అన్వేషించండి

Mudragada: కలిసేందుకు ఆసక్తి చూపని పవన్ కల్యాణ్ - ముద్రగడకు దారేది ?

Mudragada : ముద్రగడను కలిసేందుకు పవన్ కల్యాణ్ ఆసక్తి చూపలేదు. ఆయన వస్తారు. పార్టీలోకి ఆహ్వానిస్తారని ముద్రగడ అనుకున్నారు. ఇప్పుడు ముద్రగడ ఏం చేస్తారన్నది కీలకంగా మారింది.

Mudragada: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పవన్ కల్యాణ్ కలవలేదు. గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చి చాలా మందిని కలిశారు కానీ ముద్రగడ వైపు వెళ్లలేదు. మొదట వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఆయనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని.. జనవరి ఒకటో తేదీన వైసీపీలో చేరే ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ ఆయనకు ఎక్కడా టిక్కెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం.. టిక్కెట్ల కసరత్తు లో అసలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. వైసీపీలో చేరడం లేదని ప్రకటించారు.  దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. 

ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆసక్తి చూపని పవన్ కల్యాణ్                              

ముద్రగడను కలిసిన జనసేన నేతలు.. పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వచ్చి మరి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయనకు భరోసా కల్పించారు. అయితే, ఈ ప్రచారం నెల రోజులు దాటినా కూడా ముద్రగడను మాత్రం జనసేనాని కలవలేదు.  రెండు రోజుల వ్యవధిలో భీమవరం,  రాజమండ్రిలో పర్యటించినప్పటికి ముద్రగడను పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. దీంతో, ముద్రగడ పోల్టికల్ రీఎంట్రీ లేనట్లేనని తెలుస్తోంది.  ఏపీలో ఇప్పటికే జనసేన తప్ప మిగితా అన్ని పార్టీలు ముద్రగడకు డోర్స్ క్లోజ్ చేసినట్లేనని అర్థమవుతోంది. పవన్‌ రాకపై ముద్రగడ స్పందిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. మనం చెప్పాల్సింది చెప్పాం తర్వాత మనం..చేసేది ఏమి లేదంటూ చెప్పుకొచ్చారు. 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ముద్రగడ -  టిక్కెట్ ఇవ్వని వైసీపీ                                
 
పది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ..త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేశాయి.  ఏపీ రాజకీయాల్లో కాపు ఉద్యమనేతగా పేరు పొందారు ముద్రగడ పద్మనాభం. గతంలో జనసేన అధినేతపై విమర్శలు, సెటైర్లతో లేఖలు రాశారు. దమ్ముంటే తనపై పోటీ చెయ్యాలంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతూ లేఖ రాశారు. దీంతో జనసైనికుల మధ్య ముద్రగడ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.

ముద్రగడ కాపు సామాజికవర్గంలో నమ్మకం  కోల్పోయారా ?        

ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలోనూ తన పలుకుబడి కోల్పోయారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసింది.  అయితే ఈ అంశంపై ముద్రగడ పద్మనాభం పెద్దగా స్పందించలేదు. పైగా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నందన తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించారు. ఇలాంటి పరిణామాలతో ముద్రగడ రాజకీయంగా పలుకుబడి కోల్పోయారని రాజకీయ వర్గాలంటున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Nagoba Jatara: నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
నెలవంకను దర్శించుకున్న మెస్రం వంశీయులు.. కేస్లాపూర్ నాగోబా మహాపూజలకు శ్రీకారం
Embed widget