట మార్చారన్నారు. అలాగే ఉద్యోగుల ఆకాంక్ష మేరకు.. సీపీఎస్ స్కీమ్‌ను రద్దు చేస్తామని జగన్ చెప్పినట్లు గుర్తుచేశారు. కానీ చేయలేదన్నారు. ఈ రోజు ఏపీ వ్యాప్తంగా ఉద్యోగులు సీపీఎస్ రద్దు గురించి ఆందోళనలు చేయడంతో రఘురామ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు.  

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Heatwave In AP and Telangana: తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఎండలతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Female Fertility : నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే తల్లి కావడం కష్టమా? సంతానోత్పత్తిపై జరిగిన కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
Embed widget