అన్వేషించండి

Payyvula Kesav : ఓట్లు తొలగించిన ఉద్యోగులు జైలుకే - కుట్ర చేసిన వాళ్లంతా బయటకు వస్తారన్న పయ్యావుల కేశవ్ !

ఓట్లు తొలగించిన ఉద్యోగులు జైలుకు వెళ్లడం ఖాయమని పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. తొలగించిన ప్రతీ ఓటుపై నిశిత పరిశీలన జరుగుతోందన్నారు.

 

Payyvula Kesav :  ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు అంశం వివాదాస్పదమవుతోంది. 022 నుంచి తొలగించిన ప్రతి ఓటుపై రీవెరిఫికేషన్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన  ఓట్ల తొలగింపుపై తాము చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తో ఓట్ల డెలిషన్ చేయమంటే అరెస్ట్ చేయాలన్న నిబంధన ఉందని .. ఎవరైనా ఓట్ల తొలగించినా.. అక్రమంగా తొలగించేందుకు దరఖాస్తు చేసినా అరెస్ట్ తప్పదన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో అక్రమంగా ఓట్ల తొలగింపు వ్యవహారంలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్ ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు.                       

మున్ముందు మరింత మందిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుటుందని పయ్యావుల ప్రకటించారు.  రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల అక్రమ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని నిశిత పరిశీలన చేయాలని ఆదేశించిందని చెప్పారు.  2022 నుంచి తొలగించిన ప్రతి ఓటుపై రీవెరిఫికేషన్ చేయాలని ఎన్నికల కమిషన్ చెప్పిందని ఈ మేరకు బుధవారమే  స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. ఇక బల్క్ గా ఓట్లు తొలగించే ప్రక్రియ ఉండదని స్పష్టం చేశారు.  అలా ఇస్తే ఏఈఆర్ఓ నేరుగా వాటిని పరిశీలించి, చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఇతర అభ్యంతరాలు ఏమైనా బల్క్ గా ఉంటే.. కొన్ని నిబంధనలు ఇచ్చారని పేర్కొన్నారు.               

 ఏఈఆర్ఓ, బీఎల్ఓ, డిప్యూటీ తహసీల్దార్ ముగ్గరి కమిటీతో ఎంక్వైరీ చేసిన తర్వాతనే బల్క్ గా ఓట్లను తొలగించే ప్రక్రియ ఉంటుందని.. ఇప్పటి వరకూ తీసేసిన ఓట్ల విషయంలో  తదుపరి విచారణ జరుగుతుందని, అందరూ బయటకు వస్తారని పయ్యావుల హెచ్చరించారు.  ఇప్పటి వరకు సచివాలయ ఉద్యోగులతో ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియ సాగిందన్నారు. అధికార పార్టీ చెప్పినట్టు ఇప్పటివరకు సాగింది ఇక అలా జరగదని స్పష్టం చేశారు. సస్పెన్షన్ కు గురవుతున్న అధికారులను ఎవరూ కాపాడలేరని తెలిపారు. ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ.. ఈసీని ఎవరూ ప్రభావితం చేయలేరని  పయ్యావలు కేశవ్ స్పష్టం చేశారు.                         

జాబితా నుంచి ఓట్లు పోవడం కాదు.. ఉద్యోగుల జాబితా నుంచి తొలగింపులు ఉంటాయని హెచ్చరంచారు.  ఎవరి ఓటు ఎక్కడుండాలో డిసైడ్ చేయాల్సింది నాయకులు కాదని ఓటర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే పులివెందులలో జగన్ ఓటు ఉండటం నేరమని వైసీపీ నేతలను ఉద్దేశించి పేర్కొన్నారు.  అధికారులు జాగ్రత్తగా పని చేయాలని లేకపోతే అది వారి మెడకు చుట్టుకుంటుందని హెచ్చరించారు. తొలగించిన ప్రతి ఓటుపై నిశిత పరిశీలన చేయాలని ఈసీ ఆదేశించడంతో రాజకీయంగానూ కలకలం రేపుతోంది.                      

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DMK Uncivilised Heated Argument in Parliament | నోరు జారిన ధర్మేంద్ర ప్రధాన్..ఒళ్లు దగ్గర పెట్టుకోమన్న స్టాలిన్ | ABP DesamChampions Trophy 2025 Winners Team India | కాలు కదపకుండా ఆడి ట్రోఫీ కొట్టేశామా | ABP DesamRohit Sharma Virat Kohli Kolatam | వైట్ కోటులతో రచ్చ చేసిన టీమిండియా హీరోలు | ABP DesamRohit Sharma Fitness Champions Trophy 2025 | ఫిట్ నెస్ లేకుండానే రెండు ఐసీసీ ట్రోఫీలు కొట్టేస్తాడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Posani Krishna Murali: పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
పోసానికి ఎట్టకేలకు విముక్తి - బుధవారం విడుదలయ్యే చాన్స్
BRSLP : డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
డిప్యూటీ లీడర్లను నియమిస్తాం - అసెంబ్లీలో పోరాడండి - ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం
New Immigration Bill: వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు- కొత్త చట్టం తీసుకొచ్చిన కేంద్రం
Group 2 Results: తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
తెలంగాణలో గ్రూప్ 2 ఫలితాలు విడుదల, రిజల్ట్ చెక్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్
Pakistan Passenger Train Hijacked: పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
పాకిస్తాన్‌లో ట్రైన్‌ హైజాక్ - బలూచిస్తాన్ రెబల్స్ వద్ద వందల మంది బందీలు 
Rajamouli: ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
ప్రభాస్ 'కల్కి' సినిమాకు భిన్నంగా కాశీ చరిత్రను చూపేలా SSMB29 ప్లాన్ చేసిన రాజమౌళి!
Robots Into SLBC Tunnel: రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
రంగంలోకి దిగిన రోబోలు.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 7 మంది ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం
Court: State vs A Nobody: నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
నాని నిర్మించిన 'కోర్టు'పై పుష్పరాజ్ ఎఫెక్ట్... సంధ్య థియేటర్ ఘటనతో మార్పులు
Embed widget