అన్వేషించండి

YSRCP Vs RaghuRama: రఘురామ వర్సెస్ విజయసాయి పరస్పర ఫిర్యాదులు.. ఎవరి స్కాంలు బయటపడబోతున్నాయి..?

సీఎం జగన్, విజయసాయి ఆర్థిక అవకతవకలపై రాష్ట్రపతి విచారణకు ఆదేశించారని రఘురామ ప్రకటించారు. అదే సమయంలో రఘురామ రుణాలు ఎగ్గొట్టిన కేసులో ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటుందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు... ఆ పార్టీకి మధ్య పోరాటం మరింత ముదురుతోంది. రఘురామకృష్ణరాజు ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారంటూ విజయసాయిరెడ్డి గత వారం రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. అంతకు ముందు పార్టీ ఎంపీలందరితో కలిసి వెళ్లి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రఘురామకృష్ణరాజు బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. తన వ్యాపారాలపై ఫిర్యాదులు చేశారని తెలిసిన తర్వాత రఘురామకృష్ణరాజు కూడా స్పందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి అనేక అక్రమాలకు పాల్పడ్డారని.. సూట్ కేసు కంపెనీలు పుట్టించి భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు. ఆ లేఖలకు వివిధ కంపెనీల లావాదేవీలు వాటికి సీఎం జగన్, విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఇలా మొత్తం వివరాలు జత చేశారు. 

రఘురామ ఫిర్యాదును కేంద్ర ఆర్థిక, హోంశాఖకు పంపిన రాష్ట్రపతి 

రాష్ట్రపతి భవన్ రఘురామకృష్ణరాజు లేఖను అందుకున్నట్లుగా ఎంపీకి ఎక్నాలెడ్జ్ మెంట్ పంపింది. అదే సమయంలో ఆ ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలకు కూడా పంపినట్లుగా సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ప్రకటించారు. రాష్ట్రపతి భవన్‌ను తనకు అందిన లేఖలను పోస్ట్ చేశారు.  

తన ఫిర్యాదుపై నిర్మలా స్పందించారని విజయసాయిరెడ్డి ట్వీట్

రఘురామకృష్ణరాజు ఇలా రాష్ట్రపతి భవన్‌ నుంచి వచ్చిన లేఖలను సోషల్ మీడియాలో పెట్టిన కాసేపటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా రఘురామకృష్ణరాజు కంపెనీలపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతామన్ స్పందించారని సోషల్ మీడియాలో ప్రకటించారు. రఘురామకు చెందిన ఇండ్ - భారత్ కంపెనీలపై త్వరిగతిన విచారణ పూర్తయ్యేలా విచారణ చేస్తామని ఆమె హామీ ఇచ్చినట్లుగా చెప్పుకున్నారు. అయితే నిర్మలాసీతారామన్ హామీ ఇచ్చినట్లుగా చెబుతున్న లేఖను ఆయన పోస్ట్ చేయలేదు. వాస్తవంగా నిర్మలా సీతారామన్ రాసిన లేఖలో చర్యల గురించి చెప్పలేదు.. ఫిర్యాదు అందిందని ఎక్నాలెడ్జ్ మాత్రమే అందులో ఉంది. 

రఘురామపై అనర్హతా వేటు వేయించేందుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా తీవ్రంగా ప్రయత్నిస్తున్న విజయసాయిరెడ్డి .. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. లోక్‌సభ స్పీకర్‌పై ఒత్తిడి పెంచే వ్యాఖ్యలు కూడా చేశారు. మరో వైపు నుంచి రఘురామ వ్యాపారాలపై దృష్టి పెట్టి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతిగా రఘురామకృష్ణరాజు కూడా అదే పని చేస్తున్నారు. సీబీఐ చార్జిషీట్లకు మించిన ఆర్థిక నేరాలు చేశారని వివరాలు రాష్ట్రపతి కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖకి పంపడంతో ఇప్పుడు రఘురామకృష్ణరాజుదే పైచేయి అయినట్లయింది. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన సూచలను సీరియస్‌గా కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖ తీసుకుంటే ఈ వివాదం మరింత ముదిరే అవకాశం  ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget