అన్వేషించండి

MLA Payyavula Kesav: ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై పోలీసు కేసు - 341,188 సెక్షన్ల కింద నమోదు

టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతులకు మద్దతుగా ఆందోళన చేసినందుకే కేసు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Police case on Payyavula Keshav: అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదైంది. 341,188 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు రిజిస్ట్రర్‌  చేశారు ఉరవకొండ అర్బన్ పోలీసులు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌ కింద పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ రైతులతో కలిసి ఆందోళనకు చేశారు టీడీపీ  సీనియర్‌ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌. అంతకుముందు గుంతకల్లు బ్రాంచి కెనాల్‌ ఆయకట్టు రైతులతోనూ పయ్యావుల సమావేశమయ్యారు. రైతులతో కలిసి  రహదారిపై బైఠాయించి ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయన్ను ఆరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఇప్పుడు పయ్యావులపై కేశవ్‌ ఐపీసీ సెక్షన్లు 341,188 కింద  కేసు నమోదు చేశారు.

జీబీసీ కాల్వకు నీటిని నిలిపివేయడంతో 30వేల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. రైతులు 300 కోట్ల రూపాయల విలువైన పంటలను నష్టపోతున్నారు. హంద్రీనీవా నీటిని  పంటలు ఇవ్వకపోగా.. నీరు వృథాగా పోతుడటంతో రైతులు రగిలిపోతున్నారు. దీంతో.. రైతులకు మద్దతుగా నిలబడ్డారు పయ్యావుల కేశవ్‌. రైతులు నష్టపోతున్నా ఈ  ప్రభుత్వానికి పట్టదా? కాల్వ నిండా నీరు వెళ్తున్నా ఒక్క తడి ఇవ్వలేరా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతులతో కలిసి ఆందోళన చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్రభుత్వాన్ని రైతుల పక్షాన నిలబడి నిలదీశారు. హంద్రీ-నీవా నీరు వృథాగా పోతుంటే రైతులకు కడుపు మండిపోతోందని, రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం  స్పందించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఆందోళన చేస్తున్న పయ్యావులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పయ్యావులను అరెస్ట్ సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.  రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పయ్యావులను అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది.  అతికష్టం మీద ఆయన్ను కనేకల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు... ఆ తర్వాత విడిచిపెట్టారు. ఇప్పుడు ఆయనపై కేసులు కూడా నమోదు చేశారు.

హంద్రీనీవా నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు సాగు నీటిని ఇవ్వాలంటూ ఆందోళన చేసిన పయ్యావుల కేశవ్‌పై కేసు నమోదు చేయడంపై రైతులు మండిపడుతున్నారు.  టీడీపీ నేతలు కూడా పయ్యావుల కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదన్నారు. రైతులకు హంద్రీనీవా నుంచి గుంతకల్  బ్రాంచ్ కెనాల్‌కు నీటిని ఇచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని అంటున్నారు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

టాప్ హెడ్ లైన్స్

Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget