అన్వేషించండి

Vijayawada News: అంబులెన్సులో దుర్గమ్మ భక్తులు - అవాక్కయిన పోలీసులు!

Andhra News: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికం కావడంతో పోలీసులు వారిని నియంత్రించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ అంబులెన్సులో భక్తులు తరలిరావడం చూసి అవాక్కయ్యారు.

Devotees Travelled In Ambulance In Vijayawada: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. దసరా సందర్భంగా భక్తుల రద్దీ అధికం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. వీవీఐపీ, వీఐపీ సహా సాధారణ క్యూలైన్లు సైతం కిక్కిరిసిపోయాయి. భక్తులను అదుపు చేయలేక పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆలయ పరిసరాల్లోకి వాహనాలను అనుమతించడం లేదు. కేవలం అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ అంబులెన్స్ ఆలయం దగ్గరకు వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు 108 వాహనాన్ని ఘాట్ రోడ్డు ఎంట్రన్స్‌లో ఆపి తనిఖీ చేశారు. అందులో చాలామంది దుర్గమ్మ భక్తులను చూసి కంగుతిన్నారు.

జీతాల్లేవని..

ఈ విషయంపై అంబులెన్స్ సిబ్బందిని ప్రశ్నించగా.. తమకు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదని వాపోయారు. అందుకే డబ్బుల కోసం ఇలా భక్తులను తరలించామని చెబుతున్నారు. భక్తులు డబ్బులు ఇస్తే.. వాటితో పండుగ ఖర్చులకు వస్తాయని ఇలా చేసినట్లు చెప్పారు. అటు, అమ్మవారి దర్శనం కోసం వర్షంలోనూ భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనం కోసం నిరీక్షించలేక సహనం కోల్పోయి ఘాట్‌రోడ్‌లోని ముఖద్వారం గేట్లను తోసుకుంటూ పరుగులు తీశారు. పోలీసులు, మీడియాను సైతం నెట్టుకుంటూ చొచ్చుకొచ్చారు. వారిని నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు.

రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ

అటు, దసరా సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు అభయమిచ్చారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కొండపైకి వచ్చేందుకు ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో సాహసంతో కొండపైకి చేరుకుంటున్నారు. కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు అమ్మవారు హంస వాహనంపై కృష్ణా నదిలో విహరిస్తారు. అయితే, ఆనవాయితీగా జరిగే ఈ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రేక్ పడింది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పై నుంచి వస్తుండడంతో తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నదీ విహారానికి అనుమతి లేనందున్న ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకూ తీసుకెళ్లి హంస వాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 

Also Read: Vijayawada News: రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Breaking News: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు 
కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ట్రంప్ ఒప్పందంపై మొజ్తాబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు 
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
AP Local Body Elections: కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
కూటమిలో జనసేన కుంపటి! వైసీపీ ట్రాప్‌లో పడొద్దని టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక ఆదేశాలు
Embed widget