అన్వేషించండి

Vijayawada News: అంబులెన్సులో దుర్గమ్మ భక్తులు - అవాక్కయిన పోలీసులు!

Andhra News: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికం కావడంతో పోలీసులు వారిని నియంత్రించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఈ క్రమంలో ఓ అంబులెన్సులో భక్తులు తరలిరావడం చూసి అవాక్కయ్యారు.

Devotees Travelled In Ambulance In Vijayawada: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు పడరాని పాట్లు పడుతున్నారు. దసరా సందర్భంగా భక్తుల రద్దీ అధికం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించారు. వీవీఐపీ, వీఐపీ సహా సాధారణ క్యూలైన్లు సైతం కిక్కిరిసిపోయాయి. భక్తులను అదుపు చేయలేక పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆలయ పరిసరాల్లోకి వాహనాలను అనుమతించడం లేదు. కేవలం అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఓ అంబులెన్స్ ఆలయం దగ్గరకు వచ్చింది. అనుమానం వచ్చిన పోలీసులు 108 వాహనాన్ని ఘాట్ రోడ్డు ఎంట్రన్స్‌లో ఆపి తనిఖీ చేశారు. అందులో చాలామంది దుర్గమ్మ భక్తులను చూసి కంగుతిన్నారు.

జీతాల్లేవని..

ఈ విషయంపై అంబులెన్స్ సిబ్బందిని ప్రశ్నించగా.. తమకు 3 నెలల నుంచి జీతాలు రావడం లేదని వాపోయారు. అందుకే డబ్బుల కోసం ఇలా భక్తులను తరలించామని చెబుతున్నారు. భక్తులు డబ్బులు ఇస్తే.. వాటితో పండుగ ఖర్చులకు వస్తాయని ఇలా చేసినట్లు చెప్పారు. అటు, అమ్మవారి దర్శనం కోసం వర్షంలోనూ భక్తులు భారీగా తరలివస్తున్నారు. దర్శనం కోసం నిరీక్షించలేక సహనం కోల్పోయి ఘాట్‌రోడ్‌లోని ముఖద్వారం గేట్లను తోసుకుంటూ పరుగులు తీశారు. పోలీసులు, మీడియాను సైతం నెట్టుకుంటూ చొచ్చుకొచ్చారు. వారిని నిలువరించలేక పోలీసులు చేతులెత్తేశారు.

రాజరాజేశ్వరి అలంకారంలో దుర్గమ్మ

అటు, దసరా సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు అభయమిచ్చారు. సాధారణ భక్తులతో పాటు భవానీ మాలధారులు సైతం అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చిన్నపిల్లలు, వృద్ధులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. కొండపైకి వచ్చేందుకు ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో సాహసంతో కొండపైకి చేరుకుంటున్నారు. కాగా, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల చివరి రోజు అమ్మవారు హంస వాహనంపై కృష్ణా నదిలో విహరిస్తారు. అయితే, ఆనవాయితీగా జరిగే ఈ దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవానికి ఈసారి నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో బ్రేక్ పడింది. సుమారు 40 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం పై నుంచి వస్తుండడంతో తెప్పోత్సవం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నదీ విహారానికి అనుమతి లేనందున్న ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకూ తీసుకెళ్లి హంస వాహనంపై శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. 

Also Read: Vijayawada News: రాజరాజేశ్వరి దేవిగా బెజవాడ దుర్గమ్మ - ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu supports Pawan Kalyan: పవన్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు - తెలంగాణ రచ్చపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ప్రస్తావన!
పవన్‌ను అడ్డుకోవడం కరెక్ట్ కాదు - తెలంగాణ రచ్చపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. డీకే శివకుమార్ ప్రస్తావన!
Breaking News: తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణలో పవన్ సభను అడ్డుకోవడం సరికాదు: ఏపీ సీఎం చంద్రబాబు
Dhee Show Pandu: పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?
పండు మాస్టర్‌కు యాక్సిడెంట్... విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్ళకూ?
Professor Kodandaram: పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం
పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం అవసరం లేదు.. ఇది తెలంగాణ అస్తిత్వంపై దెబ్బ: ప్రొఫెసర్ కోదండరాం

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
Embed widget