అన్వేషించండి

Mudragada: కలిసేందుకు ఆసక్తి చూపని పవన్ కల్యాణ్ - ముద్రగడకు దారేది ?

Mudragada : ముద్రగడను కలిసేందుకు పవన్ కల్యాణ్ ఆసక్తి చూపలేదు. ఆయన వస్తారు. పార్టీలోకి ఆహ్వానిస్తారని ముద్రగడ అనుకున్నారు. ఇప్పుడు ముద్రగడ ఏం చేస్తారన్నది కీలకంగా మారింది.

Mudragada: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను పవన్ కల్యాణ్ కలవలేదు. గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చి చాలా మందిని కలిశారు కానీ ముద్రగడ వైపు వెళ్లలేదు. మొదట వైసీపీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఆయనకు ఎంపీ లేదా ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని.. జనవరి ఒకటో తేదీన వైసీపీలో చేరే ప్రకటన చేస్తారని అనుకున్నారు. కానీ ఆయనకు ఎక్కడా టిక్కెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం.. టిక్కెట్ల కసరత్తు లో అసలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన నిరాశకు గురయ్యారు. వైసీపీలో చేరడం లేదని ప్రకటించారు.  దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. 

ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆసక్తి చూపని పవన్ కల్యాణ్                              

ముద్రగడను కలిసిన జనసేన నేతలు.. పవన్‌ కల్యాణ్‌ ఇంటికి వచ్చి మరి పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆయనకు భరోసా కల్పించారు. అయితే, ఈ ప్రచారం నెల రోజులు దాటినా కూడా ముద్రగడను మాత్రం జనసేనాని కలవలేదు.  రెండు రోజుల వ్యవధిలో భీమవరం,  రాజమండ్రిలో పర్యటించినప్పటికి ముద్రగడను పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు. దీంతో, ముద్రగడ పోల్టికల్ రీఎంట్రీ లేనట్లేనని తెలుస్తోంది.  ఏపీలో ఇప్పటికే జనసేన తప్ప మిగితా అన్ని పార్టీలు ముద్రగడకు డోర్స్ క్లోజ్ చేసినట్లేనని అర్థమవుతోంది. పవన్‌ రాకపై ముద్రగడ స్పందిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. మనం చెప్పాల్సింది చెప్పాం తర్వాత మనం..చేసేది ఏమి లేదంటూ చెప్పుకొచ్చారు. 

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ముద్రగడ -  టిక్కెట్ ఇవ్వని వైసీపీ                                
 
పది సంవత్సరాలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ముద్రగడ..త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేశాయి.  ఏపీ రాజకీయాల్లో కాపు ఉద్యమనేతగా పేరు పొందారు ముద్రగడ పద్మనాభం. గతంలో జనసేన అధినేతపై విమర్శలు, సెటైర్లతో లేఖలు రాశారు. దమ్ముంటే తనపై పోటీ చెయ్యాలంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసురుతూ లేఖ రాశారు. దీంతో జనసైనికుల మధ్య ముద్రగడ మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది.

ముద్రగడ కాపు సామాజికవర్గంలో నమ్మకం  కోల్పోయారా ?        

ముద్రగడ పద్మనాభం కాపు సామాజికవర్గంలోనూ తన పలుకుబడి కోల్పోయారని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసింది.  అయితే ఈ అంశంపై ముద్రగడ పద్మనాభం పెద్దగా స్పందించలేదు. పైగా తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నందన తాను ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వాన్ని సమర్థించారు. ఇలాంటి పరిణామాలతో ముద్రగడ రాజకీయంగా పలుకుబడి కోల్పోయారని రాజకీయ వర్గాలంటున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: 20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
20 లక్షల మందికి తల్లికి వందనం ఎగ్గొడతారా - చంద్రబాబుపై షర్మిల తీవ్ర విమర్శలు
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget