అన్వేషించండి

Chittoor Police : ప్రశాంతమైన పుంగనూరులో అల్లర్లకు కుట్ర - చిత్తూరు పోలీస్ అధికారుల సంఘం విమర్శలు!

పుంగనూరులో అరాచకం సృష్టించడానికే చంద్రబాబు వచ్చారని పోలీసు అధికారుల సంఘం నేతలు ఆరోపించారు.

 

Chittoor Police :  చిత్తూరు జిల్లా పుంగనూరులో పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన పోలీస్ అసోసియేషన్ ఖండించింది.  పుంగనూరు పర్యటనలో చంద్రబాబు రోడ్ మ్యాప్ ఉల్లంఘనకు పాల్పడ్డారని పోలీస్ అసోసియేషన్ నేతలు ఆరోపించారు.  వైసిపి నిరసన కోసం అనుమతి తీసుకుంటే.  అదే సమయంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారని పోలీసులు ఆరోపించారు.  పట్టణంలోకి ప్రవేశించి చంద్రబాబు విధ్వంసకాండ సృష్టించారని..  కొందరు టిడిపి కార్యకర్తలు పోలీసుల వాహనాలను ధ్వంసం చేసి పోలీసులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.  ప్రజాస్వామ్యానికి రక్షణ గోడలుగా నిలిచే పోలీసుల పై దాడి హేయమైన చర్య అన్నారు.  పోలీస్ శాఖ అధికారులు ఎంత నచ్చచెప్పిన టిడిపి కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరన్నారు.  కేవలం ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో అల్లర్లు సృష్టించాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నాలు చేశాయని..  ప్రణాళిక ప్రకారమే పోలీసులపై రాళ్ల దాడి., ఆయుధాలతో దాడి చేయడం జరిగిందన్నారు. 

టీడీపీ నేతలపైనే ఎస్పీ ఆరోపణ           

పుంగనూరులో చంద్రబాబు ప్రాజెక్టుల యాత్ర సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి  కూడా చంద్రబాబుదే తప్పని ప్రకటించారు. ప్ర తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఉదయం అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబునాయుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అని సంబోధించారని తెలిపారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్నారు.    
 ఆ తర్వాత చంద్రబాబునాయుడు అక్కడి నుంచి అంగళ్లు గ్రామానికి వస్తున్నప్పుడు .. తంబళ్లపల్లె ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. అంగళ్లు గ్రామంలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రోడ్‌ను బ్లాక్ చేశారని తెలిపారు. నిరసన వ్యక్తం చేయడానికే ఇలా వైసీపీ కార్యకర్తలు రోడ్డును బ్లాక్ చేశారన్నారు. ఇలా చేసినందుకు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో అటు వైసీపీ, ఇటు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారని.. తెలిపారు. అంగళ్లు గ్రామానికి చంద్రబాబు వచ్చిన తర్వాత.. కార్యకర్తలను మరింతగా రెచ్చగొట్టారని ఎస్పీ తెలిపారు. 

వైసీపీ కార్యకర్తలు, పోలీసుల మీద టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు : ఎస్పీ రిషాంత్ రెడ్డి 

వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మీద.. పోలీసుల మద దాడులు చేయాలని చంద్రబాబు రెచ్చగొట్టారన్నారు. అలాగే డీఎస్పీని అవమనించేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ పై రాళ్లు దాడులు చేశారన్నారు. అప్పుడు చాలా మందికి గాయాలయ్యాయని తెలిపారు. ఈ దాడుల కారణంగా.. లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారడంతో చంద్రబాబును కాన్వాయ్ ను పుంగనూరు కు వెళ్లకుండా..  రోడ్లకు అడ్డంగా బారీకేడ్లు ఏర్పాటు చేసి.. దారి మళ్లించామని ..బైపాస్ రోడ్ మీదుగా రోడ్ షాను రూట్ మార్చామన్నారు. అయితే అప్పటికే చంద్రబాబు కోసం ఎదురు చూస్తున్న కార్యకర్తలు.. పోలీసుల మీద దాడి చేశారని రిషాంత్ రెడ్డి తెలిపారు. 

అదుపు చేయడానికే రబ్బర్ బుల్లెట్లు టియర్ గ్యాస్ ప్రయోగం 

టీడీపీ కార్యకర్తల దాడిలో రెండు పోలీసు వాహాలు తగలబబడిపోయాయనని తెలిపారు. ఇందులో ఒక బస్సు, ఒక  వజ్ర వాహనం ఉందన్నారు. ఇరవై మందికిపైగా పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయన్నారు. దాడులు చేస్తున్న టీడీపీ కార్యకర్తల్ని అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించామని.. అయినా పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారన్నారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.  ఉద్రిక్తతల కారణంగా చంద్రబాబును పుంగనూరులోకి రాకుండా అడ్డుకున్నమని.. అందుకే పోలీసులపై దాడులు చేశారన్నారు. రాజకీయ కక్షలు రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప పోలీసులపై దాడులు చేయడం కరెక్ట్ కాదని ఎస్పీ చెప్పారు. పోలీసులపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడులు చేశారని ..ఈ ఘటనలో  ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలి పెట్టేది లేదని ఆయన ప్రకటించారు.          

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget